సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 తాలూకు ఎగ్జైట్ మెంట్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. రేపు వదలబోయే వీడియో సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు అభిమానులను కుదురుగా ఉండనివ్వవనే టాక్ ఇప్పటికే ఊపందుకుంది. భయపడినట్టు కాకుండా అనిరుద్ రవిచందర్ అంచనాలకు మించి అవుట్ ఫుట్ ఇవ్వబోతున్నట్టు క్లారిటీ వచ్చేయడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు. కథకు సంబంధించిన కీలక ఎపిసోడ్ ఒకటి నలభై సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఊచకోత ఆధారంగా ఉంటుందనే లీక్ గట్టిగా జరుగుతోంది.
ముందా ఘటనేంటో చూద్దాం. 1985లో ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో ఆరుగురు దళితులు అతి కిరాతకంగా అగ్ర వర్ణాల చేతిలో హత్యకు గురయ్యారు. నీటిని వాడుకునే దగ్గర మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ప్రాణాలు పోయేదాకా తీసుకొచ్చింది. ముగ్గురు మహిళలు మానభంగానికి గురయ్యారు. దీంతో కారంచేడు ఒక్కసారిగా భగ్గుమంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. నక్సలైట్లు రంగంలోకి దిగి ఈ దుర్ఘటనకు కారణమైన ఒకరిద్దరికి మరణ శిక్ష విధించారని మీడియాలో వచ్చింది. రాజకీయంగానూ పెను దుమారం రేపిన ఈ వివాదం తెలుగుదేశం సర్కారుని ఇబ్బందుల్లో నెట్టింది.
దేవరలో దీన్నే రిఫరెన్స్ గా తీసుకున్నారనే ప్రచారం జోరుగా ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దర్శకుడు కొరటాల శివ దీని గురించి పరిశోధన చేసిన మాట వాస్తవమే కానీ నేపథ్యం, హీరో విలన్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ ఊహకు అందని విధంగా, పూర్తిగా వేరుగా ఉంటాయని అంటున్నారు. సముద్రం ఒడ్డున జరిగే ఊచకోత ఎపిసోడ్ మాత్రం నెవర్ బిఫోర్ ఆన్ టాలీవుడ్ స్క్రీన్ అనేలా ఉంటుందట. రక్తం ఏరులై పారితే ఎలా ఉంటుందో చూడొచ్చని అంటున్నారు. ఈ కారంచేడు స్టోరీని తీసుకోవడం ఎంత వరకు నిజమో తెలియాలంటే ఇంకో ఇరవై నాలుగు రోజులు ఎదురు చూడాల్సిందే.
This post was last modified on September 3, 2024 10:28 pm
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…