యూత్ ఫుల్ కంటెంట్ ఉంటేనో లేదా ఇమేజ్ ఉన్న హీరో అయితేనో తప్ప తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలకు జనాన్ని థియేటర్ కు రప్పించడం కష్టం. అలాంటిది రావు రమేష్ ని టైటిల్ రోల్ లో పెట్టి చేయడమంటే సాహసమే. ఎంత సుకుమార్ భార్య తబిత నిర్మాతగా వ్యవహరించినా సరే ప్రేక్షకులు గుడ్డిగా టికెట్లు కొనరుగా. అందుకే అల్లు అర్జున్ ని తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. స్నేహితుల గురించి తన స్పీచ్ లో చెప్పిన తీరు వేరే అర్థంలోకి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏదైతేనేం మొత్తానికి జనం దృష్టిలో పడేందుకు ఇదంతా బాగా ఉపయోగపడింది.
కట్ చేస్తే మారుతీనగర్ సుబ్రహ్మణ్యంకు వీకెండ్ లో డీసెంట్ ఆక్యుపెన్సిలు దక్కాయి. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో 8 వేలకు దగ్గరగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోవడమే దానికి నిదర్శనం. ఇందులో సగం కూడా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ నమోదు చేయలేకపోయాయి. కమిటీ కుర్రాళ్ళు, ఆయ్ లు తమ జోరుని కొనసాగించి పదివేలకు పైగా నెంబర్ చూపించాయి. కరెంట్ బుకింగ్స్ లెక్కలు వేరుగా ఉంటాయి కాబట్టి మంచి నెంబర్లు ఆశించవచ్చు. రావు రమేష్ సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా డీసెంట్ రెస్పాన్స్ తో జనాన్ని రప్పించింది.
అజయ్ ఘోష్ లాంటి ఆర్టిస్టులు మ్యూజిక్ షాప్ మూర్తిలాంటివి చేసినా ఫలితం దక్కలేదు కానీ రావు రమేష్ ఈ మాత్రం సాధించడం గొప్ప ఫీటేనని చెప్పాలి. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో హెచ్చుతగ్గులు ఎన్ని ఉన్నప్పటికీ జనాలకు పెద్దగా ఆప్షన్లు లేకపోవడంతో థియేటర్ ఎంటర్ టైన్మెంట్ కోసం మారుతీనగర్ సుబ్రహ్మణ్యంని ఆశ్రయించారు. ప్రధాన కేంద్రాల్లో పర్వాలేదు కానీ చాలా మటుకు బిసి సెంటర్స్ లో మాత్రం దీని జోరు తక్కువగానే ఉంది. ఇంకో నాలుగు రోజుల్లో సరిపోదా శనివారం రాబోతున్న నేపథ్యంలో వీలైనంత ఆ లోగానే రాబట్టుకోవాలి.
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…