తెలుగు సినిమాను మలుపు తిప్పిన ఆల్ టైం క్లాసిక్ శివని వెండితెరపై చూడాలని కోరుకుంటున్న మూవీ లవర్స్ లక్షల్లో ఉన్నారు. 1989లో రిలీజైన ఈ కాలేజీ యాక్షన్ బ్లాక్ బస్టర్ గురించి ఎన్ని వేల వ్యాసాలు వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. ఇప్పుడంటే గతి తప్పింది కానీ ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే బ్రాండ్ ని బాలీవుడ్ దాకా తీసుకెళ్లింది శివనే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా నుంచే అమలతో నాగార్జున బంధం మరింత బలపడి వివాహం దాకా వెళ్ళింది. ఇళయరాజా సంగీతం, గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం, కొత్త కుర్రాళ్ళ యాక్టింగ్ టాలెంట్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో.
ఇప్పుడీ శివ 4Kలో రానుంది. నిజానికీ పుట్టినరోజుకి దాన్నే రీ రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ప్రింట్ కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో శివ స్థానంలో మాస్ తీసుకొచ్చారు. ఇవాళ థియేటర్లలో సందడి చేస్తున్న మాస్ టైటిల్ కార్డుకి ముందే శివ ట్రైలర్ ద్వారా అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. విడుదల తేదీ ఎప్పుడనేది ఇంకా చెప్పలేదు కానీ డిసెంబర్ లో ఉండొచ్చని టాక్. మాస్ ని ఇవాళ పరిమిత షోలతో స్క్రీనింగ్ చేశారు. ఇంద్ర తరహాలో కాకుండా ఉన్నంతలో తక్కువ ఆటలతోనే ఎక్కువ హంగామా ప్లాన్ చేసుకున్నారు అభిమానులు. క్రాస్ రోడ్స్ లో సందడి ఓ రేంజ్లో ఉంది.
ఏదైతేనేం ఒక క్లాసిక్ ని సరికొత్త క్వాలిటీతో చూడటం కొత్త తరం ఆడియన్స్ కి విభిన్న అనుభూతిని కలిగిస్తుంది. గతంలో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటివి రీ రిలీజ్ చేసినా క్వాలిటీ విషయంలో శ్రద్ధ తీసుకోపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. పాత సినిమాలింతే అని సరిపెట్టుకున్నారు. నిజానికి సరైన రీతిలో వర్క్ చేయిస్తే అద్భుతమైన రెజోల్యూషన్ తో అదరగొట్టొచ్చని ఇటీవలే మలయాళం మూవీ మణిచిత్రతజు (చంద్రముఖి ఒరిజినల్) నిరూపించింది. ఇదే బాటలో శివ, జగదేకవీరుడు అతిలోకసుందరి, భైరవ ద్వీపం, బొబ్బిలి రాజా లాంటివి వస్తే ఫ్యాన్స్ కు పండగే.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…