ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ లో కనిపిస్తున్న ఆసక్తికరమైన అంశం ఒకప్పుడు ఫ్లాప్, డిజాస్టర్ గా ముద్రపడిన సినిమాలు ఇప్పుడు భారీ వసూళ్లు రాబట్టడం. ఆరెంజ్ కలెక్షన్లకు నిర్మాత నాగబాబు తెల్లబోవడం చూశాం. ఇదేదో అప్పుడే చూసి ఉంటే నాకు నష్టాలు తప్పేవి కదాని ఓపెన్ గా అనేశారు. సిద్దార్థ్ ఓయ్ కు థియేటర్లు ఊగిపోయాయి. ఏదో టయర్ 1 స్టార్ హీరో రేంజ్ లో దాంట్లో పాటలను ప్రేక్షకులు విపరీతంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. సరే ఇవన్నీ పేరున్న బ్యానర్లు, నటీనటులు చేసినవి కాబట్టి ఓకే. కానీ ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం వచ్చిన 3 కథ వేరు. విడుదలైన అసలు టైంలో సూపర్ ఫ్లాప్ ఇది.
కానీ ఇప్పుడు మాత్రం 3 రీ రిలీజ్ వస్తున్న ప్రతిసారి యూత్ ఎగబడి చూస్తున్నారు. ఇంతకు ముందు ఒకసారి చేసినప్పుడే హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ మంచి లాభాలు కళ్లజూశారు. తక్కువ గ్యాప్ లో ఇప్పుడు మరోసారి సెప్టెంబర్ 14న తెస్తున్నా సరే స్పందన మాత్రం తగ్గడం లేదు. ఇంకా రెండు రోజులు ఉండగానే బుక్ మై షోలో రోజుకు సగటున 8 వేల దాకా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ లో చాలా ఉదయం షోలు ఇప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయాయి. మత్తువదలరా 2, ఏఆర్ఎం, కళింగ, ఉత్సవం లాంటి కొత్త రిలీజులున్నా సరే 3కి ఇంతగా ఎగబడటం విచిత్రమే.
ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన 3కి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. దీని ఫలితం దెబ్బకే కొన్నేళ్లు డైరెక్షన్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. వై థిస్ కొలవెరి పాటను వాడుకోవడం వల్ల అప్పట్లో ఆ మాత్రం హైప్ వచ్చింది కానీ ఆ టైంలో సినిమా చూసిన ఆడియన్స్ నీరసంతో బయటికి వచ్చారు. ఇప్పుడు దానికి రివర్స్ లో స్పెషల్ షోలు చూసేందుకు ఎగబడటం విచిత్రం. ఇప్పటి యూత్ కి ఇందులో కంటెంట్ బాగా కనెక్ట్ అవుతోందని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ కెరీర్ తొలినాళ్ళలో కంపోజ్ చేసిన ఆల్బమ్ గా సంగీతం విషయంలో ప్రశంసలు దక్కించుకుంది.
This post was last modified on September 12, 2024 11:05 am
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…