Movie News

2 బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ సాధ్యమేనంటారా

ఇంద్ర రీ రిలీజ్ ఘనవిజయాన్ని పురస్కరించుకుని టీమ్ మొత్తాన్ని ఇంటికి పిలిపించి చిరంజీవి సత్కరించిన వీడియో నిన్న వైజయంతి మూవీస్ అధికారికంగా విడుదల చేసింది. ఇందులో చాలా విశేషాలున్నాయి కానీ అభిమానులను ప్రధానంగా ఆకట్టుకున్న అంశం ఒకటుంది. అది జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్రకు సీక్వెల్స్ ఉంటాయని వాటికి సంబంధించిన వివరాలు త్వరలో చెబుతానని నిర్మాత అశ్వినిదత్ ప్రకటించడం. ఇది వినగానే అక్కడున్న అందరూ ఆశ్చర్యానందంతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు. కానీ ప్రాక్టికల్ గా చూడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

ముందు జగదేకవీరుడు అతిలోకసుందరి సంగతి చూస్తే 1990లో రిలీజైన ఈ ఆల్ టైం క్లాసిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మానవుడికి, ఇంద్రుడి కూతురికి మధ్య సృష్టించిన ప్రేమకథ ఆబాలగోపాలాన్ని అలరించింది. అప్పట్లో సీక్వెల్స్ ట్రెండ్ లేదు కాబట్టి ఎవరూ ఆలోచించలేదు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబోలో పార్ట్ 2 వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ దత్ గారి మనసులో ఏముందో ఇంకా తెలియాలి. పైగా ఆ సినిమాలో నటించిన శ్రీదేవి, అమ్రిష్ పూరి, రామిరెడ్డి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్ ఇలా ఎంతో మంది మనమధ్య లేరు.

సో ఫ్రెష్ గా కొత్త స్టోరీ అల్లుకోవాలి. ఇక ఇంద్ర సంగతి చూస్తే ఫ్యాక్షన్ ట్రెండ్ దాదాపు అంతరించిపోయింది. అడపాదడపా వస్తున్నాయి కానీ చాలామటుకు తగ్గిపోయాయి. 2002లో వచ్చిన ఇంద్రకు కొనసాగింపంటే బలమైన కసరత్తు చేయాలి. దీంట్లో చేసిన ఆర్తి అగర్వాల్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు లాంటి వాళ్ళు కాలం చేశారు. రెండింటికి ఇలా సమస్యలు కొన్నున్నాయి. పైగా ఈ సినిమాలకు గొప్ప సంగీతం ఇచ్చిన ఇళయరాజా, మణిశర్మలు ఫామ్ లో లేరు. దర్శకులు రాఘవేంద్రరావు, బి గోపాల్ రిటైరయ్యారు. ఈ ప్రతికూలతలన్నీ దాటుకుని క్లాసిక్స్ కి రెండో భాగం తీసే సవాల్ ని దత్తుగారి ఎలా దాటుతారో.

This post was last modified on August 27, 2024 10:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

58 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago