ఒకే అంశానికి సంబంధించి రెండు భిన్నమైన వ్యవహారాలు తాజాగా వెలుగు చూశాయి. మూడు నెలల క్రితం బెంగళూరు శివారులో నిర్వహించిన ఒక పార్టీ రేవ్ పార్టీగా పేర్కొంటూ అప్పట్లో బెంగళూరు పోలీసులు దాడులు చేయటం.
టాలీవుడ్ నటి హేమ పేరు రావటం తెలిసిందే. ఆ టైంలో తాను హైదరాబాద్ లో ఉన్నట్లుగా ఆమె చెప్పటం.. ఆ తర్వాత ఆమె సదరు పార్టీలో ఉన్న విషయం బయటకు వచ్చింది. అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారం అప్పట్లో పెను సంచలనంగా మారింది.
అయితే.. బెయిల్ పైన విడుదలైన హేమ గురువారం ఒక వీడియోను పోస్టు చేశారు. అందులో తన లాయర్ నుంచి తనకు ఇప్పుడే ఫోన్ వచ్చిందని.. తాను శుభవార్త విన్నట్లుగా పేర్కొన్నారు. రేవ్ పార్టీలో తాను డ్రగ్స్ తీసుకోలేదని మొదట్నించి చెబుతున్నానని.. అదే నిజమని ఇప్పుడు తేలినట్లు చెప్పారు.
పోలీసులు సేకరించిన తన బ్లడ్ శాంపిల్స్ లో తాను డ్రగ్స్ తీసుకోలేదని రిపోర్టు వచ్చినట్లుగా పేర్కొన్నారు. హేమ వీడియో ఇలా ఉండగా.. ఇదే ఉదంతానికి సంబంధించి తాజాగా పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ వేశారు.
అందులో రేవ్ పార్టీకి సంబంధించిన పలు అంశాల్ని వివరంగా పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీల అభియోగ పత్రంలో నటి హేమతో పాటు మొత్తం 79 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా పేర్కొనటం గమనార్హం. విజయవాడకు చెందిన వ్యాపారి ఎల్.
వాసుకు చెందిన విక్టరీ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ తన మొదటి వార్షికోత్సవాన్ని రేవ్ పార్టీగా మార్చినట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఛార్జ్ షీట్ లో పోలీసులు ప్రతి నిందితుడి పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఓవైపు తాను డ్రగ్స్ తీసుకోలేదని.. తనకు గుడ్ న్యూస్ వచ్చిందని హేమ పేర్కొంటే.. మరోవైపుపోలీసులు డ్రగ్స్ తీసుకున్న వారి పేర్లను ప్రస్తావిస్తూ.. పోలీసులు చార్జ్ షీట్ వేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
This post was last modified on September 13, 2024 10:38 am
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…