నితిన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న రంగ్ దే చిత్రం షూటింగ్ మళ్లీ మొదలయింది. ఈ చిత్రం పూర్తి చేయడం కోసం కీర్తి సురేష్ కూడా హైదరాబాద్లో దిగింది. ఈ చిత్రం తర్వాత ‘అంధాదూన్’ రీమేక్ చేయడానికి నితిన్ సంకల్పించాడు. ఆ చిత్రానికి తారాగణం కూడా ఫైనల్ చేసేసారు. నభా నటేష్, తమన్నా ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్ చేయబోతున్నారు. ఎక్స్ప్రెస్ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తాడు. అయితే దీని కంటే ముందు నితిన్ మొదలు పెట్టిన మరో సినిమా వుంది.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమాని నితిన్ ‘రంగ్ దే’తో పాటు మొదలు పెట్టాడు. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్ అందులో హీరోయిన్లు. అంధాదూన్ కంటే ముందు ఆ సినిమా పూర్తి చేయాలనే నితిన్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ లాక్డౌన్లో ఏమయిందో ఏమో నితిన్ కానీ, అతని పీఆర్ టీమ్ కానీ ఏలేటి సినిమా గురించి అస్సలు మాట్లాడ్డం లేదు.
ఆ సినిమాను ఆపేసారా లేక తర్వాత చేస్తారా అనేదానిపై కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఏలేటి సోషల్ మీడియాకు దూరంగా వుంటాడు కనుక ఆయన దీనిపై స్పందించే అవకాశం లేదు. నితిన్ ఏమో అసలిదో సినిమా వుందనే సంగతి గుర్తున్నట్టే లేడు. నితిన్కి ఈ సినిమా కీలకం కాకపోవచ్చు కానీ రకుల్, ప్రియా ప్రకాష్తో పాటు దర్శకుడు ఏలేటికి మాత్రం ఇది చేయడం చాలా అవసరం. మరి నితిన్ ఆలోచన ఎలాగుందో?
This post was last modified on September 28, 2020 10:03 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…