ఇన్నాళ్లు మెగా అభిమానుల మధ్యే అంతరాలు ఉన్నాయని అనుకునేవాళ్లం. బయట ఫ్యాన్స్లో అంతర్గతంగా ఎన్ని గొడవలు ఉన్నా.. ఫ్యామిలీలో అందరూ కలిసే ఉన్నారనే అభిప్రాయమే ఉండేది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలతో కుటుంబంలోనూ అగాథం ఏర్పడిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో మెగా ఫ్యామిలీలో లుకలుకలు మొదలయ్యాయన్నది ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్లు చెబుతున్న మాట. ఆ టైంలో పరోక్షంగా బన్నీని టార్గెట్ చేస్తూ నాగబాబు చేసిన ఒక ట్వీట్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే.
ఆ తర్వాత అంతకంతకూ బన్నీకి, మిగతా మెగా ఫ్యామిలీలోని హీరోలకు తెలియకుండానే దూరం పెరుగుతూ పోయినట్లు తెలుస్తోంది. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
బన్నీకి, మెగా ఫ్యామిలీలోని యంగ్ హీరోలు కొందరికి దూరం ఎంత పెరిగిందో చెప్పడానికి తాజా ఉదాహరణ ఇది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముగ్గురూ రామోజీ ఫిలిం సిటీలో చాలా దగ్గర దగ్గరగానే షూటింగ్లో పాల్గొంటున్నప్పటికీ కలవలేదట.
బన్నీ సినిమా ‘పుష్ప-2’ షూట్ జరుగుతున్న సమీపంలోనే వేరే ఫ్లోర్లలో తేజు, వరుణ్ సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. కానీ తేజు, వరుణ్ ఒకరినొకరు కలుస్తున్నప్పటికీ.. వాళ్లిద్దరూ బన్నీ దగ్గరికి మాత్రం రాలేదట. ‘పుష్ప-2’ షూట్ జరుగుతున్న విషయం తెలిసీ వాళ్లు తన దగ్గరికి రాలేదట.
అలాగే బన్నీ సైతం వెళ్లి వాళ్లిద్దరినీ కలవలేదట. ఇది మెగా ఫ్యామిలీలో ఏర్పడ్డ అగాథానికి సంకేతమని.. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా మెలిగిన ఫ్యామిలీలోని హీరోలే ఇలా ఉన్నప్పుడు.. అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడడంలో ఆశ్చర్యం లేదని ఈ విషయం తెలిసిన వాళ్లు చర్చించుకుంటున్నారు.
This post was last modified on August 27, 2024 10:27 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…