టోవినో థామస్ మనకు రెగ్యులర్ థియేటర్ హీరో కాకపోయినా ఓటిటి ద్వారా బాగా సుపరిచితుడు. ముఖ్యంగా మిన్నల్ మురళి తర్వాత తెలుగులో గుర్తింపు మొదలైంది. 2018 ఎవ్రి వన్ ఈజ్ హీరో దాన్ని మరింత పైకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఏఆర్ఎం అనే ప్యాన్ ఇండియా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆరు భాషల్లో సెప్టెంబర్ 12 విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ ని మైత్రి సంస్థ తెలుగులో పంపిణి చేస్తోంది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ కాగా మనకు బాగా పరిచయమున్న ఐశ్వర్య రాజేష్ మరో కీలక పాత్ర పోషించింది. ట్రైలర్ ద్వారా కథేంటో ఓపెన్ చేశారు.
అనగనగా పూర్వీకుల కాలం. హరిపురంలో పేరు మోసిన దొంగ మణియన్ (టోవినో థామస్) వల్ల కంటి మీద కునుకు లేక ఊరి జనం అల్లాడిపోతుంటారు. ఎంతటి యోధుడినైనా మట్టి కురిపించే అతని కండబలం ముందు ఎవరైనా ఒడిపోవాల్సిందే. అదే పోలికల్లో ఉండే కొడుకు అజయన్ కూడా ఇదే తరహా నేపధ్యం ఉంటుంది. కట్ చేస్తే వర్తమానంలో మనవడు కుంజికెలు (టోవినో థామస్) తమ వంశంకున్న మచ్చ వల్ల ఇబ్బందులు పడుతుంటాడు. దొంగ కాకపోయినా ఆ ముద్ర మోయాల్సి వస్తుంది. ప్రియురాలు (కృతి శెట్టి) సైతం చిక్కుల్లో పడుతుంది. ఈ చిక్కుముడే అసలు కథ
విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. టోవినో థామస్ దీనికోసం చాలా కష్టపడ్డాడు. ఇతర భాషల్లో మార్కెట్ తెస్తుందనే నమ్మకంతో భారీ ప్రమోషన్లకు ప్లాన్ చేసుకున్నాడు. మొత్తం మల్లువుడ్ టీమే పనిచేసినప్పటికీ టెక్నికల్ వేల్యూస్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కృతి శెట్టికి ఒకరకంగా ఇది బంపర్ ఆఫరనే చెప్పాలి. తెలుగులో వరస డిజాస్టర్లతో మార్కెట్ బాగా పడిపోయిన టైంలో ఈ ఏఆర్ఎం వస్తోంది. వినాయకచవితి పండగ తర్వాత వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా మీద అంచనాలు రేగేలా ట్రైలర్ కట్ చేశారు. బడ్జెట్ వంద కోట్లకు పైగానే అయ్యిందట. జితిన్ లాల్ దర్శకుడు.
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…