‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ అనౌన్స్ చేసిన సినిమా విషయంలో అప్పుడు మెగా అభిమానులు ఎంతగానో ఎగ్జైట్ అయ్యారు. అందుక్కారణం.. ఆ చిత్రానికి దర్శకుడు శంకర్ కావడమే. చిరంజీవి సహా ఎంతోమంది టాలీవుడ్ టాప్ స్టార్లు శంకర్తో పని చేయాలని ఆశపడి ఆ కోరిక నెరవేర్చుకోలేకపోయారు.
అలాంటి అరుదైన అవకాశం చరణ్కు దక్కిందని అభిమానులు సంతోషించారు. ఈ చిత్రం మొదలయ్యే సమయానికి శంకర్ పరిస్థితి బాగానే ఉంది. ‘2.0’ అంచనాలను అందుకోలేకపోయినా.. అది తీసిపడేయదగ్గ సినిమా ఏమీ కాదు. భారీ వసూళ్లూ రాబట్టింది.
చరణ్తో శంకర్ తన స్థాయిలో ఒక బ్లాక్బస్టర్ ఇస్తాడని ఆశించారు ఫ్యాన్స్. కానీ ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడి మొదలైన నాలుగేళ్లకు కూడా రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్రిస్మస్కు రిలీజ్ అని ప్రకటన చేశాక జరిగిన పరిణామాలు అభిమానుల్లో ఇంకా టెన్షన్ పెంచాయి.
ఇటీవలే శంకర్ కొత్త చిత్రం ‘ఇండియన్-2’ రిలీజై దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో ‘గేమ్ చేంజర్’ మీద భయాలు నెలకొన్నాయి. శంకర్ పని తీరు మీద వారికి సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ‘గేమ్ చేంజర్’ రీషూట్ అంటూ వార్తలు మొదలయ్యాయి. ‘ఇండియన్-2’ తర్వాత శంకర్లో భయం మొదలైందో, లేక జాగ్రత్త పడుతున్నాడో కానీ.. కొన్ని సన్నివేశాల విషయంలో సంతృప్తికరంగా లేరని.. మళ్లీ వాటిని చిత్రీకరించాలని భావిస్తున్నారని.. రిలీజ్ తర్వాత చింతించడం కంటే ముందే తప్పులు దిద్దుకోవడం మంచిదని భావిస్తున్నారని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
చరణ్ ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తి చేసి బుచ్చిబాబు సినిమాకు ప్రిపేరవుతున్నాడు. కానీ కొన్ని రోజులు మళ్లీ డేట్లు కావాాలని నిర్మాత దిల్ రాజు ద్వారా శంకర్ ప్రపోజల్ పెట్టాడట. అనుకున్న ప్రకారమే క్రిస్మస్కు సినిమాను రిలీజ్ చేద్దామని.. కానీ కొన్ని సీన్లు మాత్రం రీషూట్ చేద్దామని శంకర్ అంటున్నాడట. దీనిపై చరణ్, రాజు ఎలా స్పందిస్తారో చూడాలి. ఐతే రీషూట్లను నెగెటివ్ విషయంగా చూడాల్సిన అవసరమేమీ లేదు. దీని వల్ల సినిమా మెరుగు పడితే అంతకంటే ఏకావాలి?
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…