Movie News

మోస్ట్ అవైటెడ్ మూవీ.. ఓటీటీలోకి వస్తోంది

ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలతో మన చిత్రాలను పోల్చడం కూడా పెద్ద సాహసం అనిపించేది. కానీ ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని సినిమాలు వస్తున్నాయి. రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ను చూసి జేమ్స్ కామెరూన్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలే ఆశ్చర్యపోయారు. ఇక ఇటీవలే ఓ సినిమా హాలీవుడ్ దృష్టిని ఆకర్షించి, అక్కడి ప్రముఖ నిర్మాణ సంస్థ అధికారికంగా రీమేక్ హక్కులు కొని మరీ రీమేక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆ చిత్రమే.. కిల్.

లక్ష్య అనే అప్ కమింగ్ నటుడిని హీరోగా పెట్టి నిఖిల్ నగేష్ భట్ అనే యువ దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. మునుపెన్నడూ చూడని నాన్ స్టాప్ యాక్షన్‌తో ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ యాక్షన్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. జులై 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ఐతే థియేటర్లలో చూడలేని వాళ్లు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణ సెప్టెంబరు 6న ఫలించబోతోంది. ఆ రోజు నుంచే డిస్నీ హాట్ స్టార్ సంస్థ ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేయబోతోంది. ‘కిల్’ మూవీ ఇండియాలో రిలీజవ్వడానికంటే చాన్నాళ్ల ముందే టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విడుదలకు కొన్ని రోజుల ముందే ప్రెస్, ఫిలిం సెలబ్రెటీలకు స్పెషల్ షోలు వేశారు. అప్పుడే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ ప్రకారమే యాక్షన్ ప్రియులను ఈ చిత్రం ఆకట్టుకుంది.

ఒక రైల్లోకి చొరబడ్డ దొంగల ముఠా హీరో కుటుంబాన్ని తన కళ్ల ముందే అంతమొందిస్తుంది. దీంతో హీరో అక్కడికి వచ్చిన దొంగలతో పాటు వారి ముఠా మొత్తాన్ని ఎలా అంతం చేశాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. చాలా హింసాత్మకంగా సాగుతుందీ చిత్రం.

This post was last modified on August 31, 2024 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

3 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

3 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

3 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

5 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

6 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

6 hours ago