‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. ఇక సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. ఆమెను చాలా అందంగా, సెక్సీగా చూపించడం ద్వారా మోడర్న్ రాఘవేంద్రరావు అనే పేరు కూడా సంపాదించాడు హరీష్ శంకర్.
ఐతే కొన్ని దృశ్యాలు శృతి మించడంతో విమర్శలూ తప్పలేదు. మరోవైపు ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ కష్టమంతా వృథా అయిపోతుందా.. ఆమె వన్ ఫిలిం వండరేనా అనే చర్చ కూడా జరిగింది. కానీ ఆల్రెడీ కమిటైన క్రేజీ ప్రాజెక్టులతో భాగ్యశ్రీ పేరు మళ్లీ మార్మోగడం ఖాయమనే తన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తాజాగా భాగ్యశ్రీ కొత్త చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. అదే.. కాంత.
మలయాళ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా దగ్గుబాటి రానా ప్రొడక్షన్లో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్లో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది భాగ్యశ్రీనే. చీరలో చాలా సెక్సీగా తయారై వచ్చిన తన వైపు కెమెరాలన్నీ తిరిగిపోయాయి. ప్రారంభోత్సవం జరిగిన కాసేపటికే తన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేశాయి.
‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ తర్వాత భాగ్యశ్రీ చిన్న గ్యాప్ ఇచ్చింది కానీ.. ఆమె కుర్రాళ్లను కుదురుగా ఉండనిచ్చేలా లేదని లేటెస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. ‘మిస్టర్ బచ్చన్’ లాగా పైపై మెరుపులతో కాకుండా సినిమాలోనూ కంటెంట్ ఉంటే భాగ్యశ్రీకి ఈసారి మంచి హిట్ పడడం ఖాయం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సెల్వమణి సెల్వరాజ్ అనే తమిళ దర్శకుడు రూపొందిస్తున్నాడు.
This post was last modified on September 9, 2024 3:53 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…