ఇంద్ర రీ రిలీజ్ ఘనవిజయాన్ని పురస్కరించుకుని టీమ్ మొత్తాన్ని ఇంటికి పిలిపించి చిరంజీవి సత్కరించిన వీడియో నిన్న వైజయంతి మూవీస్ అధికారికంగా విడుదల చేసింది. ఇందులో చాలా విశేషాలున్నాయి కానీ అభిమానులను ప్రధానంగా ఆకట్టుకున్న అంశం ఒకటుంది. అది జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్రకు సీక్వెల్స్ ఉంటాయని వాటికి సంబంధించిన వివరాలు త్వరలో చెబుతానని నిర్మాత అశ్వినిదత్ ప్రకటించడం. ఇది వినగానే అక్కడున్న అందరూ ఆశ్చర్యానందంతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు. కానీ ప్రాక్టికల్ గా చూడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
ముందు జగదేకవీరుడు అతిలోకసుందరి సంగతి చూస్తే 1990లో రిలీజైన ఈ ఆల్ టైం క్లాసిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మానవుడికి, ఇంద్రుడి కూతురికి మధ్య సృష్టించిన ప్రేమకథ ఆబాలగోపాలాన్ని అలరించింది. అప్పట్లో సీక్వెల్స్ ట్రెండ్ లేదు కాబట్టి ఎవరూ ఆలోచించలేదు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబోలో పార్ట్ 2 వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ దత్ గారి మనసులో ఏముందో ఇంకా తెలియాలి. పైగా ఆ సినిమాలో నటించిన శ్రీదేవి, అమ్రిష్ పూరి, రామిరెడ్డి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్ ఇలా ఎంతో మంది మనమధ్య లేరు.
సో ఫ్రెష్ గా కొత్త స్టోరీ అల్లుకోవాలి. ఇక ఇంద్ర సంగతి చూస్తే ఫ్యాక్షన్ ట్రెండ్ దాదాపు అంతరించిపోయింది. అడపాదడపా వస్తున్నాయి కానీ చాలామటుకు తగ్గిపోయాయి. 2002లో వచ్చిన ఇంద్రకు కొనసాగింపంటే బలమైన కసరత్తు చేయాలి. దీంట్లో చేసిన ఆర్తి అగర్వాల్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు లాంటి వాళ్ళు కాలం చేశారు. రెండింటికి ఇలా సమస్యలు కొన్నున్నాయి. పైగా ఈ సినిమాలకు గొప్ప సంగీతం ఇచ్చిన ఇళయరాజా, మణిశర్మలు ఫామ్ లో లేరు. దర్శకులు రాఘవేంద్రరావు, బి గోపాల్ రిటైరయ్యారు. ఈ ప్రతికూలతలన్నీ దాటుకుని క్లాసిక్స్ కి రెండో భాగం తీసే సవాల్ ని దత్తుగారి ఎలా దాటుతారో.
This post was last modified on August 27, 2024 10:56 am
జూన్ నెలలో పెద్ది విడుదల ముందు వరకు దర్శకుడు బుచ్చిబాబు మీద మెగా ఫ్యాన్స్ ఒకటే కాదు ఇండస్ట్రీ జనాలు…
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…