టాలీవుడ్కు సంబంధించి అతి పెద్ద పండుగ సీజన్ అంటే సంక్రాంతినే. ఆ టైంలో మూణ్నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ చేసేస్తుంటారు. పోటీ తీవ్రంగా ఉంటుంది. థియేటర్ల కోసం గొడవలు జరిగిపోతుంటాయి. ప్రతి ఏడాదీ దీని మీద వివాదం నడుస్తుంటుంది.
కానీ పది రోజుల సెలవులతో అంతే అడ్వాంటేజ్ ఉన్న సీజన్ అయిన దసరాను మాత్రం టాలీవుడ్ అంతగా పట్టించుకోవట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లలో ఎప్పుడూ దసరాకు అనుకున్నంత సందడి లేదు. ఈసారి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు.
గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ ‘విశ్వం’, సుహాస్ చిత్రం ‘జనక అయితే గనక’ మాత్రమే ఆ సీజన్లో రిలీజవుతున్నాయి. వీటికి పెద్దగా క్రేజ్ లేదు. ‘విశ్వం’ లో బజ్తో రిలీజవుతోంది. ‘జనక..’ మరీ చిన్న సినిమా.
ఇంతకుముందు అయితే సూర్య సినిమా ‘కంగువ’ రిలీజవుతోందని దసరాను మన వాళ్లు లైట్ తీసుకున్నట్లు కనిపించారు. ఆ సినిమాకు తెలుగులోనూ బంపర్ క్రేజ్ ఉంది. కానీ ఆ చిత్రం వాయిదా పడిపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘వేట్టయాన్’ మాత్రమే రిలీజవుతోంది.
దానికి తెలుగులో కొంత బజ్ ఉండొచ్చు కానీ.. మన దగ్గర క్రేజీ సినిమాలేవీ రిలీజ్ చేసుకోలేనంత ఇబ్బందేమీ లేదు. కానీ టాలీవుడ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది. దసరాను ఇలా వదిలేసి అందరూ డిసెంబరు మీద పడిపోయారు.
పుష్ప-2, గేమ్ చేంజర్, తండేల్, రాబిన్ హుడ్, కన్నప్ప.. ఇలా చాలా సినిమాలే డిసెంబరు మీద గురి పెట్టాయి. వీటిలో రెండు సినిమాలను దసరా రేసులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుని ఉంటే వాటికి బాగా అడ్వాంటేజ్ అయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మరోసారి టాలీవుడ్ దసరా కళ తప్పేలా కనిపిస్తోంది.
This post was last modified on September 16, 2024 6:44 am
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…