సరిగ్గా నెల రోజుల్లో దేవర పార్ట్ 1 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌంట్ డౌన్ ముప్పై రోజులు మాత్రమే ఉండటంతో అభిమానులు ప్రమోషన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎలాగూ షూటింగ్ అయిపోయింది కాబట్టి దానికి అనుగుణంగానే పబ్లిసిటీ ఎలా ఉండాలనే దాని మీద టీమ్ కసరత్తులు చేస్తోంది.
దర్శకుడు కొరటాల శివ మిగిలిన ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్నారు. అనిరుద్ రవిచందర్ విదేశాల నుంచి రాగానే రీ రికార్డింగ్ మొదలుపెట్టాల్సి ఉంటుంది. సెప్టెంబర్ మూడో వారానికి ఫస్ట్ కాపీ సిద్ధం చేసి సెన్సార్ కు పంపాలి. లేదంటే చాలా ఒత్తిళ్లు తలెత్తుతాయి.
ఇదిలా ఉండగా దేవర బెనిఫిట్ షోలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం జరిగినట్టు లేటెస్ట్ అప్డేట్. ఓవర్ సీస్ తో పాటు ఇండియాలోనూ ఒకే సమయంలో మొదటి ఆట పడేలా అర్ధరాత్రి ఒంటి గంటకు ముహూర్తం నిర్ణయించినట్టుగా తెలిసింది.
దీని వల్ల ఓవర్సీస్ రిపోర్ట్స్, ఇక్కడి రివ్యూస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే యుఎస్ టాక్ తీసుకుని సోషల్ మీడియాలో దాన్ని నెగటివ్ గా ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. ఒకరకంగా ఇది తెలివైన స్ట్రాటజీ. అమెరికాలో ఎన్ఆర్ఐ ప్రీమియర్ చూస్తున్నపుడే అనకాపల్లిలో తారక్ ఫ్యాన్ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాడు. సో ఒక రకంగా తెలివైన గేమ్ ఇది.
అలా అని రిస్క్ లేకుండా పోలేదు. తెల్లవారకుండానే పూర్తి టాక్ బయటికి వస్తుంది. పాజిటివ్ అయితే టికెట్లు దొరకడం దుర్లభమే. దీనికి తోడు పగటి పూట షోలలో కోత వేసుకోవాల్సి ఉంటుంది. అనుమతి అయిదు ఆటలకే ఉంటుంది కాబట్టి ఆరో షోకి అనుమతి కోసం ప్రభుత్వాలకు అప్లికేషన్ పెట్టాలి.
టికెట్ పెంపు ఎలాగూ ఉండబోతోంది. అది పది రోజులా లేక రెండు వారాలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గత కొన్నేళ్లలో ఏ స్టార్ హీరోకి మిడ్ నైట్ ప్రీమియర్లు పడలేదు. ఒకవేళ దేవర కనక దీనికి శ్రీకారం చుడితే రాబోయే పుష్ప 2, గేమ్ ఛేంజర్, విశ్వంభర వగైరాలన్నీ ఇదే రూటు పడతాయి. నో డౌట్.
This post was last modified on August 27, 2024 10:29 am
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…