దేవర పార్ట్ 1 విడుదలకు ఇంకో 18 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. ట్రైలర్ లాంచ్ కోసం ఒక రోజు ముందే ముంబై చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ అక్కడి మీడియాకు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తెచ్చిన ఫేమ్ తో పాటు వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి నటించబోతున్న నేపథ్యంలో తన మీద బాలీవుడ్ వర్గాల్లో మాములు అంచనాలు లేవు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ తప్ప ఇంకెవరూ నార్త్ మార్కెట్ లో జెండా పాతలేని పరిస్థితుల్లో కొరటాల శివ దాన్ని చేసి చూపిస్తారనే నమ్మకం తారక్ అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. దానికి తగ్గ స్ట్రాటజీలే ఉన్నాయి.
అందులో భాగంగా ప్రేమగా ఒకరినొకరు బావా బావా అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఒక సరదా ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్టు తెలిసింది. దేవరతో పుష్ప జట్టుకడితే ముచ్చట్లు ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పాలా. అయితే బన్నీ డేట్లు అందుబాటుని బట్టి ఏదో ఒక రోజు దీన్ని ప్లాన్ చేయొచ్చని వినికిడి. అదే కనక జరిగితే ప్యాన్ ఇండియా స్థాయిలో దేవర మీద మరింత అటెన్షన్ పెరుగుతుంది. పైగా ఇద్దరి మధ్య ఆన్ లైన్ చనువు చూసిన ఫ్యాన్స్ కి ఆఫ్ లైన్ లో వీళ్ళ బంధం ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కలగడం సహజం. దానికి తగ్గట్టే ఈ ముఖాముఖీ ఉండొచ్చని సమాచారం.
ఇది కాకుండా మరిన్ని వెరైటీ పబ్లిసిటీ కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. కల్కి 2898 ఏడి తర్వాత బాక్సాఫీస్ ని కళకళలాడించిన సినిమా సరిపోదా శనివారం ఒక్కటే. మళ్ళీ దేవరతో థియేటర్లు కిక్కిరిసిపోతాయని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టిన రేట్లు చూస్తే నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోలు మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. దేవర చివరి దశ పనుల్లో కొరటాల విపరీతమైన ఒత్తిడిలో ఉండటంతో ప్రమోషన్ భారం మొత్తం జూనియర్ ఎన్టీఆరే మోయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే బన్నీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారేమో.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…