మలయాళ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా చర్చలన్నీ ‘హేమ కమిటీ’ రిపోర్ట్ గురించే. సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో అనేకమంది ప్రముఖులకు సంబంధించిన చీకటి కోణాలు బయటికి వచ్చాయి.
మరోవైపు కొత్తగా అనేకమంది మహిళలు తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి రాధిక అలాంటి ఒక ఎపిసోడ్ గురించి వెల్లడించింది. తాను షూటింగ్లో పాల్గొన్న ఓ సినిమా యూనిట్లో కొందరు మహిళా ఆర్టిస్టులు ఉపయోగించే కారవాన్లలో కెమెరాలు పెట్టి వీడియోలు తీసిన విషయం తెలిసి తాను షాకైనట్లు ఆమె వెల్లడించారు.
“నేను 46 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. అన్ని చోట్లా మహిళలకు లైంగిక పరమైన వేధింపులు ఎదురవుతున్నాయన్నది నా భావన. ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్లినపుడు జరిగిన ఉదంతాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. షాట్ ముగించుకుని వెళ్తుండగా.. సెట్లో కొంతమంది మగవాళ్లు ఒక చోట కూర్చుని ఫోన్లో ఏదో చూసి ఆనందిస్తున్న విషయం గమనించా. ఏదో వీడియో చూస్తున్నారని అర్థమైంది. యూనిట్లో ఒక వ్యక్తిని పిలిచి వాళ్లేం చూస్తున్నారని అడిగా. కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి ఫోన్లలో చూస్తున్నారని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చి చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా. ఇలాంటివి జరిగితే గట్టిగా బుద్ధి చెబుతానని వార్నింగ్ ఇచ్చా. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి ఉపయోగించే కారవాన్లలో కూడా ఇలాంటివి చేస్తే ఏం చేయాలి” అని రాధిక అన్నారు.
This post was last modified on September 1, 2024 10:29 am
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…