మెగా నందమూరి కుటుంబాల మధ్య ఏవో విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఇప్పటిది కాదు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు పరస్పరం దీని గురించి రకరకాల రూపాల్లో యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. పలు వేదికలపై ఇవన్నీ నిజం కాదని స్వయంగా హీరోలే చెప్పినా సరే అంత సులభంగా ఫ్యాన్స్ ని ఒప్పించలేని పరిస్థితి. బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో దీనికి మంచి క్లారిటీ ఇచ్చారు. ఎవరి పనులు, ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కాబట్టి తరచుగా కలుసుకోవడం ఉండదని, అంత మాత్రాన ఏవో గొడవలు ఉన్నట్టు ప్రచారం చేయడం సరికాదని కుండబద్దలు కొట్టారు.
రామ్ చరణ్, బన్నీలాంటి వాళ్ళతో క్లోజ్ గా ఉంటానని వాళ్ళను బాబు అంటూ బాలయ్య సంబోధించడం ఇంటర్వ్యూలోనే హైలైట్ గా చెప్పొచ్చు. పిల్లలు పైకి వస్తుంటే సంతోషం కలుగుతుందని వీళ్ళ ప్రస్తావన తేవడం విశేషం. నిజానికి గత ఏడాదే అన్ స్టాపబుల్ షో ద్వారానే వీటికి బాలయ్య చెక్ పెట్టారు. ఆయన చేస్తున్నారనే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అడవి శేష్, శర్వానంద్, విశ్వక్ సేన్ లాంటి స్టార్లు గెస్టులుగా వచ్చారు. అంతే తప్ప ఆహా వేదికగా జరుగుతోందని కాదు. ఇప్పుడు మరో రూపంలో దీనికి సంబంధించిన వివరణ ఇచ్చారు బాలయ్య.
స్వర్ణోత్సవ సంబరంలో ఉన్న బాలకృష్ణ యాభై నట సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లో జరిగిన వేడుకకు భారీగా తరలివచ్చారు. బాబీ దర్శకత్వంలో సితార సంస్థ నిర్మిస్తున్న ఎన్బికె 109 షూటింగ్ తుదిదశకు చేరుకుంటోంది. డిసెంబర్ లేదా జనవరి విడుదలకు ప్లానింగ్ జరుగుతోందని అంటున్నారు కానీ ఖరారుగా డేట్ ఇంకా చెప్పలేదు. సంక్రాంతికి కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ల హోరాహోరి పోరుని కనులారా చూసుకోవచ్చు.
This post was last modified on September 2, 2024 11:06 am
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…