ఇండియన్ సినిమాలో డబ్బింగ్ చెప్పడంలో గొప్ప నైపుణ్యం ఉన్న కళాకారులు ఎంతోమంది ఉన్నారు. కానీ అందులో మిగతా వాళ్లందరూ ఒకెత్తయితే.. రవిశంకర్ మరో ఎత్తు. ‘అరుంధతి’ సినిమాలో పశుపతి సహా ఎన్నో పాత్రలకు తన గాత్రంతో ప్రాణం పోసిన అరుదైన డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్. ‘రేసుగుర్రం’ చిత్రంలో విలన్ రవి కిషన్తో పాటు ఆయన తండ్రిగా కనిపించే ముఖేష్ రుషికి, హీరో అన్న పాత్రలో నటించిన కిక్ శ్యామ్కు.. ఇలా మూడు పాత్రలకు వాయిస్ మార్చి డబ్బింగ్ చెప్పిన అరుదైన ఘనత రవికిషన్కే సొంతం.
ఐతే రవిశంకర్ నైపుణ్యం కేవలం డబ్బింగ్కే పరిమితం కాదు. నటుడిగానూ ఆయనకు మంచి పేరుంది. అలాగే రచన, దర్శకత్వంలోనూ ప్రవేశం ఉంది. తెలుగులో ‘నరసింహుడు’గా రీమేక్ అయిన కన్నడ సూపర్ హిట్ మూవీ ‘దుర్గి’కి రచయిత, దర్శకుడు రవిశంకరే.
ఆ సినిమా పెద్ద హిట్ అయినా.. మళ్లీ ఎందుకో డైరెక్షన్ చేయలేదు రవిశంకర్. ఐతే సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు రవిశంకర్ మళ్లీ మెగా ఫోన్ పడుతున్నాడు. తన కొడుకు అద్వయ్ను హీరోగా పరిచయం చేస్తూ రవిశంకర్ ‘సుబ్రహ్మణ్య’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మూవీ గురించి ఈ రోజే అనౌన్స్మెంట్ వచ్చింది. దీని ప్రి లుక్ పోస్టర్ చూస్తే భారీ సినిమాలాగే కనిపిస్తోంది. కేజీఎఫ్, సలార్ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండడం విశేషం. తిరుమల రెడ్డి, అనిల్ కడియాల పెద్ద బడ్జెట్లో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
తన కొడుకును అరంగేట్రంలోనే పాన్ ఇండియా హీరోను చేయాలని ప్లాన్ చేసుకున్నాడు రవిశంకర్. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మళయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. మరి దర్శకుడిగా రవిశంకర్ మళ్లీ విజయవంతం అవుతాడా.. తన కొడుక్కి అరంగేట్రంలోనే మంచి హిట్ అందిస్తాడా అన్నది చూడాలి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఇటీవల కాలంలో పలు అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.…
దేశంలో నేరాల స్థితి గతులు మారుతున్నాయా? ఒకప్పుడు నిరక్షరాస్యులు, కొద్దిమాత్రంగా చదువుకున్న వారే నేరాలకు పాల్పడేవారా? కానీ.. ఇప్పుడు ఉన్నతస్థాయి…
కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో అరంగేట్రంలోనే ఇటు ఇండస్ట్రీని, అటు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన దర్శకుడు వెంకటేష్ మహా. కానీ…
వచ్చే ఎన్నికలతోపాటు.. పార్టీ పరంగా దూకుడుగా వ్యవహరించేందుకు ముఖ్యంగా వైసీపీ వంటి పార్టీలకు చెక్ పెట్టేందుకు.. సీనియర్ నాయకులు కావాలని…
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2…
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…