నిన్న వెట్టయన్ నుంచి మొదటి లిరికల్ వీడియో రిలీజయ్యింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం కావడంతో సహజంగానే మ్యూజిక్ లవర్స్ ఎదురు చూపులు తీవ్రంగా ఉన్నాయి. పైగా జైలర్ తర్వాత సోలో హీరోగా తలైవర్ నుంచి వస్తున్న సినిమా కనక ఎప్పుడెప్పుడాని ఎదురు చూశారు. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా విడుదల చేయడం గమనార్షం. సరే ఇక పాట విషయానికి వస్తే అనిరుద్ స్టయిల్ లోనే హుషారుగా సాగుతూ క్యాచీ ట్యూన్ తో వెళ్ళింది. దేవరతో పోల్చడం సబబు కాదు కానీ నాలుగు నిమిషాల పైన ఉన్న ఈ వీడియోలో ఒక్క అంశం బాగా హైలైట్ అవుతోంది.
ఆమె మంజు వారియర్. వెట్టయన్ లో రజనీకాంత్ జోడిగా నటించింది. మన ప్రేక్షకులకు నేరుగా పరిచయం లేదు కానీ మలయాళంలో బాగా పాపులర్. తమిళంలోనూ సినిమాలు చేసింది. చిరంజీవి గాడ్ ఫాదర్ లో నయనతార క్యారెక్టర్ ని ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో పోషించింది ఈవిడే. వెట్టయన్ పాటలో ఎర్ర చీరకట్టుకుని, గాగుల్స్ పెట్టుకుని హుషారుగా డాన్సు చేస్తూ ఉంటే అభిమానులు దృష్టి ఆటోమేటిక్ గా ఆమె మీదకు వెళ్తున్నాయి.అలాని ఆమె యంగ్ హీరోయిన్ కాదు. ఎప్పుడో 1995లో ఇండస్ట్రీకి వచ్చి చాలా పేరు తెచ్చుకుంది. మంజు వారియర్ కు 45 సంవత్సరాలు.
రజినీకాంత్ పక్కన హైలైట్ అవ్వడం కంటే మాములు విషయం కాదు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా పలువురు ఫ్యాన్స్ కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్న మంజు వారియర్ డాన్సు క్లిప్పులను తెగ షేర్ చేసుకుంటున్నారు. జై భీం లాంటి క్లాసిక్ ఇచ్చిన టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వెట్టయన్ లో రజని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అదే డేట్ ని అంతకు ముందు తీసుకున్న సూర్య కంగువ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తెలుగులోనూ వెట్టయన్ టైటిల్ తోనే రానుంది.
This post was last modified on September 10, 2024 12:50 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…