ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ లో కనిపిస్తున్న ఆసక్తికరమైన అంశం ఒకప్పుడు ఫ్లాప్, డిజాస్టర్ గా ముద్రపడిన సినిమాలు ఇప్పుడు భారీ వసూళ్లు రాబట్టడం. ఆరెంజ్ కలెక్షన్లకు నిర్మాత నాగబాబు తెల్లబోవడం చూశాం. ఇదేదో అప్పుడే చూసి ఉంటే నాకు నష్టాలు తప్పేవి కదాని ఓపెన్ గా అనేశారు. సిద్దార్థ్ ఓయ్ కు థియేటర్లు ఊగిపోయాయి. ఏదో టయర్ 1 స్టార్ హీరో రేంజ్ లో దాంట్లో పాటలను ప్రేక్షకులు విపరీతంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. సరే ఇవన్నీ పేరున్న బ్యానర్లు, నటీనటులు చేసినవి కాబట్టి ఓకే. కానీ ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం వచ్చిన 3 కథ వేరు. విడుదలైన అసలు టైంలో సూపర్ ఫ్లాప్ ఇది.
కానీ ఇప్పుడు మాత్రం 3 రీ రిలీజ్ వస్తున్న ప్రతిసారి యూత్ ఎగబడి చూస్తున్నారు. ఇంతకు ముందు ఒకసారి చేసినప్పుడే హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ మంచి లాభాలు కళ్లజూశారు. తక్కువ గ్యాప్ లో ఇప్పుడు మరోసారి సెప్టెంబర్ 14న తెస్తున్నా సరే స్పందన మాత్రం తగ్గడం లేదు. ఇంకా రెండు రోజులు ఉండగానే బుక్ మై షోలో రోజుకు సగటున 8 వేల దాకా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ లో చాలా ఉదయం షోలు ఇప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయాయి. మత్తువదలరా 2, ఏఆర్ఎం, కళింగ, ఉత్సవం లాంటి కొత్త రిలీజులున్నా సరే 3కి ఇంతగా ఎగబడటం విచిత్రమే.
ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన 3కి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. దీని ఫలితం దెబ్బకే కొన్నేళ్లు డైరెక్షన్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. వై థిస్ కొలవెరి పాటను వాడుకోవడం వల్ల అప్పట్లో ఆ మాత్రం హైప్ వచ్చింది కానీ ఆ టైంలో సినిమా చూసిన ఆడియన్స్ నీరసంతో బయటికి వచ్చారు. ఇప్పుడు దానికి రివర్స్ లో స్పెషల్ షోలు చూసేందుకు ఎగబడటం విచిత్రం. ఇప్పటి యూత్ కి ఇందులో కంటెంట్ బాగా కనెక్ట్ అవుతోందని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ కెరీర్ తొలినాళ్ళలో కంపోజ్ చేసిన ఆల్బమ్ గా సంగీతం విషయంలో ప్రశంసలు దక్కించుకుంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…