మలయాళ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా చర్చలన్నీ ‘హేమ కమిటీ’ రిపోర్ట్ గురించే. సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో అనేకమంది ప్రముఖులకు సంబంధించిన చీకటి కోణాలు బయటికి వచ్చాయి.
మరోవైపు కొత్తగా అనేకమంది మహిళలు తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి రాధిక అలాంటి ఒక ఎపిసోడ్ గురించి వెల్లడించింది. తాను షూటింగ్లో పాల్గొన్న ఓ సినిమా యూనిట్లో కొందరు మహిళా ఆర్టిస్టులు ఉపయోగించే కారవాన్లలో కెమెరాలు పెట్టి వీడియోలు తీసిన విషయం తెలిసి తాను షాకైనట్లు ఆమె వెల్లడించారు.
“నేను 46 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. అన్ని చోట్లా మహిళలకు లైంగిక పరమైన వేధింపులు ఎదురవుతున్నాయన్నది నా భావన. ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్లినపుడు జరిగిన ఉదంతాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. షాట్ ముగించుకుని వెళ్తుండగా.. సెట్లో కొంతమంది మగవాళ్లు ఒక చోట కూర్చుని ఫోన్లో ఏదో చూసి ఆనందిస్తున్న విషయం గమనించా. ఏదో వీడియో చూస్తున్నారని అర్థమైంది. యూనిట్లో ఒక వ్యక్తిని పిలిచి వాళ్లేం చూస్తున్నారని అడిగా. కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి ఫోన్లలో చూస్తున్నారని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చి చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా. ఇలాంటివి జరిగితే గట్టిగా బుద్ధి చెబుతానని వార్నింగ్ ఇచ్చా. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి ఉపయోగించే కారవాన్లలో కూడా ఇలాంటివి చేస్తే ఏం చేయాలి” అని రాధిక అన్నారు.
This post was last modified on September 1, 2024 10:29 am
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…