కీరవాణి చిన్న కొడుకు సింహా హీరోగా పరిచయం అయిన సినిమా.. మత్తు వదలరా. ఇది టాలీవుడ్లో ఒక స్పెషల్ ఫిలింగా నిలిచిపోయింది. ఒక మూసలో సాగే థ్రిల్లర్ మూవీస్కు భిన్నంగా.. సరికొత్త కాన్సెప్ట్తో హాలీవుడ్ శైలిలో ప్రేక్షకులను థ్రిల్ చేసింది. అరంగేట్రంలోనే ఇలాంటి మంచి థ్రిల్లర్తో మెప్పించాడు రితీష్ రాణా.
ఇదే సినిమాతో సింహానే కాక నరేష్ అగస్త్య అనే మరో టాలెంటెడ్ నటుడు కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఐతే ఈ చిత్రం తర్వాత తనపై పెరిగిన అంచనాలను రితీష్ అందుకోలేకపోయాడు. తన రెండో సినిమా ‘హ్యాపీ బర్త్ డే’ నిరాశపరిచింది. దీంతో తర్వాత తన పేరు వినిపించలేదు. ఐతే కొంచెం గ్యాప్ తీసుకుని అతను తన అరంగేట్ర చిత్రానికి సీక్వెెల్ తీస్తున్నాడు. దీని గురించి ఈ రోజే సమాచారం బయటికి వచ్చింది.
‘మత్తు వదలరా’ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలే ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశాయి. దీని ప్రి లుక్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. దొంగతనం కాదు, తస్కరించుట అంటూ తాము చేసే పనికి సంస్కారవంతమైన పేరు పెట్టుకుని వస్తున్నారు ‘మత్తు వదలరా’ జోడీ సింహా-సత్య.
వీళ్లు ప్రొఫెషనల్ దొంగలుగా సెలక్ట్ అయిన విషయాన్ని ప్రి లుక్లో చూపించారు. మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి ఏమీ వెల్లడించలేదు కానీ.. ‘మత్తు వదలరా’కు పని చేసిన వాళ్లే చాలామంది ఇందులోనూ భాగమై ఉంటారని భావించవచ్చు.
రెండో సినిమాతో దెబ్బ తిన్న రితీష్ రాణా ఈసారి కసితో పని చేస్తాడనడంలో సందేహం లేదు. ‘మత్తు వదలరా’ తర్వాత సింహా సైతం వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేదు. చివరగా ‘ఉస్తాద్’తో అతను ఎదురు దెబ్బ తిన్నాడు. అతడికి మళ్లీ ఈ సీక్వెల్తో సక్సెస్ వస్తుందేమో చూడాలి.
This post was last modified on August 26, 2024 6:46 pm
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…
హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…
ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…
తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…