సరిపోదా శనివారంలో ఎస్జె సూర్య పెర్ఫార్మన్స్ ఆ సినిమాని నిలబెట్టడంలో ఎంతగా దోహద పడిందో ఎవరైనా ఒప్పుకునే విషయమే. సాక్ష్యాత్తు హీరో నానినే దయా పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కితే సంతోషపడతాడని, షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఇదే చెప్పానని సక్సెస్ మీట్ లో అనడం ఫ్యాన్స్ ని తాకింది. ఇప్పటిదాకా ఎస్జె సూర్య ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు కానీ ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నట్టు పరిస్థితి మారిపోయింది. మహేష్ బాబు స్పైడర్ లోనే తన టాలెంట్ చూపించినా అసలైన టాలీవుడ్ బ్రేక్ మాత్రం ఇన్నేళ్ల తర్వాత దొరికింది.
ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ వైపు వెళ్తోంది. అందులో కూడా ఎస్జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఎంత స్కోప్ ఉంటుందనే దాని గురించి క్లారిటీ లేదు. యూనిట్ నుంచి అందుతున్న సమాచారం మేరకు సరిపోదా శనివారంకు ఏ మాత్రం తీసిపోని రీతిలో, ఇంకా చెప్పాలంటే అంతకు మించి అనేలా దర్శకుడు శంకర్ డిజైన్ చేశారని చెబుతున్నారు. మెయిన్ విలన్ గా నటించిన సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకుగా ఎస్జె సూర్య ఇందులో రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. ఐఏఎస్ ఆఫీసర్ రామ్ చరణ్ తో సై అంటే సై అనిపించే ఛాలెంజింగ్ సీన్లు బోల్డు ఉంటాయట.
ఇంకా చెప్పాలంటే ఒకే ఒక్కడులో అర్జున్ రఘువరన్ మధ్య క్లాష్ ని మించి ఉంటుందని ఊరిస్తున్నారు. నిజంగా ఈ స్థాయిలో అంచనాలు అందుకోగలిగితే మాత్రం గేమ్ ఛేంజర్ దెబ్బకు ఎస్జె సూర్య రేంజ్ మరింత పైకి చేరుకుంటుంది. ఇప్పటికే పది కోట్ల దాకా రెమ్యునరేషన్ పలుకుతోందనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో ఖరారుగా తెలియదు. ఎందుకంటే కొందరు టైర్ 2 హీరోలకే అంత పారితోషికం లేదు. అయినా మనాడు, మార్క్ ఆంటోనీ లాంటి బ్లాక్ బస్టర్స్ లో భాగమయ్యాక ఇతని డిమాండ్ మాములుగా లేదు. చూడాలి మరి గేమ్ ఛేంజర్ ఇంకెంత పెద్ద స్థాయికి తీసుకెళ్తుందో.
This post was last modified on September 1, 2024 6:00 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…