Movie News

చిరు చెప్పాడు.. అభిమానులు పాటిస్తారా?

ఒకప్పడు ఫ్యాన్ వార్స్ బయట ఓ మోస్తరు స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు వారికి సోషల్ మీడియా రూపంలో మంచి వేదిక దొరికింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు ఇక్కడ గొడవలే గొడవలు. తమ హీరోను కొనియాడడం కంటే.. అవతలి హీరోను కించపరచడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం అవుతోంది.

ఓవైపు హీరోలు స్నేహంగానే మెలిగే ప్రయత్నం చేస్తున్నా.. అభిమానుల మధ్య ద్వేషం మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరికీ శాంతి మంత్రం బోధించే ప్రయత్నం చేశారు. నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకకు చిరు అతిథిగా రావడమే కాదు.. బాలయ్య గురించి ఏ భేషజం లేకుండా గొప్పగా మాట్లాడారు. అదే సమయంలో అభిమానులను ఉద్దేశించి కూడా కొన్ని మంచి మాటలు చెప్పారు.

తాను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ‘సమరసింహారెడ్డి’ స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని వెల్లడించడమే కాదు.. బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ సినిమా చేయాలన్న కోరికను బయటపెట్టాడు చిరు. తమ ఇంట్లో ఏ శుభకార్యం కూడా బాలయ్య లేకుండా పూర్తి కాదని.. తమ ఇద్దరి అభిమానులు కలిసి కట్టుగా ఉండేందుకే కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లమని చిరు వెల్లడించడం విశేషం.

తామంతా ఓ కుటుంబం లాంటి వాళ్లమని.. ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చిరు నొక్కి చెప్పడం గమనార్హం. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరిగినపుడల్లా.. హీరోలు హీరోలు బాగానే ఉంటారు, ఫ్యాన్సే కొట్టుకు చస్తుంటారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ శ్రుతి మించి.. ఒకే ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన అభిమానుల మధ్య కూడా విద్వేషాలు తీవ్ర స్థాయికి చేరుకుని అదే పనిగా విషం చిమ్ముకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే చిరు.. బాలయ్య గురించి గొప్పగా మాట్లాడ్డమే కాక, వ్యక్తిగతంగా తామెంత సన్నిహితంగా ఉంటామో చెబుతూ అభిమానులు కూడా అంతే స్నేహంగా మెలగాలని చెప్పకనే చెప్పారు. మరి మెగా, నందమూరి ఫ్యాన్సే కాక.. అందరు అభిమానులూ ఈ విషయాన్ని గుర్తించి సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని తగ్గిస్తే మంచిది.

This post was last modified on September 2, 2024 2:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chiru

Recent Posts

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

14 minutes ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

53 minutes ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

4 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

5 hours ago

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…

5 hours ago

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…

6 hours ago