‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ అనౌన్స్ చేసిన సినిమా విషయంలో అప్పుడు మెగా అభిమానులు ఎంతగానో ఎగ్జైట్ అయ్యారు. అందుక్కారణం.. ఆ చిత్రానికి దర్శకుడు శంకర్ కావడమే. చిరంజీవి సహా ఎంతోమంది టాలీవుడ్ టాప్ స్టార్లు శంకర్తో పని చేయాలని ఆశపడి ఆ కోరిక నెరవేర్చుకోలేకపోయారు.
అలాంటి అరుదైన అవకాశం చరణ్కు దక్కిందని అభిమానులు సంతోషించారు. ఈ చిత్రం మొదలయ్యే సమయానికి శంకర్ పరిస్థితి బాగానే ఉంది. ‘2.0’ అంచనాలను అందుకోలేకపోయినా.. అది తీసిపడేయదగ్గ సినిమా ఏమీ కాదు. భారీ వసూళ్లూ రాబట్టింది.
చరణ్తో శంకర్ తన స్థాయిలో ఒక బ్లాక్బస్టర్ ఇస్తాడని ఆశించారు ఫ్యాన్స్. కానీ ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడి మొదలైన నాలుగేళ్లకు కూడా రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్రిస్మస్కు రిలీజ్ అని ప్రకటన చేశాక జరిగిన పరిణామాలు అభిమానుల్లో ఇంకా టెన్షన్ పెంచాయి.
ఇటీవలే శంకర్ కొత్త చిత్రం ‘ఇండియన్-2’ రిలీజై దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో ‘గేమ్ చేంజర్’ మీద భయాలు నెలకొన్నాయి. శంకర్ పని తీరు మీద వారికి సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ‘గేమ్ చేంజర్’ రీషూట్ అంటూ వార్తలు మొదలయ్యాయి. ‘ఇండియన్-2’ తర్వాత శంకర్లో భయం మొదలైందో, లేక జాగ్రత్త పడుతున్నాడో కానీ.. కొన్ని సన్నివేశాల విషయంలో సంతృప్తికరంగా లేరని.. మళ్లీ వాటిని చిత్రీకరించాలని భావిస్తున్నారని.. రిలీజ్ తర్వాత చింతించడం కంటే ముందే తప్పులు దిద్దుకోవడం మంచిదని భావిస్తున్నారని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
చరణ్ ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తి చేసి బుచ్చిబాబు సినిమాకు ప్రిపేరవుతున్నాడు. కానీ కొన్ని రోజులు మళ్లీ డేట్లు కావాాలని నిర్మాత దిల్ రాజు ద్వారా శంకర్ ప్రపోజల్ పెట్టాడట. అనుకున్న ప్రకారమే క్రిస్మస్కు సినిమాను రిలీజ్ చేద్దామని.. కానీ కొన్ని సీన్లు మాత్రం రీషూట్ చేద్దామని శంకర్ అంటున్నాడట. దీనిపై చరణ్, రాజు ఎలా స్పందిస్తారో చూడాలి. ఐతే రీషూట్లను నెగెటివ్ విషయంగా చూడాల్సిన అవసరమేమీ లేదు. దీని వల్ల సినిమా మెరుగు పడితే అంతకంటే ఏకావాలి?
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…