రెండు నెలల కిందట తెలుగులో ‘మహారాజ’ అనే సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైంది. కానీ రిలీజ్ తర్వాత అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో విజయ్ సేతుపతి హీరో. అతడికి నటుడిగా గొప్ప పేరుంది. క్యారెక్టర్, విలన్ పాత్రల్లో అదరగొట్టేస్తుంటాడు. కానీ సోలో హీరోగా చేసిన సినిమాల్లో విజయాలు తక్కువే.
ఒక దశలో సోలో హీరోగా వరుసగా ఫ్లాపులు రావడంతో అవి ఆపేశాడు. క్యారెక్టర్, విలన్ రోల్సే చేస్తూ సాగాడు. ఐతే కెరీర్లో 50వ సినిమా మైలురాయి ముంగిట నిలవడంతో సేతుపతి సోలో హీరోగా ‘మహారాజ’ సినిమ ా చేశాడు. దీనికి అదిరిపోయే కథను ఎంచుకోవడంతో సినిమా సూపర్ హిట్ అయింది.
ఓటీటీలో ఈ చిత్రం మరింతగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెట్ ఫ్లిక్స్లో ఈ ఏడాది మోస్ట్ వ్యూడ్ ఇండియన్ మూవీగా రికార్డు కూడా సృష్టించింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు సోలో హీరోగా మరో సెన్సేషనల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సేతుపతి. ఆ చిత్రమే.. ట్రైన్.
తమిళంలో విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే దర్శకుడు మిస్కిన్. రాజు భాయ్ ఒరిజినల్ ‘చిత్తిరం పేసిదడి’తో మొదలుపెడితే అంజాదే, నందలాల, యుద్ధం సెయ్, సైకో, తుప్పరివాలన్ (డిటెక్టివ్), పిశాచి లాంటి మూవీస్తో తనకంటూ ప్రత్యేకంగా ఓ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నాడు మిస్కిన్.
ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ తీస్తూ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచుతాడు మిస్కిన్. ఇలాంటి దర్శకుడు.. సేతుపతి లాంటి మేటి నటుడితో జట్టు కట్టడం ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించేదే. విశేషం ఏంటంటే.. ఇందులో శ్రుతి హాసన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది.
‘ట్రైన్’ కోసం సేతుపతి బాగా గడ్డం పెంచి చిత్రమైన లుక్లో కనిపిస్తున్నాడు. దీని ఆన్ లొకేషన్ పిక్స్ చూస్తుంటే.. సినిమా కథ అంతా ఒక ట్రైన్లోనే నడిచేలా కనిపిస్తోంది. మరి ఆ రైలు బండిలో మిస్కిన్ ఎంత రసవత్తరంగా కథను నడిపిస్తాడో.. సేతుపతి ఇందులో నటుడిగా తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటాడో చూడాలి.
This post was last modified on August 23, 2024 8:05 am
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…