ఇంకొద్ది గంటల్లో ప్రీమియర్లు మొదలుకాబోతున్న సరిపోదా శనివారంకు నాని కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ వస్తాయనే ధీమాతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సులకు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్లో హఠాత్తుగా తీసేయడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మూడు రోజుల క్రితం ఉండేవి కానీ చెప్పా పెట్టకుండా బుక్ మై షో, పేటిఎంతో పాటు వాటి స్వంత యాప్స్ లో లేకపోవడం చూసి కారణం అంతు చిక్కక సతమతమవుతున్నారు. దీని వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతాయని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించమని ప్రేక్షకులు కోరుతున్నారు.
స్పష్టమైన వివరాలు ఇంకా బయటికి రాలేదు ఒకటి రెండు రీజన్స్ కనిపిస్తున్నాయి. పివిఆర్ సంస్థ తక్కువ ధరకు మల్టీప్లెక్స్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పాస్ పోర్ట్ స్కీంలో వేలాది సభ్యులు ఉన్నారు. వాళ్లంతా సోమవారం నుంచి గురువారం వరకు కేవలం తొంభై రూపాయలలోపే బుక్ చేసుకోవచ్చు. సరిపోదా శనివారం చూస్తేనేమో గురువారం రిలీజవుతోంది. నైజామ్ లో రెండు వందల తొంబై అయిదు రూపాయలకు అమ్మాల్సిన టికెట్ ను కేవలం అందులో ముపై శాతానికి అమ్మితే నష్టం కదా. ఇది అధికారికంగా చెప్పలేదు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది.
మరొకటి డిస్ట్రిబ్యూటర్స్ పివిఆర్ మధ్య పర్సెంటేజ్ గురించి ఏదైనా వ్యవహారం కొలిక్కి రానప్పుడు ఇలా జరుగుతుంది. పలువురు నెటిజెన్లు డివివి సంస్థని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేస్తే మీరు సంబరానికి రెడీ అవ్వండి ఇది మేము చూసుకుంటామని హామీ వచ్చింది. తీరా చూస్తే పన్నెండు గంటలు దాటుతున్నా ఎలాంటి అప్డేట్ లేదు. నాని రేయి పగలు తేడా లేకుండా ప్రమోషన్ల కోసం ఎడతెరిపి లేకుండా తిరుగుతూ ఉంటే ఇలాంటి విషయాలు ఆందోళన రేకెత్తించడం సహజం. ఆఘమేఘాల మీద ఈ ఇష్యూని ముగించేసి అన్ని స్క్రీన్ల బుకింగ్స్ అందుబాటులోకి తేవాలని నాని ఫ్యాన్స్ డిమాండ్.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…