మాచో హీరో గోపీచంద్ కు మాస్ లో ఎంత ఫాలోయింగ్ ఉన్నా గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. ఒకటి రెండు కాదు లెక్కలేనన్ని ఫ్లాపులు అభిమానులను ఇబ్బంది పెట్టాయి. తనను సరైన రీతిలో వాడుకునే దర్శకుడు దొరకడం లేదు. అక్టోబర్ 11 విడుదల కాబోతున్న విశ్వం ట్రైలర్ చూశాక క్రమంగా అంచనాలు పెరుగుతున్న మాట వాస్తవం. శ్రీను వైట్ల ఫామ్ లో లేకపోయినప్పటికీ తనదైన కామెడీ ప్లస్ యాక్షన్ మిక్స్ చేసిన తీరు పట్ల సోషల్ మీడియాలో పాజిటివిటీ కనిపిస్తోంది. ఇది హిట్ అయితే హీరో, డైరెక్టర్ ఇద్దరికీ బలమైన కంబ్యాక్ దొరుకుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే బాలకృష్ణ బోయపాటి శీను కలయికలో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీలో విలన్ గా గోపీచంద్ ని అడిగే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి ప్రతిపాదన దశ వద్దే ఉంది. ఇంకా స్టోరీ నెరేషన్ దాకా వెళ్లలేదట. కరెక్ట్ కంటెంట్ దొరకాలే కానీ గోపీచంద్ లో అద్భుతమైన విలన్ ఉన్నాడనే విషయం వర్షం, జయం లాంటి బ్లాక్ బస్టర్స్ లో బయట పడింది. నిజం సరిగా ఆడకపోయినా మహేష్ బాబు తర్వాత అందరూ మాట్లాడుకున్నది గోపీచంద్ పెర్ఫార్మన్స్ గురించే. యజ్ఞం సూపర్ హిట్టయ్యాక కథానాయకుడిగా కొనసాగడం జరుగుతోంది.
మరి బాలయ్యకు సవాల్ విసిరే పాత్రకు ఒప్పుకుంటాడా అనేది వేచి చూడాలి. అఖండ 2గా ప్రచారంలో ఉన్న బాలయ్య బోయపాటి సినిమా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 109 నవంబర్ లో పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఆలోగా స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ముగించే పనిలో ఉన్నారు బోయపాటి. లెజెండ్ ద్వారా జగపతిబాబుకి కొత్త కెరీర్ ఇచ్చిన ఈ మాస్ దర్శకుడు ఈసారి అంతకు మించి అనే స్థాయిలో విలన్ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడట. విశ్వం విజయం సాధిస్తే మాత్రం ఇది ప్రపోజల్ దగ్గరే ఆగిపోవచ్చు. చూడాలి మరి ఏ మేరకు నిజమవుతుందో.
This post was last modified on September 6, 2024 10:53 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…