ఒకే అంశానికి సంబంధించి రెండు భిన్నమైన వ్యవహారాలు తాజాగా వెలుగు చూశాయి. మూడు నెలల క్రితం బెంగళూరు శివారులో నిర్వహించిన ఒక పార్టీ రేవ్ పార్టీగా పేర్కొంటూ అప్పట్లో బెంగళూరు పోలీసులు దాడులు చేయటం.
టాలీవుడ్ నటి హేమ పేరు రావటం తెలిసిందే. ఆ టైంలో తాను హైదరాబాద్ లో ఉన్నట్లుగా ఆమె చెప్పటం.. ఆ తర్వాత ఆమె సదరు పార్టీలో ఉన్న విషయం బయటకు వచ్చింది. అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారం అప్పట్లో పెను సంచలనంగా మారింది.
అయితే.. బెయిల్ పైన విడుదలైన హేమ గురువారం ఒక వీడియోను పోస్టు చేశారు. అందులో తన లాయర్ నుంచి తనకు ఇప్పుడే ఫోన్ వచ్చిందని.. తాను శుభవార్త విన్నట్లుగా పేర్కొన్నారు. రేవ్ పార్టీలో తాను డ్రగ్స్ తీసుకోలేదని మొదట్నించి చెబుతున్నానని.. అదే నిజమని ఇప్పుడు తేలినట్లు చెప్పారు.
పోలీసులు సేకరించిన తన బ్లడ్ శాంపిల్స్ లో తాను డ్రగ్స్ తీసుకోలేదని రిపోర్టు వచ్చినట్లుగా పేర్కొన్నారు. హేమ వీడియో ఇలా ఉండగా.. ఇదే ఉదంతానికి సంబంధించి తాజాగా పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ వేశారు.
అందులో రేవ్ పార్టీకి సంబంధించిన పలు అంశాల్ని వివరంగా పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీల అభియోగ పత్రంలో నటి హేమతో పాటు మొత్తం 79 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా పేర్కొనటం గమనార్హం. విజయవాడకు చెందిన వ్యాపారి ఎల్.
వాసుకు చెందిన విక్టరీ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ తన మొదటి వార్షికోత్సవాన్ని రేవ్ పార్టీగా మార్చినట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఛార్జ్ షీట్ లో పోలీసులు ప్రతి నిందితుడి పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఓవైపు తాను డ్రగ్స్ తీసుకోలేదని.. తనకు గుడ్ న్యూస్ వచ్చిందని హేమ పేర్కొంటే.. మరోవైపుపోలీసులు డ్రగ్స్ తీసుకున్న వారి పేర్లను ప్రస్తావిస్తూ.. పోలీసులు చార్జ్ షీట్ వేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
This post was last modified on September 13, 2024 10:38 am
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పటివరకు ఆయన మీద ఆరోపణలు…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పదే పదే చెబుతున్న జమిలి ఎన్నికలకు తాజాగా మరింత ముందడుగు పడింది. జమిలి ఎన్నికలకు…
రాజమౌళి కుటుంబం నుంచి వచ్చాడనే పేరు, కీరవాణి వారసుడనే బ్రాండ్ హీరోగా శ్రీసింహకు తొలినాళ్లలో ఉపయోగపడ్డాయి కానీ అతనితో సినిమాలు…
ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కంగనా రౌనత్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన సినిమా ఎమర్జెన్సీ సెన్సార్ అడ్డంకులు దాటుకున్నా…