ఒకప్పడు ఫ్యాన్ వార్స్ బయట ఓ మోస్తరు స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు వారికి సోషల్ మీడియా రూపంలో మంచి వేదిక దొరికింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు ఇక్కడ గొడవలే గొడవలు. తమ హీరోను కొనియాడడం కంటే.. అవతలి హీరోను కించపరచడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం అవుతోంది.
ఓవైపు హీరోలు స్నేహంగానే మెలిగే ప్రయత్నం చేస్తున్నా.. అభిమానుల మధ్య ద్వేషం మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరికీ శాంతి మంత్రం బోధించే ప్రయత్నం చేశారు. నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకకు చిరు అతిథిగా రావడమే కాదు.. బాలయ్య గురించి ఏ భేషజం లేకుండా గొప్పగా మాట్లాడారు. అదే సమయంలో అభిమానులను ఉద్దేశించి కూడా కొన్ని మంచి మాటలు చెప్పారు.
తాను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ‘సమరసింహారెడ్డి’ స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని వెల్లడించడమే కాదు.. బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ సినిమా చేయాలన్న కోరికను బయటపెట్టాడు చిరు. తమ ఇంట్లో ఏ శుభకార్యం కూడా బాలయ్య లేకుండా పూర్తి కాదని.. తమ ఇద్దరి అభిమానులు కలిసి కట్టుగా ఉండేందుకే కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లమని చిరు వెల్లడించడం విశేషం.
తామంతా ఓ కుటుంబం లాంటి వాళ్లమని.. ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చిరు నొక్కి చెప్పడం గమనార్హం. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరిగినపుడల్లా.. హీరోలు హీరోలు బాగానే ఉంటారు, ఫ్యాన్సే కొట్టుకు చస్తుంటారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ శ్రుతి మించి.. ఒకే ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన అభిమానుల మధ్య కూడా విద్వేషాలు తీవ్ర స్థాయికి చేరుకుని అదే పనిగా విషం చిమ్ముకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే చిరు.. బాలయ్య గురించి గొప్పగా మాట్లాడ్డమే కాక, వ్యక్తిగతంగా తామెంత సన్నిహితంగా ఉంటామో చెబుతూ అభిమానులు కూడా అంతే స్నేహంగా మెలగాలని చెప్పకనే చెప్పారు. మరి మెగా, నందమూరి ఫ్యాన్సే కాక.. అందరు అభిమానులూ ఈ విషయాన్ని గుర్తించి సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని తగ్గిస్తే మంచిది.
This post was last modified on September 2, 2024 2:12 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…