హారిక హాసిని క్రియేషన్స్ కి త్రివిక్రమ్ కట్టుబడిపోయిన సంగతి తెలిసిందే. హీరోలు వేరే బ్యానర్లో చేయమన్నా కానీ హారిక హాసిని భాగస్వామ్యంలోనే త్రివిక్రమ్ తన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలాగే రంగస్థలం, పుష్ప తర్వాత ఇక సుకుమార్ తమ సంస్థకు కట్టుబడి వుంటాడని మైత్రి మూవీస్ అధినేతలు నమ్మకం పెట్టుకోవడంలో వింత లేదు. పైగా అతని నిర్మాణ భాగస్వామ్యంలోను పలు చిత్రాలను వారు చేస్తున్నారు.
హారిక హాసినికి త్రివిక్రమ్ మాదిరిగా తమకు సుకుమార్ ఆస్థాన దర్శకుడు అవుతాడని అనుకుంటోన్న దశలో ఇంకా పుష్ప షూటింగ్ మొదలు కాకుండానే సుకుమార్ తన తదుపరి చిత్రం వేరే నిర్మాతకు చేస్తున్నట్టు ప్రకటించేసాడు. మరోవైపు కొరటాల శివ కూడా మైత్రితో అనుబంధం కొనసాగించడం లేదు. వారికి సలహాదారుగా వుంటున్నాడే తప్ప తన స్నేహితుడికే ఇక సినిమాలు చేసి పెట్టాలని కొరటాల నిర్ణయించుకున్నాడు. అయినా త్రివిక్రమ్తో హారిక హాసిని సంస్థకు కుదిరినట్టు ఈ రోజుల్లో ఒక అగ్ర దర్శకుడిని ఒకే నిర్మాణ సంస్థకు కట్టుబడేలా చేయడం కష్టం.
అవతలి పార్టీలు భారీ ఆఫర్లు ఇస్తూ వుండగా అవన్నీ వదిలేసుకుని ఒకరికే కట్టుబడి వుంటే క్రియేటివ్ డిఫరెన్సులు కూడా పుట్టుకొచ్చేసి మొత్తానికే సంబంధాలు బీటలు వారే ప్రమాదముంటుంది. అసలు పుష్ప ఖరారు కావడానికే ముందే మహేష్బాబు ప్రాజెక్ట్ విషయంలో చాలా డ్రామా జరిగింది. అయితే లక్కీగా ఎక్కువ డ్యామేజీ లేకుండా పుష్ప పట్టాలెక్కింది.
This post was last modified on September 28, 2020 10:16 pm
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…
అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…