ఒకప్పడు ఫ్యాన్ వార్స్ బయట ఓ మోస్తరు స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు వారికి సోషల్ మీడియా రూపంలో మంచి వేదిక దొరికింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు ఇక్కడ గొడవలే గొడవలు. తమ హీరోను కొనియాడడం కంటే.. అవతలి హీరోను కించపరచడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం అవుతోంది.
ఓవైపు హీరోలు స్నేహంగానే మెలిగే ప్రయత్నం చేస్తున్నా.. అభిమానుల మధ్య ద్వేషం మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరికీ శాంతి మంత్రం బోధించే ప్రయత్నం చేశారు. నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకకు చిరు అతిథిగా రావడమే కాదు.. బాలయ్య గురించి ఏ భేషజం లేకుండా గొప్పగా మాట్లాడారు. అదే సమయంలో అభిమానులను ఉద్దేశించి కూడా కొన్ని మంచి మాటలు చెప్పారు.
తాను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ‘సమరసింహారెడ్డి’ స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని వెల్లడించడమే కాదు.. బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ సినిమా చేయాలన్న కోరికను బయటపెట్టాడు చిరు. తమ ఇంట్లో ఏ శుభకార్యం కూడా బాలయ్య లేకుండా పూర్తి కాదని.. తమ ఇద్దరి అభిమానులు కలిసి కట్టుగా ఉండేందుకే కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లమని చిరు వెల్లడించడం విశేషం.
తామంతా ఓ కుటుంబం లాంటి వాళ్లమని.. ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చిరు నొక్కి చెప్పడం గమనార్హం. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరిగినపుడల్లా.. హీరోలు హీరోలు బాగానే ఉంటారు, ఫ్యాన్సే కొట్టుకు చస్తుంటారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ శ్రుతి మించి.. ఒకే ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన అభిమానుల మధ్య కూడా విద్వేషాలు తీవ్ర స్థాయికి చేరుకుని అదే పనిగా విషం చిమ్ముకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే చిరు.. బాలయ్య గురించి గొప్పగా మాట్లాడ్డమే కాక, వ్యక్తిగతంగా తామెంత సన్నిహితంగా ఉంటామో చెబుతూ అభిమానులు కూడా అంతే స్నేహంగా మెలగాలని చెప్పకనే చెప్పారు. మరి మెగా, నందమూరి ఫ్యాన్సే కాక.. అందరు అభిమానులూ ఈ విషయాన్ని గుర్తించి సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని తగ్గిస్తే మంచిది.
This post was last modified on September 2, 2024 2:12 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…