థ్రిల్లర్ వెబ్ సిరీస్లు తీయడంలో బాలీవుడ్ దర్శకుల నైపుణ్యమే వేరు. ఓటీటీలు ఊపందుకున్నాక వాటిలో ఎక్కువ విజయవంతం అయినవి బాలీవుడ్ డైరెక్టర్లు తీసిన సిరీస్లే. ఈ కోవలోనే నెట్ ఫ్లిక్స్లో రిలీజైన కొత్త సిరీస్.. ‘ఐసీ 814: ది ఖాందహార్ హైజాక్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, అరవింద్ స్వామి, దియా మీర్జా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఆద్యంతం గ్రిప్పింగ్గా ఉండి ప్రేక్షకులకు ఉత్కంఠ పంచుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సిరీస్ల్లో ఇదొకటిగా విమర్శలు ప్రశంసిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్లో ఇది ఇండియా వరకు టాప్లో ట్రెండ్ అవుతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ సిరీస్ ఒక్క విషయంలో మాత్రం విమర్శల పాలవుతోంది.
ఖాందహార్ హైజాక్లో భాగమైంది ఎవరు అన్నది అందరికీ తెలుసు. ఇస్లామిక్ ఉగ్రవాదులే నాడు ఈ హైజాక్కు పాల్పడ్డారు. అందులో నిందితుల పేర్లు కూడా అప్పుడే బయటికి వచ్చాయి. ఇబ్రహీం అక్తర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్.. ఇవీ ఖాందహార్ హైజాక్ నిందితుల అసలు పేర్లు. వీళ్లందరూ ముస్లింలే అనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. కానీ ఈ సిరీస్లో మాత్రం వాళ్ల పేర్లను మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్.. అంటూ వేరు పేర్లతో సంబోధించారు. పనిగట్టుకుని ఇలా ముస్లింల పేర్లను మార్చి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఎంత వరకు సబబు అనే ప్రశ్న ఎదురవుతోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎప్పుడూ ఇలాగే చేస్తుంటారన్నది విమర్శ. తమిళంలో ఆ మధ్య వచ్చిన ‘జై భీమ్’ సినిమాలో కూడా బాధితుడి పట్ల హింసాత్మకంగా ప్రవర్తించిన పోలీస్ అధికారి క్రిస్టియన్ అయితే.. సినిమాలో మాత్రం హిందువుగా చూపించారు. దాని పట్ల విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఉగ్రవాదులు ముస్లింలు అయితే.. ఆ విషయం కప్పిపుచ్చేలా ఈ సిరీస్ తీయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
This post was last modified on September 1, 2024 6:01 pm
చట్టసభలను గతంలో చాలామంది నేతలు దేవాలయాలుగా భావించేవారు. ప్రజల జీవితాలను మార్చగలిగే చట్టాలను చేసేందుకు తమకు అధికారం ఇచ్చారని జవాబుదారీతనంగా…
గత కొన్ని రోజులుగా మలయాళ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తన పాస్ట్ లవ్ స్టోరీ…
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ(సర్) తెలంగాణలో ముగిసింది. దాదాపు 2 మాసాలకు పైగానే ఈ…
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన శ్రష్ఠి వర్మ.. రాజకీయాల్లోకి…
ఇటీవలే ప్రమాదానికి గురై భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల…
నిన్న జరిగిన బండ్ల గణేష్ కూతురి వివాహ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి…