Movie News

అక్కినేని శతజయంతి – 10 ఆణిముత్యాల రీ రిలీజ్

అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతిని పురస్కరించుకుని ఏఎన్ఆర్ 100 పేరుతో ఆయన నటించిన పది ఆణిముత్యాల్లాంటి బ్లాక్ బస్టర్స్ ని థియేట్రికల్ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్,ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫిలిం ఆర్చీవ్స్ అఫ్ ఇండియా, పివిఆర్ ఐనాక్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ఈవెంట్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు వరసగా మూడు రోజుల పాటు పది సినిమాలను స్క్రీనింగ్ చేస్తారు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఎవరైనా టికెట్లు కొనుక్కుని ఈ షోలను ఆస్వాదించవచ్చు. పాత ప్రింట్లను ప్రత్యేకంగా రీ స్టోర్ చేసి ప్రదర్శించబోతున్నారు.

దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యా భర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం. మనం ఈ లిస్టులో ఉన్నాయి. అన్ని అల్ టైం మ్యూజికల్ క్లాసిక్సే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల దసరా బుల్లోడు లాంటి బ్లాక్ బస్టర్స్ వీటిలో మిస్సయ్యాయి కానీ అలనాటి పాత బంగారాన్ని మళ్ళీ తెరమీద చూసే అవకాశం అరుదుగా వస్తుంది కాబట్టి దీనికి భారీ స్పందన ఉంటుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ లో ఈ మధ్య పది ఇరవై సంవత్సరాల కంటే పాత సినిమాలు చూసే ఛాన్స్ దక్కలేదు. కానీ ఈ ఫెస్టివల్ ప్రత్యేకమని చెప్పాలి.

ఇదే తరహాలో ఎన్టీఆర్ సినిమాలను కూడా ప్రదర్శిస్తే బాగుంటుంది కానీ ఆ దిశగా ఎవరైనా పూనుకుంటే బాగుంటుంది. ఏఎన్ఆర్ ఫెస్టివల్ లో చూపించే చిత్రాలకు నాగార్జున, నాగ చైతన్యతో పాటు కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారట. ఇలాంటి ట్రెండ్ బాలీవుడ్ లో ముందు నుంచి ఉంది. అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, దేవానంద్, యాష్ చోప్రా లాంటి లెజెండ్స్ పాత సినిమాలను కొత్తగా మాస్టర్ చేసి గొప్ప అనుభూతి ఇవ్వడం అక్కడ రెగ్యులర్ గా పాటిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఏఎన్ఆర్ తో మొదలుపెట్టారు కనక రాబోయే రోజుల్లో కూడా ఇవి కొనసాగితే కొత్త తరానికి క్లాసిక్స్ పరిచయమవుతాయి.

This post was last modified on September 4, 2024 11:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

5 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

6 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

6 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

6 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

7 hours ago