టోవినో థామస్ మనకు రెగ్యులర్ థియేటర్ హీరో కాకపోయినా ఓటిటి ద్వారా బాగా సుపరిచితుడు. ముఖ్యంగా మిన్నల్ మురళి తర్వాత తెలుగులో గుర్తింపు మొదలైంది. 2018 ఎవ్రి వన్ ఈజ్ హీరో దాన్ని మరింత పైకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఏఆర్ఎం అనే ప్యాన్ ఇండియా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆరు భాషల్లో సెప్టెంబర్ 12 విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ ని మైత్రి సంస్థ తెలుగులో పంపిణి చేస్తోంది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ కాగా మనకు బాగా పరిచయమున్న ఐశ్వర్య రాజేష్ మరో కీలక పాత్ర పోషించింది. ట్రైలర్ ద్వారా కథేంటో ఓపెన్ చేశారు.
అనగనగా పూర్వీకుల కాలం. హరిపురంలో పేరు మోసిన దొంగ మణియన్ (టోవినో థామస్) వల్ల కంటి మీద కునుకు లేక ఊరి జనం అల్లాడిపోతుంటారు. ఎంతటి యోధుడినైనా మట్టి కురిపించే అతని కండబలం ముందు ఎవరైనా ఒడిపోవాల్సిందే. అదే పోలికల్లో ఉండే కొడుకు అజయన్ కూడా ఇదే తరహా నేపధ్యం ఉంటుంది. కట్ చేస్తే వర్తమానంలో మనవడు కుంజికెలు (టోవినో థామస్) తమ వంశంకున్న మచ్చ వల్ల ఇబ్బందులు పడుతుంటాడు. దొంగ కాకపోయినా ఆ ముద్ర మోయాల్సి వస్తుంది. ప్రియురాలు (కృతి శెట్టి) సైతం చిక్కుల్లో పడుతుంది. ఈ చిక్కుముడే అసలు కథ
విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. టోవినో థామస్ దీనికోసం చాలా కష్టపడ్డాడు. ఇతర భాషల్లో మార్కెట్ తెస్తుందనే నమ్మకంతో భారీ ప్రమోషన్లకు ప్లాన్ చేసుకున్నాడు. మొత్తం మల్లువుడ్ టీమే పనిచేసినప్పటికీ టెక్నికల్ వేల్యూస్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కృతి శెట్టికి ఒకరకంగా ఇది బంపర్ ఆఫరనే చెప్పాలి. తెలుగులో వరస డిజాస్టర్లతో మార్కెట్ బాగా పడిపోయిన టైంలో ఈ ఏఆర్ఎం వస్తోంది. వినాయకచవితి పండగ తర్వాత వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా మీద అంచనాలు రేగేలా ట్రైలర్ కట్ చేశారు. బడ్జెట్ వంద కోట్లకు పైగానే అయ్యిందట. జితిన్ లాల్ దర్శకుడు.
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…