మలయాళ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా చర్చలన్నీ ‘హేమ కమిటీ’ రిపోర్ట్ గురించే. సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో అనేకమంది ప్రముఖులకు సంబంధించిన చీకటి కోణాలు బయటికి వచ్చాయి.
మరోవైపు కొత్తగా అనేకమంది మహిళలు తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి రాధిక అలాంటి ఒక ఎపిసోడ్ గురించి వెల్లడించింది. తాను షూటింగ్లో పాల్గొన్న ఓ సినిమా యూనిట్లో కొందరు మహిళా ఆర్టిస్టులు ఉపయోగించే కారవాన్లలో కెమెరాలు పెట్టి వీడియోలు తీసిన విషయం తెలిసి తాను షాకైనట్లు ఆమె వెల్లడించారు.
“నేను 46 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. అన్ని చోట్లా మహిళలకు లైంగిక పరమైన వేధింపులు ఎదురవుతున్నాయన్నది నా భావన. ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్లినపుడు జరిగిన ఉదంతాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. షాట్ ముగించుకుని వెళ్తుండగా.. సెట్లో కొంతమంది మగవాళ్లు ఒక చోట కూర్చుని ఫోన్లో ఏదో చూసి ఆనందిస్తున్న విషయం గమనించా. ఏదో వీడియో చూస్తున్నారని అర్థమైంది. యూనిట్లో ఒక వ్యక్తిని పిలిచి వాళ్లేం చూస్తున్నారని అడిగా. కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి ఫోన్లలో చూస్తున్నారని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చి చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా. ఇలాంటివి జరిగితే గట్టిగా బుద్ధి చెబుతానని వార్నింగ్ ఇచ్చా. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి ఉపయోగించే కారవాన్లలో కూడా ఇలాంటివి చేస్తే ఏం చేయాలి” అని రాధిక అన్నారు.
2026 ఆరు నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ వరకు చూసుంటే కనీసం సూపర్ హిట్లని చెప్పుకునేవి పది సినిమాలు లేకపోవడం కొంత…
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత అయోధ్య బాల రామయ్యకు భక్తులు సమర్పించిన కానుకల దోపిడీ వ్యవహారంలో కీలక విషయం వెలుగు చూసింది.…
రీ రిలీజుల ట్రెండ్ జనాలకు మొహం మొత్తిపోయేలా విసిగిస్తోంది. వారానికి ఒకటి రెండు క్రమం తప్పకుండా వీటిని వదులుతూ డిస్ట్రిబ్యూటర్…
వైసీపీ అధినేత జగన్పై జనసేన కీలక నాయకుడు, మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ నిర్ణయాలు ఆపండి…
మాది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్.. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చూడొచ్చు.. మాది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా…
సీఎం జగన్ ప్రెస్ మీట్ లు అంటేనే ట్రోలింగ్ కు స్టఫ్ దొరికినట్లు అని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనకు…