నిన్న కంట్రీ డిలైట్ పాల ప్యాకెట్ల వీడియో ప్రకటన విడుదలయ్యింది. ఇందులో విశేషం చిరంజీవి మొదటిసారి ఒక ఆన్ లైన్ మిల్క్ సెల్లింగ్ యాప్ కి ప్రమోటర్ గా పని చేయడం. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.
మాములుగా కొనేయమని చెబితే జనం వినరు కాబట్టి వెరైటీగా ఒకప్పటి సూపర్ హిట్ మూవీ అన్నయ్యలోని ఆత్మారామ్ ఎపిసోడ్ ని ఇక్కడ వాడుకున్నారు. షూటింగ్ స్పాట్ లో షాట్ కోసం చిరంజీవి ఎదురు చూస్తుంటే సత్య వచ్చి పిలవడం, ఫర్ఫార్మెన్స్ అంటూ కామెడీగా చిరు డ్యూయల్ రోల్ లో తనలో తాను మాట్లాడుకోవడం వెరైటీగా, ఫన్నీగా అనిపించాయి.
ఆ పాల సంగతి కాసేపు పక్కనపెడితే చిరులోని ఈ కామెడీ టైమింగ్ నే వాడుకోవాలని అభిమానులు కోరుతున్నారు. వాల్తేరు వీరయ్యలో అది కొంత తీరినప్పటికీ భోళా శంకర్ లో అస్సలు పనవ్వలేదు. హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ స్టైల్ వేరు.
దొంగమొగుడు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, చంటబ్బాయి లాంటి సినిమాల్లో పీక్స్ లో ఉంటుంది. ఈ వయసులోనూ అదే ఎనర్జీని చూపించడం పట్ల ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విశ్వంభరకు ముందు క్యాన్సిలైన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోని సినిమా కోసం రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఇలాంటి క్యారెక్టరైజేషనే రాశాడని టాక్ ఉంది.
ఇకనైనా ఇవి ఆశించవచ్చేమో చూడాలి. నిజానికి హరీష్ శంకర్ – చిరు కలయికలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. కానీ కథ కుదరడం లేదని టాక్. దానికి తోడు మిస్టర్ బచ్చన్ ఫలితం తీవ్రంగా నిరాశ పరచడంతో అంత సులభంగా గ్రీన్ సిగ్నల్ రాకపోవచ్చు.
పైగా ముందు ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి కావాలి. అది హిట్టయితే అప్పుడు సమీకరణాలు, లెక్కలు మారిపోతాయి. విశ్వంభర ఫాంటసీ మూవీ అయినప్పటికీ దర్శకుడు వశిష్ట తగినంత వినోదాన్ని చిరు పోషించిన భీమవరం దొరబాబు పాత్రలో చూపించబోతున్నాడని లీక్ ఉంది. అదే నిజమైతే పండగే మరి.
దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు.…
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…