న్యాచురల్ స్టార్ నానికి హ్యాట్రిక్ హిట్ అందించే దిశగా దూసుకుపోతున్న సరిపోదా శనివారంకు భారీ వర్షాలు స్పీడ్ బ్రేకుల్లా మారుతున్నాయి. హఠాత్తుగా నిన్న సాయంత్రం నుంచి తుఫాను తరహా వాతావరణం కమ్మేయడంతో ఎక్కడిక్కడ జనజీవనం స్థంభించింది.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వీకెండ్ కావడం వల్ల ఈ మూవీకి శని ఆదివారాలు చాలా కీలకం. ఒక్క హైదరాబాద్ నుంచే ఈ రోజు రెండు కోట్ల అడ్వాన్స్ గ్రాస్ వచ్చింది. కరెంట్ బుకింగ్స్ ఎక్కువగా జరిగే మాస్ సెంటర్ల నెంబర్లు ఇప్పుడీ వానల వల్ల హెచ్చుతగ్గులకు గురయ్యే ఛాన్స్ ఉంది.
ఇంకో రెండు మూడు రోజులు వర్షాలు ఇదే తరహాలో ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. ఎంత వర్షం వచ్చినా ప్రజలు తమ వృత్తులు, పనులు మానుకుని ఇళ్లలో ఉండరు. కానీ అదేపనిగా తుడుచుకుంటూ, ఇబ్బంది పడుతూ థియేటర్లకు వెళ్లడం అంత సులభంగా ఉండదు. అందులోనూ నగరాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
టికెట్లు బుక్ చేసుకున్నా ట్రాఫిక్ జామ్ కు భయపడి ఆగిపోయే వాళ్ళు కొందరైతే నేరుగా కొందామని ప్లాన్ చేసుకున్న వాళ్ళు మరో ఆలోచన లేకుండా మనసు మార్చుకుంటారు. ఇదంతా సరిపోదా శనివారంకు ఇబ్బంది కలిగించే పరిణామమే.
యూనిట్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారమే మొదటి రోజు ఇరవై నాలుగు కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సరిపోదా శనివారం యుఎస్ లో వేగంగా 1 మిలియన్ మార్కు అందుకుంది. పాజిటివ్ టాక్ క్రమంగా ఆక్యుపెన్సీలను పెంచుతోంది.
మరి ఈ వర్షాలు తెరిపినిస్తే మరింత మెరుగైన కలెక్షన్లను చూడొచ్చు. నాని గత మాస్ బ్లాక్ బస్టర్ దసరాని సులభంగా దాటుతుందేమోననే అంచనాలను సరిపోదా శనివారం అందుకోలేకపోతోంది. ఫైనల్ రన్ అయ్యాక దీని గురించి పూర్తి క్లారిటీ వస్తుంది. అంతా సరిపోతోంది అనుకుంటున్న టైంలో ఇప్పుడీ వర్షాలు సరిపోలేనంత టెన్షన్ కలిగిస్తున్నాయి.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…