సూపర్ హిట్ పాటల పల్లవుల్లోంచి సినిమాల టైటిల్స్ తీసుకోవడం ఎప్పట్నుంచో ఉన్న ట్రెండే. రావోయి చందమామ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, చెప్పవే చిరుగాలి, పిల్లా నువ్వు లేని జీవితం.. ఇలా ఈ వరుసలో పదులకొద్దీ టైటిళ్లు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ కోవలోకి మరో టైటిల్ చేరబోతున్నట్లు సమాచారం.
మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్.. తన కొత్త చిత్రానికి మహేష్ బాబు సినిమా పాటలోని పల్లవిని టైటిల్గా పెట్టుకుంటున్నాడట. ఆ పాట సూపర్ స్టార్ నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంలోనిది. అందులో ‘వచ్చాడయ్యో సామీ’ అంటూ కైలాష్ ఖేర్ పాడిన పాట ఎంత ఫేమస్సో తెలిసిందే. ఆ పద బంధాన్నే వైష్ణవ్ కొత్త చిత్రానికి టైటిల్గా పెడుతున్నారట. ఈ చిత్రాన్ని లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య రూపొందించనున్నాడు. టైటిల్ చూస్తే ఇది హీరోయిజం ఎలివేట్ అయ్యే అవకాశాలున్న కథే అనిపిస్తోంది.
‘ఉప్పెన’ మూవీతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్కు ఆ తర్వాత ఏ సినిమా కూడా కలిసి రాలేదు. కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ.. ఇలా వరుసగా తన చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. ‘ఆదికేశవ’ అయితే తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని కొత్త సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు వైష్ణవ్.
కృష్ణచైతన్య విషయానికి వస్తే.. ‘రౌడీ ఫెలో’తో ప్రామిసింగ్ డెబ్యూ ఇచ్చిన కృష్ణచైతన్య.. ఆ తర్వాత ‘ఛల్ మోహన రంగ’తో జస్ట్ ఓకే అనిపించాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి అంచనాలతో రిలీజైంది కానీ.. ఇది కూడా నిరాశ పరిచింది. దీంతో మళ్లీ కెరీర్లో గ్యాప్ తప్పదేమో అనిపించింది. కానీ వెంటనే మెగా కుర్రాడితో సినిమా ఓకే చేసుకున్నాడు. ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కథా చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు.
This post was last modified on September 4, 2024 10:33 am
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…