పుష్ప 1 ది రైజ్, పుష్ప 2 ది రూల్ తర్వాత పుష్ప 3 ది రోర్ ఉంటుందని మా సైట్ ఫిబ్రవరిలోనే ఎక్స్ క్లూజివ్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే విడుదలైన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన రావు రమేష్ మూడో భాగంలోనూ తనకు ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పడంతో అనధికారికంగానే అఫీషియల్ ముద్ర వచ్చినట్టయ్యింది. ఒకవేళ ఇదే నిజమైతే స్టార్ హీరోల్లో మొదటి మూడు భాగాల ప్యాన్ ఇండియా మూవీ చేసిన వాడిగా అల్లు అర్జున్ పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇక వ్యూహం సంగతి చూద్దాం.
పుష్ప 2 డిసెంబర్ లో రిలీజయ్యాక బన్నీకి చాలా గ్యాప్ రానుంది. అట్లీతో ప్రాజెక్టు ఓకే అయ్యిందని పదే పదే లీక్ కావడం తప్పించి నిజంగా ఉంటుందా లేదానే కన్ఫర్మేషన్ దొరకడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. స్పిరిట్, యానిమల్ పూర్తి చేసి 2028 తర్వాత కానీ సందీప్ రెడ్డి వంగా అందుబాటులోకి రాడు. సో అల్లు అర్జున్ కనక పుష్ప 3 సిద్ధంగా ఉంచుకుంటే వచ్చే ఏడాది లేదా ఆ పై సంవత్సరం దాన్ని విడుదల చేయడం ద్వారా గ్యాప్ లేని సంకేతాన్ని అభిమానులకు పంపుకోవచ్చు. ఇది నిజమా కాదాని తెలిసేది కూడా పార్ట్ 2 షో పడ్డాకే.
ఈ లెక్కన దర్శకుడు సుకుమార్ పుష్ప 3 కోసం మరికొంత కాలం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రిలీజ్ డేట్ ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి పబ్లిసిటీ విషయంలో తొందరపాటు చూపించే ఉద్దేశంలో సుక్కు బృందం లేదు. వస్తున్న బిజినెస్ ఆఫర్లు చూస్తుంటే కల్కి 2898 ఏడి రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతుండగా గత కొద్దిరోజులుగా మెగాభిమానులు వర్సెస్ బన్నీ ఆర్మీ మధ్య జరుగుతున్న ట్రోలింగ్ యుద్ధం ఓపెనింగ్స్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందేమోననే అనుమానం జనంలో లేకపోలేదు. మొత్తానికి పుష్పకి సంబంధించిన పరిణామాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి.
This post was last modified on August 28, 2024 2:13 pm
ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ…
దేశంలో `వన్ నేషన్-వన్ ఎలక్షన్` పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాలని.. కేంద్రం తలపోస్తున్న విషయం తెలిసిందే. దీనిపై…
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో…
టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద…
మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…
సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్షిప్)కు ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పందన వస్తోంది. సమాజంలోని పేదలను ఆదుకుని..…