ఒకప్పుడు టాలీవుడ్లో బిజీయెస్ట్ యంగ్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు నారా రోహిత్. తన సినిమాలు తొమ్మిది ఒకే సమయంలో వివిధ దశల్లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి నటుడు నాలుగైదేళ్ల పాటు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు.
ఇక తన కెరీర్ ముగిసిందని అనుకుంటున్న సమయంలో ‘ప్రతినిధి-2’ ద్వారా ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ‘సుందరకాండ’ అనే కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు నారా రోహిత్. ఈ సినిమా టీజర్ సోమవారమే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మీడియాను కలిసిన రోహిత్ తన కెరీర్లో గ్యాప్ రావడానికి కారణమేంటో వివరించాడు. ‘‘2017, 2018లో నేను చేసిన సినిమాలు చూసుకుంటే నాకే నచ్చలేదు.
ఆ టైంలో కమర్షియల్గా ప్రయత్నిద్దామని ప్రయత్నించి ఫెయిలయ్యాను. ఐతే నా సినిమాలు అందరికీ నచ్చడానికి నేనేమీ దేవుడిని కాదు. మామూలు వ్యక్తిని. జీవితం మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు. అందుకే తర్వాత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది’’ అని రోహిత్ తెలిపాడు.
‘ప్రతినిధి-2’ ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపిందా అని రోహిత్ను అడిగితే.. తనకా విషయం తెలియదని. దానికి, ఎన్నికలకు సంబంధం లేదని చెప్పాడు. ప్రజలకు అన్నీ తెలుసని.. సినిమాల ద్వారా ప్రభావితం అవుతారని తాను అనుకోనని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ప్రతినిధి-3 చేస్తారా అని అడిగితే.. ప్రతినిధి-2 ఫలితం చూసే ఈ మాట అడుగుతున్నారా అని ప్రశ్నించడం ద్వారా ఆ సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఈ ఫ్రాంఛైజీలో ఇంకో సినిమా ఉండదని చెప్పకనే చెప్పేశాడు రోహిత్.
భవిష్యత్తులో ఏదైనా రాజకీయ పదవి చేపడతారా అని రోహిత్ను ప్రశ్నిస్తే.. దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేనని, అన్నింటికీ కాలమే సమాధానం ఇస్తుందని వేదాంత ధోరణిలో సమాధానమిచ్చాడు రోహిత్. పెళ్లి కాన్సెప్ట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి ఉండొచ్చని.. కానీ వాటికంటే ‘సుందరకాండ’ భిన్నంగా ఉంటుందని, ఈ కథలో హీరోకు జరిగినట్లు నిజ జీవితంలో జరిగితే గుండె ఆగిపోతుందని.. కానీ సినిమాలో అది వినోదాత్మకంగా ఉంటుందని రోహిత్ తెలిపాడు.
This post was last modified on August 26, 2024 6:13 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…