రెండు నెలల కిందట తెలుగులో ‘మహారాజ’ అనే సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైంది. కానీ రిలీజ్ తర్వాత అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో విజయ్ సేతుపతి హీరో. అతడికి నటుడిగా గొప్ప పేరుంది. క్యారెక్టర్, విలన్ పాత్రల్లో అదరగొట్టేస్తుంటాడు. కానీ సోలో హీరోగా చేసిన సినిమాల్లో విజయాలు తక్కువే.
ఒక దశలో సోలో హీరోగా వరుసగా ఫ్లాపులు రావడంతో అవి ఆపేశాడు. క్యారెక్టర్, విలన్ రోల్సే చేస్తూ సాగాడు. ఐతే కెరీర్లో 50వ సినిమా మైలురాయి ముంగిట నిలవడంతో సేతుపతి సోలో హీరోగా ‘మహారాజ’ సినిమ ా చేశాడు. దీనికి అదిరిపోయే కథను ఎంచుకోవడంతో సినిమా సూపర్ హిట్ అయింది.
ఓటీటీలో ఈ చిత్రం మరింతగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెట్ ఫ్లిక్స్లో ఈ ఏడాది మోస్ట్ వ్యూడ్ ఇండియన్ మూవీగా రికార్డు కూడా సృష్టించింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు సోలో హీరోగా మరో సెన్సేషనల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సేతుపతి. ఆ చిత్రమే.. ట్రైన్.
తమిళంలో విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే దర్శకుడు మిస్కిన్. రాజు భాయ్ ఒరిజినల్ ‘చిత్తిరం పేసిదడి’తో మొదలుపెడితే అంజాదే, నందలాల, యుద్ధం సెయ్, సైకో, తుప్పరివాలన్ (డిటెక్టివ్), పిశాచి లాంటి మూవీస్తో తనకంటూ ప్రత్యేకంగా ఓ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నాడు మిస్కిన్.
ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ తీస్తూ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచుతాడు మిస్కిన్. ఇలాంటి దర్శకుడు.. సేతుపతి లాంటి మేటి నటుడితో జట్టు కట్టడం ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించేదే. విశేషం ఏంటంటే.. ఇందులో శ్రుతి హాసన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది.
‘ట్రైన్’ కోసం సేతుపతి బాగా గడ్డం పెంచి చిత్రమైన లుక్లో కనిపిస్తున్నాడు. దీని ఆన్ లొకేషన్ పిక్స్ చూస్తుంటే.. సినిమా కథ అంతా ఒక ట్రైన్లోనే నడిచేలా కనిపిస్తోంది. మరి ఆ రైలు బండిలో మిస్కిన్ ఎంత రసవత్తరంగా కథను నడిపిస్తాడో.. సేతుపతి ఇందులో నటుడిగా తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటాడో చూడాలి.
This post was last modified on August 23, 2024 8:05 am
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…