బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలు ఏమొస్తున్నాయని ఎదురు చూస్తున్న సినీ ప్రియులు ఈ వారం చిన్న చిత్రాలతో సర్దుకోవాలి. ఒక రోజు ముందు గురువారం టోవినో థామస్ ‘ఏఆర్ఎం’ రిలీజవుతోంది.
కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ లాంటి కొందరు తెలిసున్న క్యాస్టింగ్ తప్ప మొత్తం మలయాళం ఫ్లేవర్ లో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీని మైత్రి మూవీ మేకర్స్ పంపిణి చేయడంతో థియేటర్లు బాగానే దక్కుతున్నాయి. అయితే మన నేటివిటీకి సంబంధం లేని ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో మెప్పించడం సవాలే. మరి ఏఆర్ఎం ఇందులో ఏ మేరకు విజయం సాధిస్తుందో రేపే తేలిపోతుంది.
ఎల్లుండి వచ్చే వాటిలో ‘మత్తు వదలరా 2’కి బాగానే హడావిడి చేస్తున్నారు. శ్రీసింహ హీరో కావడంతో ప్రమోషన్ విషయంలో రాజమౌళి లాంటి వాళ్ళు సహాయపడ్డారు. ఏకంగా ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ చేయించడం బాగా వర్కౌట్ అయ్యింది. కంటెంట్ కూడా ట్రైలర్ లో చూపించినట్టు ఫుల్ ఫన్ లో ఉంటే జనం థియేటర్లకు వస్తారు. రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే’కు హైప్ లేదు. తక్కువ గ్యాప్ లో వరస సినిమాలతో దూసుకొస్తున్న ఈ కుర్ర హీరోకు కోర్టు కేసుల నుంచి కొంచెం రిలీఫ్ దక్కాలంటే ఇది హిట్ కావడం అవసరం. మంచి క్యాస్టింగ్ ఉన్న ‘ఉత్సవం’ క్రమంగా అటెన్షన్ పెంచుకుంటోంది.
ఇవి కాకుండా ‘కళింగ’ అనే మరో బడ్జెట్ మూవీ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇవన్నీ కంటెంట్ మీద ఆధారపడి టాక్ తెచ్చుకోవాలి తప్పించి ఓపెనింగ్స్ ఆశించడం కష్టమే. నెలాఖరులో జూనియర్ ఎన్టీఆర్ దేవర ఉండటంతో సెప్టెంబర్ మూడో వారం దాదాపుగా ఖాళీగా ఉన్న నేపథ్యంలో పైన చెప్పిన సినిమాలేవైనా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సులభంగా రెండు వారాల థియేట్రికల్ రన్ దక్కుతుంది. గత వారం వచ్చిన వాటిలో 35 చిన్న కథ కాదు మాత్రమే నిలదొక్కుకుంది. విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గ్రేటెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోవడంతో సెకండ్ వీక్ కొనసాగడం కేవలం మొక్కుబడికే.
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు…
పెద్ది ఫలితం బాగుంది. కలెక్షన్లు చక్కగా వస్తున్నాయి. సోమవారం పరీక్ష కూడా నెగ్గింది. అయితే ఎక్కడో చిన్న అసంతృప్తి అభిమానులను…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల…
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…