‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ అనౌన్స్ చేసిన సినిమా విషయంలో అప్పుడు మెగా అభిమానులు ఎంతగానో ఎగ్జైట్ అయ్యారు. అందుక్కారణం.. ఆ చిత్రానికి దర్శకుడు శంకర్ కావడమే. చిరంజీవి సహా ఎంతోమంది టాలీవుడ్ టాప్ స్టార్లు శంకర్తో పని చేయాలని ఆశపడి ఆ కోరిక నెరవేర్చుకోలేకపోయారు.
అలాంటి అరుదైన అవకాశం చరణ్కు దక్కిందని అభిమానులు సంతోషించారు. ఈ చిత్రం మొదలయ్యే సమయానికి శంకర్ పరిస్థితి బాగానే ఉంది. ‘2.0’ అంచనాలను అందుకోలేకపోయినా.. అది తీసిపడేయదగ్గ సినిమా ఏమీ కాదు. భారీ వసూళ్లూ రాబట్టింది.
చరణ్తో శంకర్ తన స్థాయిలో ఒక బ్లాక్బస్టర్ ఇస్తాడని ఆశించారు ఫ్యాన్స్. కానీ ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడి మొదలైన నాలుగేళ్లకు కూడా రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్రిస్మస్కు రిలీజ్ అని ప్రకటన చేశాక జరిగిన పరిణామాలు అభిమానుల్లో ఇంకా టెన్షన్ పెంచాయి.
ఇటీవలే శంకర్ కొత్త చిత్రం ‘ఇండియన్-2’ రిలీజై దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో ‘గేమ్ చేంజర్’ మీద భయాలు నెలకొన్నాయి. శంకర్ పని తీరు మీద వారికి సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ‘గేమ్ చేంజర్’ రీషూట్ అంటూ వార్తలు మొదలయ్యాయి. ‘ఇండియన్-2’ తర్వాత శంకర్లో భయం మొదలైందో, లేక జాగ్రత్త పడుతున్నాడో కానీ.. కొన్ని సన్నివేశాల విషయంలో సంతృప్తికరంగా లేరని.. మళ్లీ వాటిని చిత్రీకరించాలని భావిస్తున్నారని.. రిలీజ్ తర్వాత చింతించడం కంటే ముందే తప్పులు దిద్దుకోవడం మంచిదని భావిస్తున్నారని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
చరణ్ ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తి చేసి బుచ్చిబాబు సినిమాకు ప్రిపేరవుతున్నాడు. కానీ కొన్ని రోజులు మళ్లీ డేట్లు కావాాలని నిర్మాత దిల్ రాజు ద్వారా శంకర్ ప్రపోజల్ పెట్టాడట. అనుకున్న ప్రకారమే క్రిస్మస్కు సినిమాను రిలీజ్ చేద్దామని.. కానీ కొన్ని సీన్లు మాత్రం రీషూట్ చేద్దామని శంకర్ అంటున్నాడట. దీనిపై చరణ్, రాజు ఎలా స్పందిస్తారో చూడాలి. ఐతే రీషూట్లను నెగెటివ్ విషయంగా చూడాల్సిన అవసరమేమీ లేదు. దీని వల్ల సినిమా మెరుగు పడితే అంతకంటే ఏకావాలి?
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…