దేవర పార్ట్ 1 విడుదలకు ఇంకో 18 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. ట్రైలర్ లాంచ్ కోసం ఒక రోజు ముందే ముంబై చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ అక్కడి మీడియాకు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తెచ్చిన ఫేమ్ తో పాటు వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి నటించబోతున్న నేపథ్యంలో తన మీద బాలీవుడ్ వర్గాల్లో మాములు అంచనాలు లేవు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ తప్ప ఇంకెవరూ నార్త్ మార్కెట్ లో జెండా పాతలేని పరిస్థితుల్లో కొరటాల శివ దాన్ని చేసి చూపిస్తారనే నమ్మకం తారక్ అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. దానికి తగ్గ స్ట్రాటజీలే ఉన్నాయి.
అందులో భాగంగా ప్రేమగా ఒకరినొకరు బావా బావా అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఒక సరదా ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్టు తెలిసింది. దేవరతో పుష్ప జట్టుకడితే ముచ్చట్లు ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పాలా. అయితే బన్నీ డేట్లు అందుబాటుని బట్టి ఏదో ఒక రోజు దీన్ని ప్లాన్ చేయొచ్చని వినికిడి. అదే కనక జరిగితే ప్యాన్ ఇండియా స్థాయిలో దేవర మీద మరింత అటెన్షన్ పెరుగుతుంది. పైగా ఇద్దరి మధ్య ఆన్ లైన్ చనువు చూసిన ఫ్యాన్స్ కి ఆఫ్ లైన్ లో వీళ్ళ బంధం ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కలగడం సహజం. దానికి తగ్గట్టే ఈ ముఖాముఖీ ఉండొచ్చని సమాచారం.
ఇది కాకుండా మరిన్ని వెరైటీ పబ్లిసిటీ కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. కల్కి 2898 ఏడి తర్వాత బాక్సాఫీస్ ని కళకళలాడించిన సినిమా సరిపోదా శనివారం ఒక్కటే. మళ్ళీ దేవరతో థియేటర్లు కిక్కిరిసిపోతాయని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టిన రేట్లు చూస్తే నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోలు మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. దేవర చివరి దశ పనుల్లో కొరటాల విపరీతమైన ఒత్తిడిలో ఉండటంతో ప్రమోషన్ భారం మొత్తం జూనియర్ ఎన్టీఆరే మోయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే బన్నీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారేమో.
This post was last modified on September 9, 2024 10:38 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…