ఇటీవలే నెట్ ఫ్లిక్స్లో రిలీజైన కొత్త సిరీస్.. ‘ఐసీ 814: ది ఖాందహార్ హైజాక్’ తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మాట వాస్తవమే. కానీ ఈ సిరీస్ ఒక్క విషయంలో మాత్రం తీవ్ర విమర్శల పాలవుతోంది.
ఖాందహార్ హైజాక్లో భాగమైంది ఎవరు అన్నది అందరికీ తెలుసు. ఇస్లామిక్ ఉగ్రవాదులే నాడు ఈ హైజాక్కు పాల్పడ్డారు. అందులో నిందితుల పేర్లు కూడా అప్పుడే బయటికి వచ్చాయి. ఇబ్రహీం అక్తర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్.. ఇవీ ఖాందహార్ హైజాక్ నిందితుల అసలు పేర్లు. వీళ్లందరూ ముస్లింలే అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. కానీ ఈ సిరీస్లో మాత్రం వాళ్ల పేర్లను మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్.. అంటూ వేరు పేర్లతో సంబోధించారు.
పనిగట్టుకుని ఇలా ముస్లింల పేర్లను మార్చి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఎంత వరకు సబబు అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇది రాను రాను వివాదాస్పదంగా మారి.. ఈ సిరీస్ను బాయ్కాట్ చేయాలనే ఉద్యమం సోషల్ మీడియాలో మొదలైంది. వ్యవహారం కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్లి.. నెట్ ఫ్లిక్స్ హెడ్కు సమన్లు వెళ్లాయి.
తాజాగా నెట్ ఫ్లిక్స్ ఇండియా హెడ్ మోనికా షెర్గిల్ కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిత్వ శాఖ అధికారుల ముందుకు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైజాకర్ల పేర్లు మార్చడం, వాళ్లలో కొందరిని మానవతావాదులుగా చూపించడం.. హైజాక్ సమయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని చెడుగా చూపించడం మీద మోనికాను అధికారులు ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ.. ఇకపై కంటెంట్ విషయంలో జాగ్రత్త పడతామని, భారతీయ ప్రేక్షకుల మనోభావాలకు అనుగుణంగా సినిమాలు, సిరీస్లు ఉండేలా చూసుకుంటామని మోనికా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘ఐసీ 814’కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరిగిన ఉద్యమం నెట్ ఫ్లిక్స్ను గట్టి దెబ్బే కొట్టినట్లుంది.
This post was last modified on September 3, 2024 10:36 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…