హారిక హాసిని క్రియేషన్స్ కి త్రివిక్రమ్ కట్టుబడిపోయిన సంగతి తెలిసిందే. హీరోలు వేరే బ్యానర్లో చేయమన్నా కానీ హారిక హాసిని భాగస్వామ్యంలోనే త్రివిక్రమ్ తన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలాగే రంగస్థలం, పుష్ప తర్వాత ఇక సుకుమార్ తమ సంస్థకు కట్టుబడి వుంటాడని మైత్రి మూవీస్ అధినేతలు నమ్మకం పెట్టుకోవడంలో వింత లేదు. పైగా అతని నిర్మాణ భాగస్వామ్యంలోను పలు చిత్రాలను వారు చేస్తున్నారు.
హారిక హాసినికి త్రివిక్రమ్ మాదిరిగా తమకు సుకుమార్ ఆస్థాన దర్శకుడు అవుతాడని అనుకుంటోన్న దశలో ఇంకా పుష్ప షూటింగ్ మొదలు కాకుండానే సుకుమార్ తన తదుపరి చిత్రం వేరే నిర్మాతకు చేస్తున్నట్టు ప్రకటించేసాడు. మరోవైపు కొరటాల శివ కూడా మైత్రితో అనుబంధం కొనసాగించడం లేదు. వారికి సలహాదారుగా వుంటున్నాడే తప్ప తన స్నేహితుడికే ఇక సినిమాలు చేసి పెట్టాలని కొరటాల నిర్ణయించుకున్నాడు. అయినా త్రివిక్రమ్తో హారిక హాసిని సంస్థకు కుదిరినట్టు ఈ రోజుల్లో ఒక అగ్ర దర్శకుడిని ఒకే నిర్మాణ సంస్థకు కట్టుబడేలా చేయడం కష్టం.
అవతలి పార్టీలు భారీ ఆఫర్లు ఇస్తూ వుండగా అవన్నీ వదిలేసుకుని ఒకరికే కట్టుబడి వుంటే క్రియేటివ్ డిఫరెన్సులు కూడా పుట్టుకొచ్చేసి మొత్తానికే సంబంధాలు బీటలు వారే ప్రమాదముంటుంది. అసలు పుష్ప ఖరారు కావడానికే ముందే మహేష్బాబు ప్రాజెక్ట్ విషయంలో చాలా డ్రామా జరిగింది. అయితే లక్కీగా ఎక్కువ డ్యామేజీ లేకుండా పుష్ప పట్టాలెక్కింది.
This post was last modified on September 28, 2020 10:16 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…