సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలిలో తోడవుతున్న స్టార్ అట్రాక్షన్లు అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. నాగార్జున ఇప్పటికే సెట్లో అడుగు పెట్టగా ఉపేంద్ర ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్నాడు. త్వరలో అమీర్ ఖాన్ ప్రవేశిస్తాడని చెన్నై టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ ప్రాధమికంగా స్టోరీకి సంబంధించిన డిస్కషన్ లోకేష్, అమీర్ ల మధ్య జరిగిందని, ఒకవేళ ఓకే అయితే మాత్రం ఇండియాలోనే మోస్ట్ సెన్సేషనల్ మల్టీస్టారర్ గా కూలి నిలుస్తుందని చెప్పొచ్చు. అగ్రిమెంట్ అయిపోయి సంతకాలు జరిగితేనే అధికారిక ప్రకటన వస్తుంది.
జైలర్ లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ క్యామియోలు బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యాక చాలా మంది దర్శకులు ఆ రూట్ లో ఆలోచించడం మొదలుపెట్టారు. దీనికన్నా ముందే లోకేష్ కనగరాజ్ తన విక్రమ్ లో సూర్య పోషించిన రోలెక్స్ క్యారెక్టర్ ద్వారా ఈ ట్రెండ్ సృష్టించాడు కానీ ఈసారి దాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు. బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న కూలిలో ఎనభై దశకం నాటి కథ ఉంటుందట. ఏ పాత్ర తాలూకు డీటెయిల్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ కూడా రజనికి జోడినా కాదా అనేది బయట పెట్టడం లేదు.
వచ్చే ఏడాది విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న కూలి ఖచ్చితంగా ప్రభాస్ రికార్డులు బద్దలు కొడుతుందనే నమ్మకం తలైవర్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం మీద భారీ హైప్ ఉంది. వచ్చే నెల వెట్టయన్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న రజనీకాంత్ ఆపై ఏడాది తిరక్కుండానే 2025లో కూలితో వచ్చేస్తారు. ఏడాదికి ఒక సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఈ వయసులోనూ వేగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవలే వచ్చిన మానసిలాయో వీడియో సాంగ్ ఆన్ లైన్ లో చేస్తున్న హల్చల్ మాములుగా లేదు. ఎక్కడ చూసినా మంజు వారియర్ స్టెప్పుల గురించే చర్చ.
This post was last modified on September 12, 2024 3:20 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…