ఒక పేరున్న హీరో మాస్ సినిమా కోసం టాలీవుడ్ బాక్సాఫీస్ ఎంతగా తపించిపోతోందో ఇవాళ విడుదలైన సరిపోదా శనివారం రుజువు చేస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మీద పబ్లిక్ టాక్ బాగుండటంతో దాదాపు అన్ని మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. బుక్ మై షోలో సగటున గంటకు 9 వేల టికెట్లు అది కూడా వీక్ డే అయిన గురువారం అమ్ముడుపోవడం శుభ సంకేతం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సగటు మూవీ లవర్స్ చూడాల్సిన ఎక్స్ పీరియన్స్ గా ఫీడ్ బ్యాక్ ఇవ్వడంతో అదనపు స్క్రీన్లు అవసరమయ్యేలా ఉన్నాయి.
ఫైనల్ స్టేటస్ ఏంటనేది తేలడానికి ఇంకా చాలా టైం పడుతుంది కానీ మొదటి వీకెండ్ మాత్రం పూర్తిగా నాని అదుపులోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా శని ఆదివారాల ఫిగర్స్ పట్ల బయ్యర్లు గట్టి నమ్మకంతో ఉన్నారు. నిజానికి మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లు కనీసం యావరేజ్ అనిపించుకున్నా ఓ పది రోజులు సందడి చేసేవి. కానీ మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ రావడం వల్ల మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ లేకుండా పోయింది. కానీ సరిపోదా శనివారంకి ఆ రిస్క్ లేదు. హ్యాపీగా చూసేయొచ్చనే మాట బయటికి వచ్చేయడంతో క్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగే సూచనలు పుష్కలంగా ఉన్నాయి.
ఓపెనింగ్ ఎంతనేది రేపు మధ్యాన్నానికి తేలుతుంది కానీ ట్రెండ్ చూస్తుంటే దసరాని దాటడం ఖాయంగా కనిపిస్తోంది. నాని ఎస్జె సూర్య నటన, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయినా యునీక్ పాయింట్ హ్యాండిల్ చేసిన విధానం మాస్ కి కనెక్ట్ అవుతోంది. జెక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. హిట్టా లేక అంతకు మించా అనేది ఇప్పుడే నిర్ణయించలేం కాబట్టి కనీసం ఓ పది రోజులు వేచి చూడాల్సి వస్తుంది. ఏబి సెంటర్స్ అధిక శాతం నిన్న, మొన్న వారం వచ్చిన సినిమాలకు రీ ప్లేస్ మెంట్ గా సరిపోదా శనివారంనే వేయబోతున్నారు. ట్రేడ్ తో సహా అందరూ నెంబర్ల కోసం వెయిటింగ్.
This post was last modified on August 29, 2024 4:47 pm
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…