ఇటీవలే నెట్ ఫ్లిక్స్లో రిలీజైన కొత్త సిరీస్.. ‘ఐసీ 814: ది ఖాందహార్ హైజాక్’ తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మాట వాస్తవమే. కానీ ఈ సిరీస్ ఒక్క విషయంలో మాత్రం తీవ్ర విమర్శల పాలవుతోంది.
ఖాందహార్ హైజాక్లో భాగమైంది ఎవరు అన్నది అందరికీ తెలుసు. ఇస్లామిక్ ఉగ్రవాదులే నాడు ఈ హైజాక్కు పాల్పడ్డారు. అందులో నిందితుల పేర్లు కూడా అప్పుడే బయటికి వచ్చాయి. ఇబ్రహీం అక్తర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్.. ఇవీ ఖాందహార్ హైజాక్ నిందితుల అసలు పేర్లు. వీళ్లందరూ ముస్లింలే అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. కానీ ఈ సిరీస్లో మాత్రం వాళ్ల పేర్లను మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్.. అంటూ వేరు పేర్లతో సంబోధించారు.
పనిగట్టుకుని ఇలా ముస్లింల పేర్లను మార్చి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఎంత వరకు సబబు అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇది రాను రాను వివాదాస్పదంగా మారి.. ఈ సిరీస్ను బాయ్కాట్ చేయాలనే ఉద్యమం సోషల్ మీడియాలో మొదలైంది. వ్యవహారం కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్లి.. నెట్ ఫ్లిక్స్ హెడ్కు సమన్లు వెళ్లాయి.
తాజాగా నెట్ ఫ్లిక్స్ ఇండియా హెడ్ మోనికా షెర్గిల్ కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిత్వ శాఖ అధికారుల ముందుకు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైజాకర్ల పేర్లు మార్చడం, వాళ్లలో కొందరిని మానవతావాదులుగా చూపించడం.. హైజాక్ సమయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని చెడుగా చూపించడం మీద మోనికాను అధికారులు ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ.. ఇకపై కంటెంట్ విషయంలో జాగ్రత్త పడతామని, భారతీయ ప్రేక్షకుల మనోభావాలకు అనుగుణంగా సినిమాలు, సిరీస్లు ఉండేలా చూసుకుంటామని మోనికా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘ఐసీ 814’కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరిగిన ఉద్యమం నెట్ ఫ్లిక్స్ను గట్టి దెబ్బే కొట్టినట్లుంది.
This post was last modified on September 3, 2024 10:36 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…