పుష్ప 1 ది రైజ్, పుష్ప 2 ది రూల్ తర్వాత పుష్ప 3 ది రోర్ ఉంటుందని మా సైట్ ఫిబ్రవరిలోనే ఎక్స్ క్లూజివ్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే విడుదలైన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన రావు రమేష్ మూడో భాగంలోనూ తనకు ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పడంతో అనధికారికంగానే అఫీషియల్ ముద్ర వచ్చినట్టయ్యింది. ఒకవేళ ఇదే నిజమైతే స్టార్ హీరోల్లో మొదటి మూడు భాగాల ప్యాన్ ఇండియా మూవీ చేసిన వాడిగా అల్లు అర్జున్ పేరు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇక వ్యూహం సంగతి చూద్దాం.
పుష్ప 2 డిసెంబర్ లో రిలీజయ్యాక బన్నీకి చాలా గ్యాప్ రానుంది. అట్లీతో ప్రాజెక్టు ఓకే అయ్యిందని పదే పదే లీక్ కావడం తప్పించి నిజంగా ఉంటుందా లేదానే కన్ఫర్మేషన్ దొరకడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. స్పిరిట్, యానిమల్ పూర్తి చేసి 2028 తర్వాత కానీ సందీప్ రెడ్డి వంగా అందుబాటులోకి రాడు. సో అల్లు అర్జున్ కనక పుష్ప 3 సిద్ధంగా ఉంచుకుంటే వచ్చే ఏడాది లేదా ఆ పై సంవత్సరం దాన్ని విడుదల చేయడం ద్వారా గ్యాప్ లేని సంకేతాన్ని అభిమానులకు పంపుకోవచ్చు. ఇది నిజమా కాదాని తెలిసేది కూడా పార్ట్ 2 షో పడ్డాకే.
ఈ లెక్కన దర్శకుడు సుకుమార్ పుష్ప 3 కోసం మరికొంత కాలం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రిలీజ్ డేట్ ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి పబ్లిసిటీ విషయంలో తొందరపాటు చూపించే ఉద్దేశంలో సుక్కు బృందం లేదు. వస్తున్న బిజినెస్ ఆఫర్లు చూస్తుంటే కల్కి 2898 ఏడి రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతుండగా గత కొద్దిరోజులుగా మెగాభిమానులు వర్సెస్ బన్నీ ఆర్మీ మధ్య జరుగుతున్న ట్రోలింగ్ యుద్ధం ఓపెనింగ్స్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందేమోననే అనుమానం జనంలో లేకపోలేదు. మొత్తానికి పుష్పకి సంబంధించిన పరిణామాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి.
This post was last modified on August 28, 2024 2:13 pm
https://www.youtube.com/watch?v=ddmpaI3WTvc
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…