గత దశాబ్ద కాలంలో ఇండియాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్ లిస్ట్ తీస్తే అందులో 96 సినిమా పేరు కచ్చితంగా ఉంటుంది. తమిళంలో ప్రేమ్ కుమార్ అనే సినిమాటోగ్రాఫర్ దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రమిది. తన జీవిత అనుభవాల ఆధారంగా అతను తెరకెక్కించిన ఈ ప్రేమకథ.. ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకింది. అందరూ రిలేట్ చేసుకునేలా కథ ఉండడం.. సన్నివేశాలు హృద్యంగా సాగడం.. విజయ్ సేతుపతి, త్రిష జంట తమ పాత్రల్లో జీవించడంతో ఈ సినిమా చూసిన వాళ్లందరూ కదిలిపోయారు. వేరే భాషల వాళ్లకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది. పాటలు కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేశారు కానీ.. ఇక్కడది వర్కవుట్ కాలేదు. తమిళంలో ఉన్న ఒరిజినల్ ఫీల్ ఇక్కడ మిస్సయిందనే టాక్ వచ్చింది. కమర్షియల్గా కూడా సినిమా ఆడలేదు.
ఐతే తమిళంలో కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయిన 96కు సీక్వెల్ తీయడానికి సన్నాహాలు జరుగుతుండడం విశేషం. ఈ విషయాన్ని ప్రేమ్ కుమారే స్వయంగా వెల్లడించాడు. 96 చేసినపుడు దీనికి సీక్వెల్ తీయాలన్న ఆలోచన లేదని.. కానీ ఇప్పుడు కథను డెవలప్ చేసి స్క్రిప్టు సిద్ధం చేశానని ప్రేమ్ కుమార్ చెప్పాడు. పక్కా స్క్రిప్ట్ తయారైందని.. విజయ్ సేతుపతి, త్రిషలతోనే సీక్వెల్ కూడా తీయాలని అనుకుంటున్నానని.. వాళ్లిద్దరూ ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు సినిమాను మొదలుపెడతానని ప్రేమ్ కుమార్ తెలిపాడు.
ఐతే ఇప్పుడున్న కమిట్మెంట్లలో విజయ్ సేతుపతి 96 సీక్వెల్కు డేట్లు ఇస్తాడా అన్నదే డౌట్. అందులోనూ ఇలాంటి క్లాసిక్స్ను అలా వదిలేస్తేనే మంచిదని.. బలవంతంగా కథను సాగదీసి సీక్వెల్స్ తీస్తే ప్రేక్షకులకు సహజ అనుభూతి కలగదని.. అంచనాలను అందుకోవడం కూడా కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రేమ్ కుమార్ సీక్వెల్ ప్రయత్నం ఎంతమేర ఫలిస్తుందో చూడాలి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…