హారిక హాసిని క్రియేషన్స్ కి త్రివిక్రమ్ కట్టుబడిపోయిన సంగతి తెలిసిందే. హీరోలు వేరే బ్యానర్లో చేయమన్నా కానీ హారిక హాసిని భాగస్వామ్యంలోనే త్రివిక్రమ్ తన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలాగే రంగస్థలం, పుష్ప తర్వాత ఇక సుకుమార్ తమ సంస్థకు కట్టుబడి వుంటాడని మైత్రి మూవీస్ అధినేతలు నమ్మకం పెట్టుకోవడంలో వింత లేదు. పైగా అతని నిర్మాణ భాగస్వామ్యంలోను పలు చిత్రాలను వారు చేస్తున్నారు.
హారిక హాసినికి త్రివిక్రమ్ మాదిరిగా తమకు సుకుమార్ ఆస్థాన దర్శకుడు అవుతాడని అనుకుంటోన్న దశలో ఇంకా పుష్ప షూటింగ్ మొదలు కాకుండానే సుకుమార్ తన తదుపరి చిత్రం వేరే నిర్మాతకు చేస్తున్నట్టు ప్రకటించేసాడు. మరోవైపు కొరటాల శివ కూడా మైత్రితో అనుబంధం కొనసాగించడం లేదు. వారికి సలహాదారుగా వుంటున్నాడే తప్ప తన స్నేహితుడికే ఇక సినిమాలు చేసి పెట్టాలని కొరటాల నిర్ణయించుకున్నాడు. అయినా త్రివిక్రమ్తో హారిక హాసిని సంస్థకు కుదిరినట్టు ఈ రోజుల్లో ఒక అగ్ర దర్శకుడిని ఒకే నిర్మాణ సంస్థకు కట్టుబడేలా చేయడం కష్టం.
అవతలి పార్టీలు భారీ ఆఫర్లు ఇస్తూ వుండగా అవన్నీ వదిలేసుకుని ఒకరికే కట్టుబడి వుంటే క్రియేటివ్ డిఫరెన్సులు కూడా పుట్టుకొచ్చేసి మొత్తానికే సంబంధాలు బీటలు వారే ప్రమాదముంటుంది. అసలు పుష్ప ఖరారు కావడానికే ముందే మహేష్బాబు ప్రాజెక్ట్ విషయంలో చాలా డ్రామా జరిగింది. అయితే లక్కీగా ఎక్కువ డ్యామేజీ లేకుండా పుష్ప పట్టాలెక్కింది.
This post was last modified on September 28, 2020 10:16 pm
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…