Movie News

రామ్ చరణ్ ఫుల్ లెన్త్ కామెడీ చేస్తే

గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నా దానికన్నా ఎక్కువ ఆసక్తిగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సినిమా ఆర్సి 16. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ పాత్రలో ఫుల్ కామెడీ టచ్  ఉంటుందనే వార్త విని అభిమానులు షాకయ్యారు.

హీరో మోటో కార్ప్ కు సంబంధించిన ఒక లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నాక స్వయంగా చరణే ఈ ముచ్చట పంచుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే పెద్ది అనే టైటిల్ తప్ప ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఎలాంటి లీక్ ఇప్పటిదాకా బయటికి రాలేదు.

చరణ్ గతంలో నాయక్ లాంటి చిత్రాల్లో కామెడీ చేశాడు కానీ వాటిలో బ్రహ్మానందం లాంటి ఆర్టిస్టుల సపోర్ట్ వల్ల అవి వర్కౌట్ అయ్యాయి. కానీ బుచ్చిబాబు సోలోగా రామ్ చరణ్ తోనే హాస్యం చేయించేలా రాసుకున్నాడట.

అలాని ఇదేమి కేవలం ఎంటర్ టైనర్ గా ఉండదని ఇన్ సైడ్ టాక్. ఫస్ట్ హాఫ్ లో ఫన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయని, రెండో సగంలో సీరియస్ ఎలిమెంట్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తాయని అంటున్నారు.

చిరంజీవి కామెడీ టైమింగ్ చంటబ్బాయి, దొంగమొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్స్ లో ఓ రేంజ్ లో పేలేలా ఉంటుంది.

కానీ రామ్ చరణ్ మీద అంత ఫుల్ లెన్త్ హాస్యాన్ని ఎవరూ ట్రై చేయలేదు. ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆచార్యలో క్యామియో చేసి డిజాస్టర్ అందుకున్న రామ్ చరణ్ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత గేమ్ ఛేంజర్ తో రాబోతున్నాడు. బుచ్చిబాబుది ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఫ్యాన్స్ 2026 సంక్రాంతిని కోరుకుంటున్నారు.

అయితే అదే సీజన్ కి మైత్రినే నిర్మిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఉంది కనక ఖచ్చితంగా సాధ్యమవుతుందో లేదో చెప్పలేం.జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆర్సి 16 అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. 

This post was last modified on August 23, 2024 11:35 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

46 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago