అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతిని పురస్కరించుకుని ఏఎన్ఆర్ 100 పేరుతో ఆయన నటించిన పది ఆణిముత్యాల్లాంటి బ్లాక్ బస్టర్స్ ని థియేట్రికల్ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్,ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫిలిం ఆర్చీవ్స్ అఫ్ ఇండియా, పివిఆర్ ఐనాక్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ఈవెంట్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు వరసగా మూడు రోజుల పాటు పది సినిమాలను స్క్రీనింగ్ చేస్తారు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఎవరైనా టికెట్లు కొనుక్కుని ఈ షోలను ఆస్వాదించవచ్చు. పాత ప్రింట్లను ప్రత్యేకంగా రీ స్టోర్ చేసి ప్రదర్శించబోతున్నారు.
దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యా భర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం. మనం ఈ లిస్టులో ఉన్నాయి. అన్ని అల్ టైం మ్యూజికల్ క్లాసిక్సే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల దసరా బుల్లోడు లాంటి బ్లాక్ బస్టర్స్ వీటిలో మిస్సయ్యాయి కానీ అలనాటి పాత బంగారాన్ని మళ్ళీ తెరమీద చూసే అవకాశం అరుదుగా వస్తుంది కాబట్టి దీనికి భారీ స్పందన ఉంటుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ లో ఈ మధ్య పది ఇరవై సంవత్సరాల కంటే పాత సినిమాలు చూసే ఛాన్స్ దక్కలేదు. కానీ ఈ ఫెస్టివల్ ప్రత్యేకమని చెప్పాలి.
ఇదే తరహాలో ఎన్టీఆర్ సినిమాలను కూడా ప్రదర్శిస్తే బాగుంటుంది కానీ ఆ దిశగా ఎవరైనా పూనుకుంటే బాగుంటుంది. ఏఎన్ఆర్ ఫెస్టివల్ లో చూపించే చిత్రాలకు నాగార్జున, నాగ చైతన్యతో పాటు కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారట. ఇలాంటి ట్రెండ్ బాలీవుడ్ లో ముందు నుంచి ఉంది. అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, దేవానంద్, యాష్ చోప్రా లాంటి లెజెండ్స్ పాత సినిమాలను కొత్తగా మాస్టర్ చేసి గొప్ప అనుభూతి ఇవ్వడం అక్కడ రెగ్యులర్ గా పాటిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఏఎన్ఆర్ తో మొదలుపెట్టారు కనక రాబోయే రోజుల్లో కూడా ఇవి కొనసాగితే కొత్త తరానికి క్లాసిక్స్ పరిచయమవుతాయి.
This post was last modified on September 4, 2024 11:14 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…