ఓం భీమ్ బుష్ లాంటి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న శ్రీవిష్ణు త్వరలో స్వాగ్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 4 విడుదల చేయబోతున్నట్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ సాహసం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే సెప్టెంబర్ 27 దేవర పార్ట్ 1 వచ్చిన వారానికే స్వాగ్ రంగంలోకి దిగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. సినిమా మీద నమ్మకంతో నిర్మాతలు ఏకంగా అర్ధరాత్రి ప్రీమియర్లకు ప్రయత్నిస్తున్నారంటే ఏ రేంజ్ అవుట్ ఫుట్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. హైప్ అలా ఉంది మరి.
అలాంటప్పుడు వారం గ్యాప్ అనేది ఒక రకంగా రిస్కే. ఒకవేళ దేవరకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కల్కి 2898 ఏడి లాగా కనీసం మూడు వారాల పాటు స్ట్రాంగ్ గా ఉంటుంది. థియేటర్లకు బలమైన ఫీడింగ్ లా నిలుస్తుంది. అలాంటప్పుడు స్వాగ్ కి స్క్రీన్లు సర్దుబాటు చేయడం కొంచెం ఇబ్బంది అవ్వొచ్చు. పైగా అటుపై అక్టోబర్ 11 ఇదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన గోపీచంద్ విశ్వం వచ్చేస్తోంది. ఈ కారణంగానే శ్రీవిష్ణు మూవీని త్వరగా తెచ్చే ఆలోచన చేసుండొచ్చు. రాజ రాజ చోర దర్శకుడు హసిత్ గోలి రూపొందించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
ట్రైలర్ చూశాక అంచనాలైతే పెరిగాయి. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు పాత్రలు పోషిస్తున్న శ్రీవిష్ణు గెటప్స్ పరంగా కూడా చాలా వైవిధ్యం చూపిస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే ముందు దేవర పార్ట్ 1, తర్వాత విశ్వం – వెట్టయన్ – మార్టిన్ లను స్వాగ్ కాచుకోవాల్సి ఉంటుంది. ట్రెండ్ ని అనుసరించి ముందు రోజు ప్రీమియర్లు వేయడం లాంటివి ప్లాన్ చేయొచ్చు కానీ మిస్టర్ బచ్చన్ కి ఈ ఐడియా వర్కౌట్ కాని నేపథ్యంలో పీపుల్స్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయినా కంటెంట్ బాగుండాలే కానీ ఎంత కాంపిటీషనైనా ఏముంది నిక్షేపంగా ప్రేక్షకులను మెప్పించొచ్చు.
This post was last modified on September 3, 2024 10:41 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…