సరిగ్గా నెల రోజుల్లో దేవర పార్ట్ 1 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌంట్ డౌన్ ముప్పై రోజులు మాత్రమే ఉండటంతో అభిమానులు ప్రమోషన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎలాగూ షూటింగ్ అయిపోయింది కాబట్టి దానికి అనుగుణంగానే పబ్లిసిటీ ఎలా ఉండాలనే దాని మీద టీమ్ కసరత్తులు చేస్తోంది.
దర్శకుడు కొరటాల శివ మిగిలిన ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్నారు. అనిరుద్ రవిచందర్ విదేశాల నుంచి రాగానే రీ రికార్డింగ్ మొదలుపెట్టాల్సి ఉంటుంది. సెప్టెంబర్ మూడో వారానికి ఫస్ట్ కాపీ సిద్ధం చేసి సెన్సార్ కు పంపాలి. లేదంటే చాలా ఒత్తిళ్లు తలెత్తుతాయి.
ఇదిలా ఉండగా దేవర బెనిఫిట్ షోలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం జరిగినట్టు లేటెస్ట్ అప్డేట్. ఓవర్ సీస్ తో పాటు ఇండియాలోనూ ఒకే సమయంలో మొదటి ఆట పడేలా అర్ధరాత్రి ఒంటి గంటకు ముహూర్తం నిర్ణయించినట్టుగా తెలిసింది.
దీని వల్ల ఓవర్సీస్ రిపోర్ట్స్, ఇక్కడి రివ్యూస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే యుఎస్ టాక్ తీసుకుని సోషల్ మీడియాలో దాన్ని నెగటివ్ గా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. ఒకరకంగా ఇది తెలివైన స్ట్రాటజీ. అమెరికాలో ఎన్ఆర్ఐ ప్రీమియర్ చూస్తున్నపుడే అనకాపల్లిలో తారక్ ఫ్యాన్ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాడు. సో ఒక రకంగా తెలివైన గేమ్ ఇది.
అలా అని రిస్క్ లేకుండా పోలేదు. తెల్లవారకుండానే పూర్తి టాక్ బయటికి వస్తుంది. పాజిటివ్ అయితే టికెట్లు దొరకడం దుర్లభమే. దీనికి తోడు పగటి పూట షోలలో కోత వేసుకోవాల్సి ఉంటుంది. అనుమతి అయిదు ఆటలకే ఉంటుంది కాబట్టి ఆరో షోకి అనుమతి కోసం ప్రభుత్వాలకు అప్లికేషన్ పెట్టాలి.
టికెట్ పెంపు ఎలాగూ ఉండబోతోంది. అది పది రోజులా లేక రెండు వారాలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గత కొన్నేళ్లలో ఏ స్టార్ హీరోకి మిడ్ నైట్ ప్రీమియర్లు పడలేదు. ఒకవేళ దేవర కనక దీనికి శ్రీకారం చుడితే రాబోయే పుష్ప 2, గేమ్ ఛేంజర్, విశ్వంభర వగైరాలన్నీ ఇదే రూటు పడతాయి. నో డౌట్.
This post was last modified on August 27, 2024 10:29 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…