డిసెంబర్ లో అయినా పుష్ప 2 వస్తుందా రాదా అనే అనుమానాలు అభిమానుల్లో లేకపోలేదు. ఇప్పటికే బంగారం లాంటి ఆగస్ట్ 15 డేట్ మిస్సయ్యిందని ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ఆ అవకాశాన్ని స్త్రీ 2 లాంటి చిన్న బడ్జెట్ సినిమా వాడుకుని అయిదు వందల కోట్లు కొల్లగొట్టడం చూస్తే ఆ మాత్రం ఆవేదన కలగడం సహజం. సరే పాతది తవ్వుకుని లాభం లేదు. కాబట్టి డిసెంబర్ 6 ఖచ్చితంగా రిలీజ్ ఉంటుందా అనే డౌట్ కు మైత్రి అధినేతల్లో ఒకరైన రవి శంకర్ ఇవాళ జరిగిన మత్తువదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా స్పష్టమైన క్లారిటీ వివరాలతో సహా ఇచ్చేశారు.
సెప్టెంబర్ 2కి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తవుతుందని, అక్టోబర్ 6 సెకండాఫ్ ఎడిటింగ్ ఫినిష్ చేసి నవంబర్ 20 కి ఫైనల్ కాపీ సిద్ధంగా ఉంచుతామని అన్నారు. నవంబర్ 25 సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోగొట్టేసి ముందు చెప్పిన ప్రకారమే డిసెంబర్ 6 భారీ ఎత్తున పుష్ప 2 ది రూల్ ని థియేటర్లకు తీసుకొస్తామని అన్నారు. నిజం చెప్పాలంటే ఇంత క్లారిటీతో పుష్ప ఎప్పుడూ వివరాలు ఇవ్వలేదు. షూటింగ్ లో బిజీగా ఉండి సుకుమార్, అల్లు అర్జున్ మీడియాకి దొరక్కుండా ఉన్న నేపధ్యంలో కనీసం ఇప్పటికైనా రవిశంకర్ ద్వారా ఇన్ని డీటెయిల్స్ తెలియడం ఫ్యాన్స్ కి సంతోషం కలిగించేదే.
సో ఎలాంటి అనుమానం లేకుండా రిలీజ్ సంబరాలకు రెడీ అయిపోవచ్చు. బిజినెస్ వ్యవహారాలు ఏరియాల వారీగా మెల్లగా క్లోజ్ చేయబోతున్నారు. భారీ క్రేజ్ ఉన్న నేపథ్యంలో అనుకున్నదాని కన్నా ఎక్కువ రేట్లు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్నాయట. ముఖ్యంగా హిందీ బెల్టు నుంచి కనీసం రెండు వందల కోట్ల బిజినెస్ ఆశించవచ్చనేది విశ్లేషకుల అంచనా. పుష్ప 1 ది రైజ్ ఎలాంటి హైప్ లేకుండానే బ్లాక్ బస్టర్ అయ్యింది. దెబ్బకు పుష్ప 2 మీద క్రేజ్ మాములుగా లేదు. ఇంకో మూడు నెలలకు పైగా టైం ఉంది కాబట్టి ప్రమోషన్లకు సంబంధించిన పూర్తి కార్యాచరణ సిద్ధం చేసుకోలేదు.
This post was last modified on August 30, 2024 2:21 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…