నందమూరి అభిమానులు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజుని పురస్కరించుకుని తన ఎంట్రీని ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి, తేజస్విని సంయుక్తంగా నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఈ ప్యాన్ ఇండియా మూవీని సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్, విఎఫెక్స్ ఎఫెక్ట్స్ తో తీయబోతున్నారు. హీరోయిన్ గా కొత్తమ్మాయిని సెట్ చేసే పనిలో ఉన్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడుతోంది.
ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు ఫిలిం నగర్ వర్గాల్లో తిరుగుతున్నాయి. ఇందులో బాలయ్య ఒక ప్రత్యేక క్యామియో చేయబోతున్నారట. అది కూడా శ్రీకృష్ణుడి గెటప్ లో క్లైమాక్స్ మొత్తం గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇండస్ట్రీ లాంచ్ కోసం బాగా మేకోవర్ చేసుకున్న మోక్షజ్ఞ నటనకు సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకున్నాడు. డెబ్యూ ఆషామాషీగా ఉండకూడదని బాలయ్య ఏళ్ళ తరబడి సమయం ఖర్చు పెట్టారు. ఒకదశలో ఆదిత్య 999 ద్వారా పరిచయం చేయాలనుకున్నారు కానీ ఎందుకనో నిర్ణయం మార్చుకున్నారు.
అన్ స్టాపబుల్ షూటింగ్ సమయంలో ప్రశాంత్ వర్మ చెప్పిన లైన్ నచ్చడం దగ్గరి నుంచే తన ప్రయాణం బాలయ్యతో మొదలయ్యింది. హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించడం చూశాక నమ్మకం మరింత రెట్టింపయ్యింది. స్టార్ వారసుల లాంచ్ లో రామ్ చరణ్ చిరుత, మహేష్ బాబు రాజకుమారుడు, జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని, ప్రభాస్ ఈశ్వర్ వగైరాలన్నీ కమర్షియల్ ఫార్ములాతో రూపొందిన మాస్ సినిమాలు. దానికి భిన్నంగా మోక్షజ్ఞ కోసం ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోనున్న మోక్షజ్ఞ 1 ఓపెనింగ్ అంగరంగవైభవంగా జరగనుంది.
This post was last modified on September 6, 2024 10:58 am
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…