మెగా నందమూరి కుటుంబాల మధ్య ఏవో విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఇప్పటిది కాదు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు పరస్పరం దీని గురించి రకరకాల రూపాల్లో యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. పలు వేదికలపై ఇవన్నీ నిజం కాదని స్వయంగా హీరోలే చెప్పినా సరే అంత సులభంగా ఫ్యాన్స్ ని ఒప్పించలేని పరిస్థితి. బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో దీనికి మంచి క్లారిటీ ఇచ్చారు. ఎవరి పనులు, ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కాబట్టి తరచుగా కలుసుకోవడం ఉండదని, అంత మాత్రాన ఏవో గొడవలు ఉన్నట్టు ప్రచారం చేయడం సరికాదని కుండబద్దలు కొట్టారు.
రామ్ చరణ్, బన్నీలాంటి వాళ్ళతో క్లోజ్ గా ఉంటానని వాళ్ళను బాబు అంటూ బాలయ్య సంబోధించడం ఇంటర్వ్యూలోనే హైలైట్ గా చెప్పొచ్చు. పిల్లలు పైకి వస్తుంటే సంతోషం కలుగుతుందని వీళ్ళ ప్రస్తావన తేవడం విశేషం. నిజానికి గత ఏడాదే అన్ స్టాపబుల్ షో ద్వారానే వీటికి బాలయ్య చెక్ పెట్టారు. ఆయన చేస్తున్నారనే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అడవి శేష్, శర్వానంద్, విశ్వక్ సేన్ లాంటి స్టార్లు గెస్టులుగా వచ్చారు. అంతే తప్ప ఆహా వేదికగా జరుగుతోందని కాదు. ఇప్పుడు మరో రూపంలో దీనికి సంబంధించిన వివరణ ఇచ్చారు బాలయ్య.
స్వర్ణోత్సవ సంబరంలో ఉన్న బాలకృష్ణ యాభై నట సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లో జరిగిన వేడుకకు భారీగా తరలివచ్చారు. బాబీ దర్శకత్వంలో సితార సంస్థ నిర్మిస్తున్న ఎన్బికె 109 షూటింగ్ తుదిదశకు చేరుకుంటోంది. డిసెంబర్ లేదా జనవరి విడుదలకు ప్లానింగ్ జరుగుతోందని అంటున్నారు కానీ ఖరారుగా డేట్ ఇంకా చెప్పలేదు. సంక్రాంతికి కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ల హోరాహోరి పోరుని కనులారా చూసుకోవచ్చు.
This post was last modified on September 2, 2024 11:06 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…