‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. ఇక సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. ఆమెను చాలా అందంగా, సెక్సీగా చూపించడం ద్వారా మోడర్న్ రాఘవేంద్రరావు అనే పేరు కూడా సంపాదించాడు హరీష్ శంకర్.
ఐతే కొన్ని దృశ్యాలు శృతి మించడంతో విమర్శలూ తప్పలేదు. మరోవైపు ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ కష్టమంతా వృథా అయిపోతుందా.. ఆమె వన్ ఫిలిం వండరేనా అనే చర్చ కూడా జరిగింది. కానీ ఆల్రెడీ కమిటైన క్రేజీ ప్రాజెక్టులతో భాగ్యశ్రీ పేరు మళ్లీ మార్మోగడం ఖాయమనే తన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తాజాగా భాగ్యశ్రీ కొత్త చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. అదే.. కాంత.
మలయాళ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా దగ్గుబాటి రానా ప్రొడక్షన్లో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్లో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది భాగ్యశ్రీనే. చీరలో చాలా సెక్సీగా తయారై వచ్చిన తన వైపు కెమెరాలన్నీ తిరిగిపోయాయి. ప్రారంభోత్సవం జరిగిన కాసేపటికే తన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేశాయి.
‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ తర్వాత భాగ్యశ్రీ చిన్న గ్యాప్ ఇచ్చింది కానీ.. ఆమె కుర్రాళ్లను కుదురుగా ఉండనిచ్చేలా లేదని లేటెస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. ‘మిస్టర్ బచ్చన్’ లాగా పైపై మెరుపులతో కాకుండా సినిమాలోనూ కంటెంట్ ఉంటే భాగ్యశ్రీకి ఈసారి మంచి హిట్ పడడం ఖాయం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సెల్వమణి సెల్వరాజ్ అనే తమిళ దర్శకుడు రూపొందిస్తున్నాడు.
This post was last modified on September 9, 2024 3:53 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…