నటిగా ఇంకా ఎదుగుతోన్న దశలోనే ‘మహానటి’ లాంటి సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం రావడమంటే అదృష్టమనే చెప్పాలి. కీర్తి సురేష్లో సావిత్రి ఏ యాంగిల్లో కనిపించిందో తెలియదు కానీ నాగ్ అశ్విన్ తన సినిమాకి ‘సావిత్రి’ తనేనని ఫిక్స్ అయిపోయాడు. నిజంగానే మహానటి సావిత్రిని తలపించే నటనతో ఆబాలగోపాలన్నీ అలరించడమే కాకుండా జాతీయ అవార్డును కూడా గెలిచేసుకుంది.
అంతటి సినిమా చేసిన తర్వాత అల్లాటప్పా సినిమాలు చేయడం సబబు కాదని ఆమె గుర్తించింది. అందుకే ఆ తర్వాత ఆచితూచి సినిమాలు ఎంచుకుంది. అవసరమయితే ఇతర భాషలలో మాత్రమే చేసింది కానీ తెలుగు వరకు మంచి కథ దొరికే వరకు వేచి చూసింది. అలా ఆమె ఎన్నో నాళ్లు ఎదురు చూసిన తర్వాత మిస్ ఇండియా, గుడ్లక్ సఖి చిత్రాలు చేసింది. థియేటర్లలో విడుదలయితే ఈ చిత్రాలతో కీర్తి సురేష్ బాక్సాఫీస్ పుల్ ఏమిటో తెలిసి వుండేది. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమాలు ఓటిటిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కాకుండా ఆమె చేసిన ఏకైక కమర్షియల్ సినిమా ‘రంగ్ దే’.
అదయినా థియేటర్లలో విడుదలయితే మహానటి తర్వాత ఇంత కాలానికి అభిమానులకు ఆమెను వెండితెరపై చూసే వీలు చిక్కుతుంది. కానీ ఆ సినిమాను కూడా ఓటిటిలో విడుదల చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహానటి తర్వాత నటిగా ఒక స్థాయి మెయింటైన్ చేయాలని చూసిన కీర్తి సురేష్ ఇలా తన సినిమాలన్నీ ఓటిటి బాట పట్టడం చూసి కాస్త డిజప్పాయింట్ అవడం సహజమే మరి.
This post was last modified on September 28, 2020 9:50 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…