మెగా నందమూరి కుటుంబాల మధ్య ఏవో విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఇప్పటిది కాదు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు పరస్పరం దీని గురించి రకరకాల రూపాల్లో యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. పలు వేదికలపై ఇవన్నీ నిజం కాదని స్వయంగా హీరోలే చెప్పినా సరే అంత సులభంగా ఫ్యాన్స్ ని ఒప్పించలేని పరిస్థితి. బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో దీనికి మంచి క్లారిటీ ఇచ్చారు. ఎవరి పనులు, ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కాబట్టి తరచుగా కలుసుకోవడం ఉండదని, అంత మాత్రాన ఏవో గొడవలు ఉన్నట్టు ప్రచారం చేయడం సరికాదని కుండబద్దలు కొట్టారు.
రామ్ చరణ్, బన్నీలాంటి వాళ్ళతో క్లోజ్ గా ఉంటానని వాళ్ళను బాబు అంటూ బాలయ్య సంబోధించడం ఇంటర్వ్యూలోనే హైలైట్ గా చెప్పొచ్చు. పిల్లలు పైకి వస్తుంటే సంతోషం కలుగుతుందని వీళ్ళ ప్రస్తావన తేవడం విశేషం. నిజానికి గత ఏడాదే అన్ స్టాపబుల్ షో ద్వారానే వీటికి బాలయ్య చెక్ పెట్టారు. ఆయన చేస్తున్నారనే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అడవి శేష్, శర్వానంద్, విశ్వక్ సేన్ లాంటి స్టార్లు గెస్టులుగా వచ్చారు. అంతే తప్ప ఆహా వేదికగా జరుగుతోందని కాదు. ఇప్పుడు మరో రూపంలో దీనికి సంబంధించిన వివరణ ఇచ్చారు బాలయ్య.
స్వర్ణోత్సవ సంబరంలో ఉన్న బాలకృష్ణ యాభై నట సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లో జరిగిన వేడుకకు భారీగా తరలివచ్చారు. బాబీ దర్శకత్వంలో సితార సంస్థ నిర్మిస్తున్న ఎన్బికె 109 షూటింగ్ తుదిదశకు చేరుకుంటోంది. డిసెంబర్ లేదా జనవరి విడుదలకు ప్లానింగ్ జరుగుతోందని అంటున్నారు కానీ ఖరారుగా డేట్ ఇంకా చెప్పలేదు. సంక్రాంతికి కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ల హోరాహోరి పోరుని కనులారా చూసుకోవచ్చు.
This post was last modified on September 2, 2024 11:06 am
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…