హారిక హాసిని క్రియేషన్స్ కి త్రివిక్రమ్ కట్టుబడిపోయిన సంగతి తెలిసిందే. హీరోలు వేరే బ్యానర్లో చేయమన్నా కానీ హారిక హాసిని భాగస్వామ్యంలోనే త్రివిక్రమ్ తన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలాగే రంగస్థలం, పుష్ప తర్వాత ఇక సుకుమార్ తమ సంస్థకు కట్టుబడి వుంటాడని మైత్రి మూవీస్ అధినేతలు నమ్మకం పెట్టుకోవడంలో వింత లేదు. పైగా అతని నిర్మాణ భాగస్వామ్యంలోను పలు చిత్రాలను వారు చేస్తున్నారు.
హారిక హాసినికి త్రివిక్రమ్ మాదిరిగా తమకు సుకుమార్ ఆస్థాన దర్శకుడు అవుతాడని అనుకుంటోన్న దశలో ఇంకా పుష్ప షూటింగ్ మొదలు కాకుండానే సుకుమార్ తన తదుపరి చిత్రం వేరే నిర్మాతకు చేస్తున్నట్టు ప్రకటించేసాడు. మరోవైపు కొరటాల శివ కూడా మైత్రితో అనుబంధం కొనసాగించడం లేదు. వారికి సలహాదారుగా వుంటున్నాడే తప్ప తన స్నేహితుడికే ఇక సినిమాలు చేసి పెట్టాలని కొరటాల నిర్ణయించుకున్నాడు. అయినా త్రివిక్రమ్తో హారిక హాసిని సంస్థకు కుదిరినట్టు ఈ రోజుల్లో ఒక అగ్ర దర్శకుడిని ఒకే నిర్మాణ సంస్థకు కట్టుబడేలా చేయడం కష్టం.
అవతలి పార్టీలు భారీ ఆఫర్లు ఇస్తూ వుండగా అవన్నీ వదిలేసుకుని ఒకరికే కట్టుబడి వుంటే క్రియేటివ్ డిఫరెన్సులు కూడా పుట్టుకొచ్చేసి మొత్తానికే సంబంధాలు బీటలు వారే ప్రమాదముంటుంది. అసలు పుష్ప ఖరారు కావడానికే ముందే మహేష్బాబు ప్రాజెక్ట్ విషయంలో చాలా డ్రామా జరిగింది. అయితే లక్కీగా ఎక్కువ డ్యామేజీ లేకుండా పుష్ప పట్టాలెక్కింది.
This post was last modified on September 28, 2020 10:16 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…