డిప్యూటీ సిఎంగా ఊపిరిసలపని పనులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాల మీద మెల్లగా దృష్టి పెడుతున్నారు. పెండింగ్ ఉన్న వాటి నిర్మాతలను పిలిపించి వాటి స్టేటస్ ఏంటో కనుక్కుంటున్నారు. ఇప్పటికీ దానయ్య, సుజిత్, జ్యోతికృష్ణలతో మీటింగ్ పూర్తవ్వగా హరీష్ శంకర్, మైత్రి మేకర్స్ కలయికకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పాలన వ్యవహారాలలో తీరిక దొరికే సమయం తక్కువగా ఉండటంతో ప్రాధాన్యత క్రమం ఎలా ఇవ్వాలనే దాని మీద పలు కోణాల్లో డిస్కషన్లు జరిగాయట. ఫ్యాన్స్ విపరీత అంచనాలు పెట్టుకున్న ఓజి సంగతి ముందు చూద్దాం.
కనీసం ఇంకో నలభై రోజులు డేట్లు ఇస్తే సుజిత్ మొత్తం పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక షెడ్యూల్ ముంబైలో ప్లాన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఇక్కడే హైదరాబాద్ లేదా ఏపిలో మేనేజ్ చేయాలంటే అదనంగా చాలా ఖర్చుని భరించాల్సి ఉంటుంది. పైగా ఒక ఫారిన్ ప్లానింగ్ కూడా ఉందట. వీటికి ప్రత్యాన్మయం ఉందా లేదానే దాని మీద త్వరలో ఒక నిర్ధారణకు రావొచ్చు. హరిహర వీరమల్లుకి అమరావతికి దగ్గరలో గ్రీన్ మ్యాట్ వేసి తీసే ఆలోచన ఏఎం రత్నం చేస్తున్నారట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లిస్టు చివరిలో ఉంది. కొంత లేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఈ మూడు సినిమాలు కాకుండా పవన్ ఇకపై కొత్త కమిట్ మెంట్లు ఇవ్వలేనని చెబుతున్నారట. బాలయ్య తరహాలో రెండు పడవల ప్రయాణం సాధ్యం కాదు. ఎందుకంటే పవన్ కేవలం గెలిచిన ఎమ్మెల్యే మాత్రమే కాదు. ఉప ముఖ్యమంత్రితో పాటు నాలుగు కీలక శాఖలు చేతిలో ఉన్నాయి. కాబట్టి బాలయ్యను ఫాలో అయ్యే ఛాన్స్ లేదు. సురేందర్ రెడ్డితో రామ్ తాళ్ళూరి ప్లాన్ చేసుకున్న యాక్షన్ మూవీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. చూస్తుంటే నాలుగున్నర ఏళ్ళలో పవన్ అభిమానులు పైన చెప్పిన మూడు సినిమాలతోనే సర్దుకునే పరిస్థితి రావొచ్చు. మహా అయితే ఇంకొక్కటి తోడవ్వచ్చు.
This post was last modified on August 23, 2024 5:06 pm
ప్రభాస్ సినిమా అంటే చాలు.. వందల కోట్ల బడ్జెట్, అంతకుమించిన బిజినెస్ మామూలైపోయింది. ప్రభాస్ ఈ మధ్య చేసిన వాటిలో…
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి…
ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర…
పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్…
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ…
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…