డిప్యూటీ సిఎంగా ఊపిరిసలపని పనులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాల మీద మెల్లగా దృష్టి పెడుతున్నారు. పెండింగ్ ఉన్న వాటి నిర్మాతలను పిలిపించి వాటి స్టేటస్ ఏంటో కనుక్కుంటున్నారు. ఇప్పటికీ దానయ్య, సుజిత్, జ్యోతికృష్ణలతో మీటింగ్ పూర్తవ్వగా హరీష్ శంకర్, మైత్రి మేకర్స్ కలయికకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పాలన వ్యవహారాలలో తీరిక దొరికే సమయం తక్కువగా ఉండటంతో ప్రాధాన్యత క్రమం ఎలా ఇవ్వాలనే దాని మీద పలు కోణాల్లో డిస్కషన్లు జరిగాయట. ఫ్యాన్స్ విపరీత అంచనాలు పెట్టుకున్న ఓజి సంగతి ముందు చూద్దాం.
కనీసం ఇంకో నలభై రోజులు డేట్లు ఇస్తే సుజిత్ మొత్తం పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక షెడ్యూల్ ముంబైలో ప్లాన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఇక్కడే హైదరాబాద్ లేదా ఏపిలో మేనేజ్ చేయాలంటే అదనంగా చాలా ఖర్చుని భరించాల్సి ఉంటుంది. పైగా ఒక ఫారిన్ ప్లానింగ్ కూడా ఉందట. వీటికి ప్రత్యాన్మయం ఉందా లేదానే దాని మీద త్వరలో ఒక నిర్ధారణకు రావొచ్చు. హరిహర వీరమల్లుకి అమరావతికి దగ్గరలో గ్రీన్ మ్యాట్ వేసి తీసే ఆలోచన ఏఎం రత్నం చేస్తున్నారట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లిస్టు చివరిలో ఉంది. కొంత లేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఈ మూడు సినిమాలు కాకుండా పవన్ ఇకపై కొత్త కమిట్ మెంట్లు ఇవ్వలేనని చెబుతున్నారట. బాలయ్య తరహాలో రెండు పడవల ప్రయాణం సాధ్యం కాదు. ఎందుకంటే పవన్ కేవలం గెలిచిన ఎమ్మెల్యే మాత్రమే కాదు. ఉప ముఖ్యమంత్రితో పాటు నాలుగు కీలక శాఖలు చేతిలో ఉన్నాయి. కాబట్టి బాలయ్యను ఫాలో అయ్యే ఛాన్స్ లేదు. సురేందర్ రెడ్డితో రామ్ తాళ్ళూరి ప్లాన్ చేసుకున్న యాక్షన్ మూవీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. చూస్తుంటే నాలుగున్నర ఏళ్ళలో పవన్ అభిమానులు పైన చెప్పిన మూడు సినిమాలతోనే సర్దుకునే పరిస్థితి రావొచ్చు. మహా అయితే ఇంకొక్కటి తోడవ్వచ్చు.
This post was last modified on August 23, 2024 5:06 pm
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…
హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…
ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…
తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…