తమ అభిమాన కథానాయకుడి సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ దగ్గర్నుంచి తరచుగా అప్ డేట్స్ ఆశిస్తారు అభిమానులు. వాళ్లు కోరుకున్నట్లుగా రెగ్యులర్ అప్ డేట్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. వాళ్ల మనోభావాలను అస్సలు పట్టించుకోకుండా సైలెంటుగా ఉండిపోతే.. తప్పే అవుతుంది.
‘గేమ్ చేంజర్’ సినిమా విషయంలో అదే జరుగుతోంది. దాదాపు నాలుగేళ్ల ముందు మొదలైంది. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. కనీసం రిలీజ్ ఎప్పుడో కూడా తెలియడం లేదు. ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి, అప్ డేట్స్ ఏమీ లేకపోవడానికి, అంచనాలు తగ్గిపోతుండడానికి ప్రధాన కారణం దర్శకుడు శంకర్ అనడంలో సందేహం లేదు.
ఆయన మధ్యలో ‘ఇండియన్-2’ మీదికి వెళ్లడం వల్ల ‘గేమ్ చేంజర్’ బాగా ఆలస్యమైంది. పైగా ‘ఇండియన్-2’ పెద్ద డిజాస్టర్ కావడంతో దాని తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ కూడా దీని మీద పడింది. అలాంటపుడు ఎగ్జైటింగ్ కంటెంట్ రిలీజ్ చేసి సినిమాకు హైప్ పెంచాల్సిన అవసరముంది.
కానీ ఏ అప్ డేట్ లేదు. కనీసం రిలీజ్ గురించి కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. దిల్ రాజు ఆ మధ్య అన్నట్లు క్రిస్మస్కు అయినా సినిమా రిలీజవుతుందా అన్నది సందేహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు శంకర్తో పాటు నిర్మాణ సంస్థను తిట్టిపోస్తూ బూతు మాటలు జోడించి ట్రెండ్ చేశారు. అది ఇండియా లెవెల్లో ట్రెండ్ అయింది. సోషల్ మీడియాలో ఇంత గొడవ జరిగాక మేకర్స్కు ఈ విషయం తెలియకుండా ఉండదు.
దిల్ రాజు సోషల్ మీడియా ట్రెండ్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు కూడా. ఐతే ఈ సినిమా విషయంలో అతి పెద్ద బాధితుడు ఆయనే అన్నది వాస్తవం. సినిమా చాలా ఆలస్యం కావడం ఇప్పటికే చాలా నష్టపోయాడు. హైప్ తగ్గిపోవడం వల్ల ఇంకా పెద్ద ఇబ్బంది ఎదురయ్యేలా ఉంది. కానీ శంకర్ను శాసించే స్థితిలో ఆయన లేడు. రిక్వెస్ట్ చేసి అయినా సినిమా రిలీజ్ డేట్ సంగతి తేల్చాల్సిన అవసరముంది.
కాగా వినాయకచవితి సందర్భంగా ‘గేమ్ చేంజర్’ అప్ డేట్ రాబోతోందని సంగీత దర్శకుడు తమన్ తాజాగా పోస్ట్ పెట్టాడు. బహుశా ఇటీవలి ట్రెండ్ తాలూకు ఎఫెక్టే కావచ్చు. మరి చవితికి రెండో పాట గురించి కబురు చెబుతారా.. లేక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఉంటుందా అన్నది చూడాలి.
This post was last modified on September 6, 2024 5:53 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…