Movie News

నితిన్‍ ఆ సినిమా అటకెక్కించేసాడా?

నితిన్‍ హీరోగా సితార ఎంటర్‍టైన్‍మెంట్స్ నిర్మిస్తోన్న రంగ్‍ దే చిత్రం షూటింగ్‍ మళ్లీ మొదలయింది. ఈ చిత్రం పూర్తి చేయడం కోసం కీర్తి సురేష్‍ కూడా హైదరాబాద్‍లో దిగింది. ఈ చిత్రం తర్వాత ‘అంధాదూన్‍’ రీమేక్‍ చేయడానికి నితిన్‍ సంకల్పించాడు. ఆ చిత్రానికి తారాగణం కూడా ఫైనల్‍ చేసేసారు. నభా నటేష్‍, తమన్నా ఫిమేల్‍ లీడ్‍ క్యారెక్టర్స్ చేయబోతున్నారు. ఎక్స్ప్రెస్‍ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తాడు. అయితే దీని కంటే ముందు నితిన్‍ మొదలు పెట్టిన మరో సినిమా వుంది.

చంద్రశేఖర్‍ యేలేటి దర్శకత్వంలో ఒక థ్రిల్లర్‍ సినిమాని నితిన్‍ ‘రంగ్‍ దే’తో పాటు మొదలు పెట్టాడు. రకుల్‍ ప్రీత్‍, ప్రియా ప్రకాష్‍ వారియర్‍ అందులో హీరోయిన్లు. అంధాదూన్‍ కంటే ముందు ఆ సినిమా పూర్తి చేయాలనే నితిన్‍ ప్లాన్‍ చేసుకున్నాడు. కానీ లాక్‍డౌన్‍లో ఏమయిందో ఏమో నితిన్‍ కానీ, అతని పీఆర్‍ టీమ్‍ కానీ ఏలేటి సినిమా గురించి అస్సలు మాట్లాడ్డం లేదు.

ఆ సినిమాను ఆపేసారా లేక తర్వాత చేస్తారా అనేదానిపై కూడా ఇన్‍ఫర్మేషన్‍ లేదు. ఏలేటి సోషల్‍ మీడియాకు దూరంగా వుంటాడు కనుక ఆయన దీనిపై స్పందించే అవకాశం లేదు. నితిన్‍ ఏమో అసలిదో సినిమా వుందనే సంగతి గుర్తున్నట్టే లేడు. నితిన్‍కి ఈ సినిమా కీలకం కాకపోవచ్చు కానీ రకుల్‍, ప్రియా ప్రకాష్‍తో పాటు దర్శకుడు ఏలేటికి మాత్రం ఇది చేయడం చాలా అవసరం. మరి నితిన్‍ ఆలోచన ఎలాగుందో?

suman

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

9 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

15 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

29 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago