భోళా శంకర్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చిరంజీవి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పుట్టినరోజు సందర్భంగా నిమిషం నిడివి ఉన్న టీజర్ వస్తుందనే వార్త వచ్చింది కానీ ఖరారుగా తెలియడం లేదు. ఇదిలా ఉండగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విశ్వంభరుడు అనే ఆన్ లైన్ ప్రోగ్రాంకి అతిథిగా విచ్చేసిన దర్శకుడు విశిష్ట ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగించే మాటలు చెప్పాడు. సినిమా గురించి ఎంతైనా ఊహించుకోమని, అంతకు పదింతలు ఎక్కువ సంతృప్తి చెందేలా ఒక అభిమానిగా సినిమా తీశానని అన్నాడు.
ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని చూపించడంతో పాటు ఇప్పటిదాకా ఎవరూ అన్నయ్యతో చేయని సబ్జెక్టుని హ్యాండిల్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. స్వయంగా ఒక ఫ్యాన్ తీస్తే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఖచ్చితంగా అంచనాలు అందుకుంటుందని ఊరించాడు. అయితే టీజర్ అనౌన్స్ మెంట్ త్వరలో ఉంటుందని చెప్పాడు కానీ బర్త్ డే గిఫ్టని మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ వీడియో బైట్ తో ఒక్కసారిగా విశ్వంభర ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇంద్ర 4K ప్రింట్ తో పాటు అటాచ్ చేస్తారనే టాక్ వచ్చినా అది నిజం కాదు. థియేటర్లలో ప్రదర్శించాలంటే ముందు సెన్సార్ అవ్వాలి. కానీ జరగలేదని సమాచారం.
జనవరి 10 విడుదల కాబోతున్న విశ్వంభర ఖచ్చితంగా సంక్రాంతి విజేతగా నిలుస్తుందని వశిష్ట చెప్పడం చూస్తే కంటెంట్ మాములుగా ఉండేలా కనిపించడం లేదు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ డ్రామాలో ఆశికా రంగనాథ్, సురభి లాంటి గ్లామర్ ఆకర్షణలు చాల ఉన్నాయి. మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపించింది కానీ కన్ఫర్మేషన్ కావాల్సి ఉంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న విశ్వంభరలో అయిదు పాటలు ఉంటాయని టాక్. విశ్వంభర తర్వాత దర్శకుడు మోహన్ రాజాతో చేయబోయే సినిమా వార్త ఉంది కానీ దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.
This post was last modified on August 22, 2024 10:11 am
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…