ఇంకొద్ది గంటల్లో ప్రీమియర్లు మొదలుకాబోతున్న సరిపోదా శనివారంకు నాని కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ వస్తాయనే ధీమాతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సులకు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్లో హఠాత్తుగా తీసేయడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మూడు రోజుల క్రితం ఉండేవి కానీ చెప్పా పెట్టకుండా బుక్ మై షో, పేటిఎంతో పాటు వాటి స్వంత యాప్స్ లో లేకపోవడం చూసి కారణం అంతు చిక్కక సతమతమవుతున్నారు. దీని వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతాయని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించమని ప్రేక్షకులు కోరుతున్నారు.
స్పష్టమైన వివరాలు ఇంకా బయటికి రాలేదు ఒకటి రెండు రీజన్స్ కనిపిస్తున్నాయి. పివిఆర్ సంస్థ తక్కువ ధరకు మల్టీప్లెక్స్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పాస్ పోర్ట్ స్కీంలో వేలాది సభ్యులు ఉన్నారు. వాళ్లంతా సోమవారం నుంచి గురువారం వరకు కేవలం తొంభై రూపాయలలోపే బుక్ చేసుకోవచ్చు. సరిపోదా శనివారం చూస్తేనేమో గురువారం రిలీజవుతోంది. నైజామ్ లో రెండు వందల తొంబై అయిదు రూపాయలకు అమ్మాల్సిన టికెట్ ను కేవలం అందులో ముపై శాతానికి అమ్మితే నష్టం కదా. ఇది అధికారికంగా చెప్పలేదు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది.
మరొకటి డిస్ట్రిబ్యూటర్స్ పివిఆర్ మధ్య పర్సెంటేజ్ గురించి ఏదైనా వ్యవహారం కొలిక్కి రానప్పుడు ఇలా జరుగుతుంది. పలువురు నెటిజెన్లు డివివి సంస్థని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేస్తే మీరు సంబరానికి రెడీ అవ్వండి ఇది మేము చూసుకుంటామని హామీ వచ్చింది. తీరా చూస్తే పన్నెండు గంటలు దాటుతున్నా ఎలాంటి అప్డేట్ లేదు. నాని రేయి పగలు తేడా లేకుండా ప్రమోషన్ల కోసం ఎడతెరిపి లేకుండా తిరుగుతూ ఉంటే ఇలాంటి విషయాలు ఆందోళన రేకెత్తించడం సహజం. ఆఘమేఘాల మీద ఈ ఇష్యూని ముగించేసి అన్ని స్క్రీన్ల బుకింగ్స్ అందుబాటులోకి తేవాలని నాని ఫ్యాన్స్ డిమాండ్.
This post was last modified on August 28, 2024 12:19 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…