టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వివాదం కొన్ని వారాల పాటు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. లావణ్య చౌదరి అనే అమ్మాయి తనతో ఎన్నో ఏళ్ల పాటు రాజ్ సహజీవనం చేయడమే కాక, పెళ్లి కూడా చేసుకున్నాడని.. కానీ ఇప్పుడు తనను వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని తీవ్ర ఆరోపణలే చేసింది.
ఈ వివాదం మీడియాలోకి ఎక్కి రచ్చ రచ్చ అయింది. ఐతే మీడియాలో కొన్ని రోజులు హాట్ టాపిక్గా ఉన్న ఈ వ్యవహారం తర్వాత సద్దుమణిగినట్లు కనిపించింది. తన కొత్త చిత్రం ‘భలే ఉన్నాడే’కు సంబంధించిన ప్రెస్ మీట్లో రాజ్ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. తాను ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నట్లు చెప్పాడు. ఈ ఇష్యూ సైలెంట్ అయినట్లే అతను మాట్లాడాడు. దీంతో రాజ్ ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు లావణ్య పెట్టిన కేసుల ఆధారంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అందులో రాజ్ తరుణ్ను నిందితుడిగా పేర్కొన్నారు. రాజ్, లావణ్య పదేళ్ల పాటు కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్లుగా అందులో పేర్కొంటూ ఇందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. రాజ్, లావణ్యలు కలిసి ఉన్న ఇంటి దగ్గర సాక్ష్యాలు సేకరించామని.. ఈ కేసులో అతను నిందితుడే అని పోలీసులు స్పష్టం చేశారు.
ఐతే ఈ కేసులో రాజ్ ముందస్తు బెయిల్ తీసుకుని ఉన్నాడు. ఛార్జ్ షీట్లో నిందితుడిగా పేర్కొంటూ రాజ్కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలో రాజ్ ఈ కేసులో సేఫ్ ఏమీ కాదని స్పష్టమవుతోంది. అతణ్ని అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. లావణ్యతో ప్రైవేటుగా సెటిల్ చేసుకోని పక్షంలో రాజ్కు ఇబ్బందులు తప్పేలా లేవు.
This post was last modified on September 6, 2024 5:52 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…