రియా చక్రవర్తి నటిగా ఫెయిల్యూర్. ఎప్పుడో చాలా కాలం క్రితం ఆమె తూనీగ తూనీగ అనే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమయింది. ఆ తర్వాత హిందీలో రెండు, మూడు సినిమాలలో నటించింది కానీ సక్సెస్ కాలేకపోయింది. సినిమాలు ఫెయిలైనా కానీ సక్సెస్ఫుల్ స్టార్ సుషాంత్ సింగ్ రాజ్పుట్ గాళ్ఫ్రెండ్గా మారింది. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది. సుషాంత్ ఆత్మహత్య చేసుకోక ముందు వరకు కూడా రియా చక్రవర్తికి అతని గాళ్ఫ్రెండ్గా పెద్ద అటెన్షన్ లేదు. సాధారణంగా బాలీవుడ్ మీడియా అఫైర్లని బాగా కవర్ చేస్తూ వుంటుంది.
కానీ రియా చక్రవర్తి ఫ్లాప్ హీరోయిన్ కావడం వల్ల ఆమెకి గాసిప్ కాలమ్స్లో కూడా కవరేజీ వచ్చేది కాదు. అలాంటిది సుషాంత్ ఆత్మహత్య చేసుకున్నాక ఆమె నేషనల్ న్యూస్గా మారింది. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లను పట్టి పీడిస్తోన్న డ్రగ్స్ కేసుకి కారణం కూడా రియా చక్రవర్తినే. సక్సెస్ఫుల్ స్టార్ని వలలో వేసుకుని, అతనికి డ్రగ్స్ అలవాటు చేసి, మరణానికి కారణమయిందనేది చాలా మంది అభిప్రాయం. కానీ ఆమె పరిచయం కాకముందే అతనో డ్రగ్ అడిక్ట్ అని, డిప్రెషన్తో బాధ పడుతున్నాడని మరో వాదం.
ఏదేమైనా కానీ సాధారణ మధ్య తరగతి అమ్మాయి ఇండియా అంతా తన గురించి మాట్లాడుకునే సంచలనమయింది. బాలీవుడ్ ప్రముఖుల చీకటి నిజాలు బట్టబయలు కావడానికి కారణమయింది. రియా చక్రవర్తి గుడ్ ఆర్ బ్యాడ్ అటుంచితే… ఆమె కథ బాలీవుడ్ బ్లాక్బస్టర్కు మెటీరియల్ అవుతుందని భావించి ఇప్పుడామె జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. లాక్డౌన్కి ముందు వరకు ఫ్లాప్ హీరోయిన్ అయిన రియా… ఇరవై ఎనిమిదేళ్ల వయసులో తన బయోపిక్ రూపొందిస్తారని ఊహించనయినా ఊహించి వుంటుందా?
This post was last modified on September 28, 2020 9:53 pm
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…
చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…