ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలతో మన చిత్రాలను పోల్చడం కూడా పెద్ద సాహసం అనిపించేది. కానీ ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని సినిమాలు వస్తున్నాయి. రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ను చూసి జేమ్స్ కామెరూన్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలే ఆశ్చర్యపోయారు. ఇక ఇటీవలే ఓ సినిమా హాలీవుడ్ దృష్టిని ఆకర్షించి, అక్కడి ప్రముఖ నిర్మాణ సంస్థ అధికారికంగా రీమేక్ హక్కులు కొని మరీ రీమేక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆ చిత్రమే.. కిల్.
లక్ష్య అనే అప్ కమింగ్ నటుడిని హీరోగా పెట్టి నిఖిల్ నగేష్ భట్ అనే యువ దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. మునుపెన్నడూ చూడని నాన్ స్టాప్ యాక్షన్తో ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ యాక్షన్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. జులై 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది.
ఐతే థియేటర్లలో చూడలేని వాళ్లు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణ సెప్టెంబరు 6న ఫలించబోతోంది. ఆ రోజు నుంచే డిస్నీ హాట్ స్టార్ సంస్థ ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేయబోతోంది. ‘కిల్’ మూవీ ఇండియాలో రిలీజవ్వడానికంటే చాన్నాళ్ల ముందే టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విడుదలకు కొన్ని రోజుల ముందే ప్రెస్, ఫిలిం సెలబ్రెటీలకు స్పెషల్ షోలు వేశారు. అప్పుడే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ ప్రకారమే యాక్షన్ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకుంది.
ఒక రైల్లోకి చొరబడ్డ దొంగల ముఠా హీరో కుటుంబాన్ని తన కళ్ల ముందే అంతమొందిస్తుంది. దీంతో హీరో అక్కడికి వచ్చిన దొంగలతో పాటు వారి ముఠా మొత్తాన్ని ఎలా అంతం చేశాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. చాలా హింసాత్మకంగా సాగుతుందీ చిత్రం.
This post was last modified on %s = human-readable time difference 2:23 pm
https://www.youtube.com/watch?v=n75xEs-9u1I&t=2s డెబ్యూ మూవీ ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల…
రాజకీయాల్లో ఏ నాయకుడికైనా.. తన కంటూ జేజేలు కొట్టే కార్యకర్తలు కావాలి. తనను ప్రశంసించే, తన మాటకు ప్రాధాన్యమిచ్చే నాయకులు…
నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ ప్రమోషన్లలో భాగంగా హీరో సూర్య నిన్నబాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4 షోలో…
నిన్న జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రొడ్యూసర్స్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్ ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చకే…
ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కించుకున్న టీడీపీ.. పూర్వ వైభవం సంతరించుకున్న విషయం తెలిసిందే. మరో…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి వివాదం హాట్ టాపిక్…