ఒకప్పడు ఫ్యాన్ వార్స్ బయట ఓ మోస్తరు స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు వారికి సోషల్ మీడియా రూపంలో మంచి వేదిక దొరికింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు ఇక్కడ గొడవలే గొడవలు. తమ హీరోను కొనియాడడం కంటే.. అవతలి హీరోను కించపరచడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం అవుతోంది.
ఓవైపు హీరోలు స్నేహంగానే మెలిగే ప్రయత్నం చేస్తున్నా.. అభిమానుల మధ్య ద్వేషం మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరికీ శాంతి మంత్రం బోధించే ప్రయత్నం చేశారు. నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకకు చిరు అతిథిగా రావడమే కాదు.. బాలయ్య గురించి ఏ భేషజం లేకుండా గొప్పగా మాట్లాడారు. అదే సమయంలో అభిమానులను ఉద్దేశించి కూడా కొన్ని మంచి మాటలు చెప్పారు.
తాను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ‘సమరసింహారెడ్డి’ స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని వెల్లడించడమే కాదు.. బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ సినిమా చేయాలన్న కోరికను బయటపెట్టాడు చిరు. తమ ఇంట్లో ఏ శుభకార్యం కూడా బాలయ్య లేకుండా పూర్తి కాదని.. తమ ఇద్దరి అభిమానులు కలిసి కట్టుగా ఉండేందుకే కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లమని చిరు వెల్లడించడం విశేషం.
తామంతా ఓ కుటుంబం లాంటి వాళ్లమని.. ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చిరు నొక్కి చెప్పడం గమనార్హం. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరిగినపుడల్లా.. హీరోలు హీరోలు బాగానే ఉంటారు, ఫ్యాన్సే కొట్టుకు చస్తుంటారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ శ్రుతి మించి.. ఒకే ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన అభిమానుల మధ్య కూడా విద్వేషాలు తీవ్ర స్థాయికి చేరుకుని అదే పనిగా విషం చిమ్ముకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే చిరు.. బాలయ్య గురించి గొప్పగా మాట్లాడ్డమే కాక, వ్యక్తిగతంగా తామెంత సన్నిహితంగా ఉంటామో చెబుతూ అభిమానులు కూడా అంతే స్నేహంగా మెలగాలని చెప్పకనే చెప్పారు. మరి మెగా, నందమూరి ఫ్యాన్సే కాక.. అందరు అభిమానులూ ఈ విషయాన్ని గుర్తించి సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని తగ్గిస్తే మంచిది.
This post was last modified on September 2, 2024 2:12 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…