ప్రభాస్ ఏక్ నిరంజన్ తో మనకు పరిచయమైనా పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైన కంగనా రౌనత్ క్రిష్ దర్శకత్వం వహించిన మణికర్ణికతో మనకు మరింత దగ్గరయ్యింది. ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఈ ఉంగరాల జుత్తు అమ్మాయి స్వంతంగా డైరెక్ట్ చేసిన మూవీ ఎమర్జెన్సీ. సెప్టెంబర్ 6 విడుదల కావాల్సిన ఈ చిత్రానికి వివాదాలు చుట్టుముట్టాయి. ఇందిరాగాంధీ 1975 నుంచి 1977 వరకు విధించిన అత్యయిక పరిస్థితి దేశంలో తీవ్ర అలజడికి దారి తీసింది. పౌర హక్కులను అడ్డుకునే చట్టం కావడంతో పాటు ఎన్నికలను సైతం నిలిపేసే వ్యవస్థను తేవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఎమర్జెన్సీ నడిచిన 21 నెలల పాటు ఎదురుకున్న ఆనాటి స్థితిగతులను కళ్ళకు కట్టినట్టు చూపాలనే ఉద్దేశంతో కంగన రౌనత్ దాన్ని అదే టైటిల్ తో తెరకెక్కించింది. అప్పట్లో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ గురించి కూడా ఇందులో కీలక ప్రస్తావన ఉందట. సదరు నటుడికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. సహజంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సినిమా పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పలు మైనారిటీ వర్గాలతో పాటు పంజాబ్ కు చెందిన కుల సంఘాలు ఎమర్జెన్సీని నిషేదించాలని ఆర్జీలు పెట్టుకున్నాయి. సెన్సార్ బోర్డు సైతం ఇందులో సున్నితత్వాన్ని గుర్తించింది.
గతంలో ఇదే తరహాలో ఇందూ సర్కార్ అనే మూవీ వచ్చింది. కానీ స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో పాటు తీసిన విధానం ఆసక్తికరంగా లేకపోవడంతో ఫ్లాప్ అయ్యింది. అందుకే ఎక్కువ కాంట్రావర్సికి చోటు దక్కలేదు. కానీ ఇప్పుడు కంగనా రౌనత్ లాంటి పేరున్న ఆర్టిస్ట్ తీయడంతో ఎక్కడ లేని ప్రచారం వచ్చేసింది. అధికారంలో ఉన్నది బిజెపి ప్రభుత్వం కాబట్టి క్లియరెన్స్ వస్తుందనే కామెంట్ల నేపథ్యంలో ఒకవేళ వివాదం కోర్టు మెట్లు ఎక్కితే ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. మోక్షం దక్కించుకుని బయటికి వచ్చాక నిజంగా ఊహించినట్టు వివాదాస్పద అంశాలు ఉంటే మాత్రం కంగనాకు ఇబ్బందే.
This post was last modified on August 30, 2024 5:58 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…