గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో ఆయన అభిమానులు ఎలా విలవిలాడిపోతున్నారో తెలిసిందే. ఆయనతో నేరుగా ఏ సంబంధం లేని సామాన్యులే ఇంత బాధ పడుతుంటే.. రక్త సంబంధీకుల పరిస్థితేంటో చెప్పాల్సిన పని లేదు. ఐతే పుట్టెడు దుఃఖంలో ఉన్న బాలు తనయుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ అసత్య ప్రచారం కారణంగా అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
బాలుకు నెలన్నర పాటు చికిత్స చేసిన చెన్నై ఎంజీఎం ఆసుపత్రి రూ.3 కోట్ల బిల్ వేసిందని.. అందులో సగానికి పైగా బిల్ పెండింగ్ ఉండటంతో బాలు కుటుంబం బాగా ఇబ్బంది పడిందని.. సమయానికి డబ్బుల్లేకుంటే తమిళనాడు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును సంప్రదిస్తే ఆయన కూతురు జోక్యం చేసుకుని బిల్ సెటిల్ చేసి బాలు మృతదేహం బయటికి వచ్చేలా చేసిందని వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర సోషల్ మీడియాలో ఒక మెసేజ్ హల్ చల్ చేస్తోంది రెండు రోజులుగా. దీన్ని ఇప్పటికే ఒక వీడియో ద్వారా ఖండించాడు చరణ్.
అంతటితో ఆగకుండా చెన్నైలో సోమవారం అత్యవసరంగా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఎంజీఎం ఆసుపత్రి బాలును సొంత కుటుంబ సభ్యుడిలాగా చూసుకుందని చరణ్ తెలిపాడు. బిల్ విషయంలో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమంతా అబద్ధమని.. ఇది తమ కుటుంబం, ఆసుపత్రి వర్గాలతో పాటు అందరినీ ఎంతో బాధ పెట్టిందని చరణ్ అన్నాడు. ఐతే అసలు చర్చకు దారి తీసిన బిల్, దాని చెల్లింపు గురించి చరణ్ వివరాలు చెప్పలేదు. దీనిపై తాను, ఎంజీఎం ఆసుపత్రి ప్రతినిధులు కలిసి ఒక ప్రకటన విడుదల చేస్తామని, ఎంత బిల్లయిందో, దాన్ని ఎవరు కట్టారో అంతా అందులో వివరిస్తామని చరణ్ అన్నాడు. ఏదేమైనా ఇప్పుడున్న స్థితిలో చరణ్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం రావడం మాత్రం బాధాకరం.
This post was last modified on September 28, 2020 11:50 pm
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…