Movie News

నితిన్‍ ఆ సినిమా అటకెక్కించేసాడా?

నితిన్‍ హీరోగా సితార ఎంటర్‍టైన్‍మెంట్స్ నిర్మిస్తోన్న రంగ్‍ దే చిత్రం షూటింగ్‍ మళ్లీ మొదలయింది. ఈ చిత్రం పూర్తి చేయడం కోసం కీర్తి సురేష్‍ కూడా హైదరాబాద్‍లో దిగింది. ఈ చిత్రం తర్వాత ‘అంధాదూన్‍’ రీమేక్‍ చేయడానికి నితిన్‍ సంకల్పించాడు. ఆ చిత్రానికి తారాగణం కూడా ఫైనల్‍ చేసేసారు. నభా నటేష్‍, తమన్నా ఫిమేల్‍ లీడ్‍ క్యారెక్టర్స్ చేయబోతున్నారు. ఎక్స్ప్రెస్‍ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తాడు. అయితే దీని కంటే ముందు నితిన్‍ మొదలు పెట్టిన మరో సినిమా వుంది.

చంద్రశేఖర్‍ యేలేటి దర్శకత్వంలో ఒక థ్రిల్లర్‍ సినిమాని నితిన్‍ ‘రంగ్‍ దే’తో పాటు మొదలు పెట్టాడు. రకుల్‍ ప్రీత్‍, ప్రియా ప్రకాష్‍ వారియర్‍ అందులో హీరోయిన్లు. అంధాదూన్‍ కంటే ముందు ఆ సినిమా పూర్తి చేయాలనే నితిన్‍ ప్లాన్‍ చేసుకున్నాడు. కానీ లాక్‍డౌన్‍లో ఏమయిందో ఏమో నితిన్‍ కానీ, అతని పీఆర్‍ టీమ్‍ కానీ ఏలేటి సినిమా గురించి అస్సలు మాట్లాడ్డం లేదు.

ఆ సినిమాను ఆపేసారా లేక తర్వాత చేస్తారా అనేదానిపై కూడా ఇన్‍ఫర్మేషన్‍ లేదు. ఏలేటి సోషల్‍ మీడియాకు దూరంగా వుంటాడు కనుక ఆయన దీనిపై స్పందించే అవకాశం లేదు. నితిన్‍ ఏమో అసలిదో సినిమా వుందనే సంగతి గుర్తున్నట్టే లేడు. నితిన్‍కి ఈ సినిమా కీలకం కాకపోవచ్చు కానీ రకుల్‍, ప్రియా ప్రకాష్‍తో పాటు దర్శకుడు ఏలేటికి మాత్రం ఇది చేయడం చాలా అవసరం. మరి నితిన్‍ ఆలోచన ఎలాగుందో?

This post was last modified on September 28, 2020 10:03 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

57 minutes ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

3 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

3 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

3 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

12 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

12 hours ago