అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతిని పురస్కరించుకుని ఏఎన్ఆర్ 100 పేరుతో ఆయన నటించిన పది ఆణిముత్యాల్లాంటి బ్లాక్ బస్టర్స్ ని థియేట్రికల్ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్,ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫిలిం ఆర్చీవ్స్ అఫ్ ఇండియా, పివిఆర్ ఐనాక్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ఈవెంట్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు వరసగా మూడు రోజుల పాటు పది సినిమాలను స్క్రీనింగ్ చేస్తారు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఎవరైనా టికెట్లు కొనుక్కుని ఈ షోలను ఆస్వాదించవచ్చు. పాత ప్రింట్లను ప్రత్యేకంగా రీ స్టోర్ చేసి ప్రదర్శించబోతున్నారు.
దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యా భర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం. మనం ఈ లిస్టులో ఉన్నాయి. అన్ని అల్ టైం మ్యూజికల్ క్లాసిక్సే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల దసరా బుల్లోడు లాంటి బ్లాక్ బస్టర్స్ వీటిలో మిస్సయ్యాయి కానీ అలనాటి పాత బంగారాన్ని మళ్ళీ తెరమీద చూసే అవకాశం అరుదుగా వస్తుంది కాబట్టి దీనికి భారీ స్పందన ఉంటుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ లో ఈ మధ్య పది ఇరవై సంవత్సరాల కంటే పాత సినిమాలు చూసే ఛాన్స్ దక్కలేదు. కానీ ఈ ఫెస్టివల్ ప్రత్యేకమని చెప్పాలి.
ఇదే తరహాలో ఎన్టీఆర్ సినిమాలను కూడా ప్రదర్శిస్తే బాగుంటుంది కానీ ఆ దిశగా ఎవరైనా పూనుకుంటే బాగుంటుంది. ఏఎన్ఆర్ ఫెస్టివల్ లో చూపించే చిత్రాలకు నాగార్జున, నాగ చైతన్యతో పాటు కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారట. ఇలాంటి ట్రెండ్ బాలీవుడ్ లో ముందు నుంచి ఉంది. అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, దేవానంద్, యాష్ చోప్రా లాంటి లెజెండ్స్ పాత సినిమాలను కొత్తగా మాస్టర్ చేసి గొప్ప అనుభూతి ఇవ్వడం అక్కడ రెగ్యులర్ గా పాటిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఏఎన్ఆర్ తో మొదలుపెట్టారు కనక రాబోయే రోజుల్లో కూడా ఇవి కొనసాగితే కొత్త తరానికి క్లాసిక్స్ పరిచయమవుతాయి.
This post was last modified on September 4, 2024 11:14 am
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…