యూత్ ఫుల్ కంటెంట్ ఉంటేనో లేదా ఇమేజ్ ఉన్న హీరో అయితేనో తప్ప తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలకు జనాన్ని థియేటర్ కు రప్పించడం కష్టం. అలాంటిది రావు రమేష్ ని టైటిల్ రోల్ లో పెట్టి చేయడమంటే సాహసమే. ఎంత సుకుమార్ భార్య తబిత నిర్మాతగా వ్యవహరించినా సరే ప్రేక్షకులు గుడ్డిగా టికెట్లు కొనరుగా. అందుకే అల్లు అర్జున్ ని తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. స్నేహితుల గురించి తన స్పీచ్ లో చెప్పిన తీరు వేరే అర్థంలోకి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏదైతేనేం మొత్తానికి జనం దృష్టిలో పడేందుకు ఇదంతా బాగా ఉపయోగపడింది.
కట్ చేస్తే మారుతీనగర్ సుబ్రహ్మణ్యంకు వీకెండ్ లో డీసెంట్ ఆక్యుపెన్సిలు దక్కాయి. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో 8 వేలకు దగ్గరగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోవడమే దానికి నిదర్శనం. ఇందులో సగం కూడా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ నమోదు చేయలేకపోయాయి. కమిటీ కుర్రాళ్ళు, ఆయ్ లు తమ జోరుని కొనసాగించి పదివేలకు పైగా నెంబర్ చూపించాయి. కరెంట్ బుకింగ్స్ లెక్కలు వేరుగా ఉంటాయి కాబట్టి మంచి నెంబర్లు ఆశించవచ్చు. రావు రమేష్ సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా డీసెంట్ రెస్పాన్స్ తో జనాన్ని రప్పించింది.
అజయ్ ఘోష్ లాంటి ఆర్టిస్టులు మ్యూజిక్ షాప్ మూర్తిలాంటివి చేసినా ఫలితం దక్కలేదు కానీ రావు రమేష్ ఈ మాత్రం సాధించడం గొప్ప ఫీటేనని చెప్పాలి. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో హెచ్చుతగ్గులు ఎన్ని ఉన్నప్పటికీ జనాలకు పెద్దగా ఆప్షన్లు లేకపోవడంతో థియేటర్ ఎంటర్ టైన్మెంట్ కోసం మారుతీనగర్ సుబ్రహ్మణ్యంని ఆశ్రయించారు. ప్రధాన కేంద్రాల్లో పర్వాలేదు కానీ చాలా మటుకు బిసి సెంటర్స్ లో మాత్రం దీని జోరు తక్కువగానే ఉంది. ఇంకో నాలుగు రోజుల్లో సరిపోదా శనివారం రాబోతున్న నేపథ్యంలో వీలైనంత ఆ లోగానే రాబట్టుకోవాలి.
ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…
టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…
ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన…
టాలీవుడ్ లో జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల…
రిషికొండ పాలెస్ లను వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.పడింది. సాగర నగరం విశాఖ పర్యాటక…
బాలీవుడ్ మూవీ అల్ఫా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. అలియా భట్ టైటిల్ రోల్ పోషించగా శార్వరి వాఘ్ మరో…