కీరవాణి చిన్న కొడుకు సింహా హీరోగా పరిచయం అయిన సినిమా.. మత్తు వదలరా. ఇది టాలీవుడ్లో ఒక స్పెషల్ ఫిలింగా నిలిచిపోయింది. ఒక మూసలో సాగే థ్రిల్లర్ మూవీస్కు భిన్నంగా.. సరికొత్త కాన్సెప్ట్తో హాలీవుడ్ శైలిలో ప్రేక్షకులను థ్రిల్ చేసింది. అరంగేట్రంలోనే ఇలాంటి మంచి థ్రిల్లర్తో మెప్పించాడు రితీష్ రాణా.
ఇదే సినిమాతో సింహానే కాక నరేష్ అగస్త్య అనే మరో టాలెంటెడ్ నటుడు కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఐతే ఈ చిత్రం తర్వాత తనపై పెరిగిన అంచనాలను రితీష్ అందుకోలేకపోయాడు. తన రెండో సినిమా ‘హ్యాపీ బర్త్ డే’ నిరాశపరిచింది. దీంతో తర్వాత తన పేరు వినిపించలేదు. ఐతే కొంచెం గ్యాప్ తీసుకుని అతను తన అరంగేట్ర చిత్రానికి సీక్వెెల్ తీస్తున్నాడు. దీని గురించి ఈ రోజే సమాచారం బయటికి వచ్చింది.
‘మత్తు వదలరా’ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలే ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశాయి. దీని ప్రి లుక్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. దొంగతనం కాదు, తస్కరించుట అంటూ తాము చేసే పనికి సంస్కారవంతమైన పేరు పెట్టుకుని వస్తున్నారు ‘మత్తు వదలరా’ జోడీ సింహా-సత్య.
వీళ్లు ప్రొఫెషనల్ దొంగలుగా సెలక్ట్ అయిన విషయాన్ని ప్రి లుక్లో చూపించారు. మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి ఏమీ వెల్లడించలేదు కానీ.. ‘మత్తు వదలరా’కు పని చేసిన వాళ్లే చాలామంది ఇందులోనూ భాగమై ఉంటారని భావించవచ్చు.
రెండో సినిమాతో దెబ్బ తిన్న రితీష్ రాణా ఈసారి కసితో పని చేస్తాడనడంలో సందేహం లేదు. ‘మత్తు వదలరా’ తర్వాత సింహా సైతం వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేదు. చివరగా ‘ఉస్తాద్’తో అతను ఎదురు దెబ్బ తిన్నాడు. అతడికి మళ్లీ ఈ సీక్వెల్తో సక్సెస్ వస్తుందేమో చూడాలి.
This post was last modified on August 26, 2024 6:46 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…