ఇన్నాళ్లు మెగా అభిమానుల మధ్యే అంతరాలు ఉన్నాయని అనుకునేవాళ్లం. బయట ఫ్యాన్స్లో అంతర్గతంగా ఎన్ని గొడవలు ఉన్నా.. ఫ్యామిలీలో అందరూ కలిసే ఉన్నారనే అభిప్రాయమే ఉండేది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలతో కుటుంబంలోనూ అగాథం ఏర్పడిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో మెగా ఫ్యామిలీలో లుకలుకలు మొదలయ్యాయన్నది ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్లు చెబుతున్న మాట. ఆ టైంలో పరోక్షంగా బన్నీని టార్గెట్ చేస్తూ నాగబాబు చేసిన ఒక ట్వీట్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే.
ఆ తర్వాత అంతకంతకూ బన్నీకి, మిగతా మెగా ఫ్యామిలీలోని హీరోలకు తెలియకుండానే దూరం పెరుగుతూ పోయినట్లు తెలుస్తోంది. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
బన్నీకి, మెగా ఫ్యామిలీలోని యంగ్ హీరోలు కొందరికి దూరం ఎంత పెరిగిందో చెప్పడానికి తాజా ఉదాహరణ ఇది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముగ్గురూ రామోజీ ఫిలిం సిటీలో చాలా దగ్గర దగ్గరగానే షూటింగ్లో పాల్గొంటున్నప్పటికీ కలవలేదట.
బన్నీ సినిమా ‘పుష్ప-2’ షూట్ జరుగుతున్న సమీపంలోనే వేరే ఫ్లోర్లలో తేజు, వరుణ్ సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. కానీ తేజు, వరుణ్ ఒకరినొకరు కలుస్తున్నప్పటికీ.. వాళ్లిద్దరూ బన్నీ దగ్గరికి మాత్రం రాలేదట. ‘పుష్ప-2’ షూట్ జరుగుతున్న విషయం తెలిసీ వాళ్లు తన దగ్గరికి రాలేదట.
అలాగే బన్నీ సైతం వెళ్లి వాళ్లిద్దరినీ కలవలేదట. ఇది మెగా ఫ్యామిలీలో ఏర్పడ్డ అగాథానికి సంకేతమని.. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా మెలిగిన ఫ్యామిలీలోని హీరోలే ఇలా ఉన్నప్పుడు.. అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడడంలో ఆశ్చర్యం లేదని ఈ విషయం తెలిసిన వాళ్లు చర్చించుకుంటున్నారు.
This post was last modified on August 27, 2024 10:27 am
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…
నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…