Movie News

బన్నీకి వరుణ్, తేజు దగ్గర్లోనే ఉన్నా..

ఇన్నాళ్లు మెగా అభిమానుల మధ్యే అంతరాలు ఉన్నాయని అనుకునేవాళ్లం. బయట ఫ్యాన్స్‌లో అంతర్గతంగా ఎన్ని గొడవలు ఉన్నా.. ఫ్యామిలీలో అందరూ కలిసే ఉన్నారనే అభిప్రాయమే ఉండేది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలతో కుటుంబంలోనూ అగాథం ఏర్పడిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో మెగా ఫ్యామిలీలో లుకలుకలు మొదలయ్యాయన్నది ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్లు చెబుతున్న మాట. ఆ టైంలో పరోక్షంగా బన్నీని టార్గెట్ చేస్తూ నాగబాబు చేసిన ఒక ట్వీట్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే.

ఆ తర్వాత అంతకంతకూ బన్నీకి, మిగతా మెగా ఫ్యామిలీలోని హీరోలకు తెలియకుండానే దూరం పెరుగుతూ పోయినట్లు తెలుస్తోంది. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

బన్నీకి, మెగా ఫ్యామిలీలోని యంగ్ హీరోలు కొందరికి దూరం ఎంత పెరిగిందో చెప్పడానికి తాజా ఉదాహరణ ఇది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముగ్గురూ రామోజీ ఫిలిం సిటీలో చాలా దగ్గర దగ్గరగానే షూటింగ్‌లో పాల్గొంటున్నప్పటికీ కలవలేదట.

బన్నీ సినిమా ‘పుష్ప-2’ షూట్ జరుగుతున్న సమీపంలోనే వేరే ఫ్లోర్లలో తేజు, వరుణ్ సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. కానీ తేజు, వరుణ్ ఒకరినొకరు కలుస్తున్నప్పటికీ.. వాళ్లిద్దరూ బన్నీ దగ్గరికి మాత్రం రాలేదట. ‘పుష్ప-2’ షూట్ జరుగుతున్న విషయం తెలిసీ వాళ్లు తన దగ్గరికి రాలేదట.

అలాగే బన్నీ సైతం వెళ్లి వాళ్లిద్దరినీ కలవలేదట. ఇది మెగా ఫ్యామిలీలో ఏర్పడ్డ అగాథానికి సంకేతమని.. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా మెలిగిన ఫ్యామిలీలోని హీరోలే ఇలా ఉన్నప్పుడు.. అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడడంలో ఆశ్చర్యం లేదని ఈ విషయం తెలిసిన వాళ్లు చర్చించుకుంటున్నారు.

This post was last modified on August 27, 2024 10:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago